ETV Bharat / sports

T20 worldcup: బంగ్లాదేశ్​తో మ్యాచ్​కు రెడీ.. టీమ్​ఇండియాకు అదొక్కటే సమస్య

author img

By

Published : Nov 1, 2022, 3:25 PM IST

టీ20 ప్రపంచకప్‌లో అడిలైడ్‌ వేదికగా రేపు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. టోర్నీలో రెండు విజయాలు, ఒక పరాజయాన్ని ఖాతాలో వేసుకున్న టీమిండియా.. బంగ్లాదేశ్‌పై నెగ్గి...సెమీస్‌ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని కోరుకుంటోంది. వెన్నునొప్పితో బాధపడుతున్న దినేష్‌ కార్తీక్ స్థానంలో రిషబ్‌ పంత్‌ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇండియా బంగ్లాదేశ్​ టీ20
india will face bangladesh tomorrow t20worldcup

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌పై నెగ్గి దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత జట్టు...తదుపరి మ్యాచ్‌ కోసం సిద్ధమైంది. అడిలైడ్‌ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బ్యాటింగ్‌లో కేఎల్​ రాహుల్‌ పేలవ ఫామ్‌ భారత జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. మూడు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్‌ కేవలం 22 పరుగులే చేశాడు. పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా వంటి పటిష్ఠమైన బౌలింగ్‌ ఎటాక్‌లను ఎదుర్కొనేందుకు రాహుల్ తడబడ్డాడు. ఐతే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను కొనసాగించేందుకే టీమ్‌మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం టోర్నీలో సూర్యకుమార్‌ యాదవ్‌, విరాట్‌ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. నెదర్లాండ్స్‌పై రోహిత్‌ శర్మ అర్థశతకంతో రాణించాడు.

ఇక వికెట్‌ కీపర్‌ దినేష్‌కార్తీక్‌ వెన్నునొప్పితో బాధపడుతుండటంతో అతని స్థానంలో రిషబ్‌ పంత్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న రిషబ్‌ పంత్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. దినేష్‌కార్తీక్‌ గాయపడటంతో పంత్‌ తుదిజట్టులోకి రావడం దాదాపు ఖాయమైనట్లే. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సహా నలుగురు లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ను జట్టులో కొనసాగిస్తారా లేదా అతని స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తీసుకొస్తారా వేచి చూడాలి. పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ రాణిస్తుండటం భారత్‌కు కలిసివచ్చే అంశం.

మరోవైపు ఈ టోర్నీలో చిన్న జట్లతో ఆడిన రెండు మ్యాచుల్లోనూ బంగ్లాదేశ్‌ చెమటోడ్చి నెగ్గింది. జింబాబ్వేతో ఉత్కంఠభరిత పోరులో నెగ్గిన బంగ్లాదేశ్‌ నెదర్లాండ్స్‌పై కూడా విజయం కోసం శ్రమించాల్సి వచ్చింది. ఎదుర్కొన్నవి చిన్నజట్లే అయినా బంగ్లా బ్యాటర్లు మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. ఓపెనర్‌ నజ్ముల్ హుస్సేన్ శాంటో మాత్రమే రెండు మ్యాచ్‌ల్లో కలిపి 100కిపైగా పరుగులు చేశాడు. నాణ్యమైన భారత బౌలింగ్‌పై వీరు ఎలా రాణిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. టాస్‌ గెలిచే జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. అడిలైడ్‌ పిచ్‌ ఆరంభంలో పేసర్లకు సహకరిస్తుండటమే అందుకు కారణం. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌పై నెగ్గి దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత జట్టు...తదుపరి మ్యాచ్‌ కోసం సిద్ధమైంది. అడిలైడ్‌ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బ్యాటింగ్‌లో కేఎల్​ రాహుల్‌ పేలవ ఫామ్‌ భారత జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. మూడు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్‌ కేవలం 22 పరుగులే చేశాడు. పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా వంటి పటిష్ఠమైన బౌలింగ్‌ ఎటాక్‌లను ఎదుర్కొనేందుకు రాహుల్ తడబడ్డాడు. ఐతే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను కొనసాగించేందుకే టీమ్‌మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం టోర్నీలో సూర్యకుమార్‌ యాదవ్‌, విరాట్‌ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. నెదర్లాండ్స్‌పై రోహిత్‌ శర్మ అర్థశతకంతో రాణించాడు.

ఇక వికెట్‌ కీపర్‌ దినేష్‌కార్తీక్‌ వెన్నునొప్పితో బాధపడుతుండటంతో అతని స్థానంలో రిషబ్‌ పంత్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న రిషబ్‌ పంత్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. దినేష్‌కార్తీక్‌ గాయపడటంతో పంత్‌ తుదిజట్టులోకి రావడం దాదాపు ఖాయమైనట్లే. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సహా నలుగురు లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ను జట్టులో కొనసాగిస్తారా లేదా అతని స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తీసుకొస్తారా వేచి చూడాలి. పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ రాణిస్తుండటం భారత్‌కు కలిసివచ్చే అంశం.

మరోవైపు ఈ టోర్నీలో చిన్న జట్లతో ఆడిన రెండు మ్యాచుల్లోనూ బంగ్లాదేశ్‌ చెమటోడ్చి నెగ్గింది. జింబాబ్వేతో ఉత్కంఠభరిత పోరులో నెగ్గిన బంగ్లాదేశ్‌ నెదర్లాండ్స్‌పై కూడా విజయం కోసం శ్రమించాల్సి వచ్చింది. ఎదుర్కొన్నవి చిన్నజట్లే అయినా బంగ్లా బ్యాటర్లు మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. ఓపెనర్‌ నజ్ముల్ హుస్సేన్ శాంటో మాత్రమే రెండు మ్యాచ్‌ల్లో కలిపి 100కిపైగా పరుగులు చేశాడు. నాణ్యమైన భారత బౌలింగ్‌పై వీరు ఎలా రాణిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. టాస్‌ గెలిచే జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. అడిలైడ్‌ పిచ్‌ ఆరంభంలో పేసర్లకు సహకరిస్తుండటమే అందుకు కారణం. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

ఇదీ చదవండి:న్యూజిలాండ్​-బంగ్లాదేశ్​తో టూర్‌.. కెప్టెన్లుగా హార్దిక్​, ధావన్​​

బంగ్లాదేశ్​తో మ్యాచ్​.. దినేశ్ కార్తీక్​ వర్సెస్​ పంత్​.. ఆడేది ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.