ETV Bharat / sports

విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్​.. లంక కెప్టెన్ ఒంటరిపోరు

INDIA VS SRI LANKA: టీమ్​ఇండియాతో గులాబీ టెస్టులో మూడు రోజు టీ విరామానికి 151/4 పరుగుల వద్ద నిలిచింది శ్రీలంక. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. విజయానికి మరో 296 పరుగులు చేయాల్సి ఉంది.

author img

By

Published : Mar 14, 2022, 4:13 PM IST

INDIA VS SRI LANKA
INDIA VS SRI LANKA 2ND TEST 2022

INDIA VS SRI LANKA: టీమ్​ఇండియాతో జరుగుతున్న గులాబీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనలో ఉన్న శ్రీలంక.. పోరాటం కొనసాగిస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో మూడో రోజు ఆట తొలి సెషన్​ ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. లంక సారథి దిముత్ కరుణరత్నె (67) ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు డిక్వెల్లా (10) క్రీజులో ఉన్నాడు. కుశాల్​ మెండిస్​ (54) అర్ధశతకంతో మెరవగా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు.

రెండో ఇన్నింగ్స్​లో టీ విరామం సమయానికి భారత బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా, జడేజా తలో వికెట్ పడగొట్టారు. విజయానికి లంక మరో 296 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్​ మిగిలిన 6 వికెట్లను పడగొట్టాల్సి ఉంది.

INDIA VS SRI LANKA: టీమ్​ఇండియాతో జరుగుతున్న గులాబీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనలో ఉన్న శ్రీలంక.. పోరాటం కొనసాగిస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో మూడో రోజు ఆట తొలి సెషన్​ ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. లంక సారథి దిముత్ కరుణరత్నె (67) ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు డిక్వెల్లా (10) క్రీజులో ఉన్నాడు. కుశాల్​ మెండిస్​ (54) అర్ధశతకంతో మెరవగా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు.

రెండో ఇన్నింగ్స్​లో టీ విరామం సమయానికి భారత బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా, జడేజా తలో వికెట్ పడగొట్టారు. విజయానికి లంక మరో 296 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్​ మిగిలిన 6 వికెట్లను పడగొట్టాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.