ETV Bharat / sports

మెరిసిన పాండ్య, కోహ్లీ.. ఆస్ట్రేలియా లక్ష్యం 303

మూడో వన్డేలో ఆస్ట్రేలియాకు 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కోహ్లీసేన. తొలి రెండు వన్డేల్లో గెలిచి ఫుల్​ జోష్​లో ఉన్న ఆసీస్​ బ్యాట్స్​మన్..​ దీనిని ఛేదిస్తారో లేదో చూడాలి.

author img

By

Published : Dec 2, 2020, 12:41 PM IST

Updated : Dec 2, 2020, 12:54 PM IST

teamindia
టీమ్​ఇండియా

కాన్​బెర్రాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్​ చేసిన టీమ్​ఇండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు సాధించింది. ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య(92*), సారథి కోహ్లీ(63), జడేజా(66) అర్ధశతకాలతో మెరిశారు​. మిగతా బ్యాట్స్​మన్ నామమాత్రపు పరుగులు చేశారు. ఆసీస్​ బౌలర్లలో అగర్​ 2, జంపా, హెజిల్​వుడ్​, సీన్​ అబాట్​ తలో వికెట్​ తీశారు.

సచిన్​ రికార్డు బద్దలు

ఈ పోరులో టీమ్​ఇండియా సారథి కోహ్లీ(63).. దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ రికార్డును బద్దలకొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12వేల పరుగులు(242 ఇన్నింగ్స్​ల్లో) పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత సచిన్ (300 ఇన్నింగ్స్​లు), పాంటింగ్(314), కుమార సంగక్కర(336), సనత్ జయసూర్య(379), మహేల జయవర్ధనే(399) ఉన్నారు.

kohli
కోహ్లీ

నాలుగు సార్లు అతడి చేతికే

ఈ మ్యాచ్​లో దూకుడుగా ఆడిన టీమ్ఇండియా సారథి కోహ్లీని ఆసీస్​ ఫాస్ట్​ బౌలర్​ హెజిల్​వుడ్​ కళ్లెం వేశాడు. అయితే ఈ సిరీలోని తొలి రెండు వన్డేలు సహ గత సిరీస్​లో చివరి వన్డేలోనూ హెజిల్​వుడ్​ చేతికే విరాట్​ చిక్కడం విశేషం.

ఇదీ చూడండి : సచిన్​ను అధిగమించిన కోహ్లీ- వన్డేల్లో సరికొత్త రికార్డు

కాన్​బెర్రాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్​ చేసిన టీమ్​ఇండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు సాధించింది. ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య(92*), సారథి కోహ్లీ(63), జడేజా(66) అర్ధశతకాలతో మెరిశారు​. మిగతా బ్యాట్స్​మన్ నామమాత్రపు పరుగులు చేశారు. ఆసీస్​ బౌలర్లలో అగర్​ 2, జంపా, హెజిల్​వుడ్​, సీన్​ అబాట్​ తలో వికెట్​ తీశారు.

సచిన్​ రికార్డు బద్దలు

ఈ పోరులో టీమ్​ఇండియా సారథి కోహ్లీ(63).. దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ రికార్డును బద్దలకొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12వేల పరుగులు(242 ఇన్నింగ్స్​ల్లో) పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత సచిన్ (300 ఇన్నింగ్స్​లు), పాంటింగ్(314), కుమార సంగక్కర(336), సనత్ జయసూర్య(379), మహేల జయవర్ధనే(399) ఉన్నారు.

kohli
కోహ్లీ

నాలుగు సార్లు అతడి చేతికే

ఈ మ్యాచ్​లో దూకుడుగా ఆడిన టీమ్ఇండియా సారథి కోహ్లీని ఆసీస్​ ఫాస్ట్​ బౌలర్​ హెజిల్​వుడ్​ కళ్లెం వేశాడు. అయితే ఈ సిరీలోని తొలి రెండు వన్డేలు సహ గత సిరీస్​లో చివరి వన్డేలోనూ హెజిల్​వుడ్​ చేతికే విరాట్​ చిక్కడం విశేషం.

ఇదీ చూడండి : సచిన్​ను అధిగమించిన కోహ్లీ- వన్డేల్లో సరికొత్త రికార్డు

Last Updated : Dec 2, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.