ETV Bharat / sports

ఆదివారం రోహిత్​ గాయంపై బీసీసీఐ పరిశీలన

author img

By

Published : Oct 31, 2020, 4:02 PM IST

టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ గాయం తీవ్రతను బీసీసీఐ వైద్యబృందం ఆదివారం రోజున పరీక్షించనుంది. తొడ కండరాల గాయం కారణంగా రోహిత్​ను ఆస్ట్రేలియాలో జరగనున్న సిరీస్​లకు ఎంపికచేయలేదు.

BCCI medical team- to- assess-rohit-fitness-on- sunday
రోహిత్​ ఫిట్​నెస్​కు ​ పరీక్ష

గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్​ శర్మను ఆదివారం బీసీసీఐ వైద్య బృందం పరీక్షించనుంది. అతనికి గాయం తగ్గిందా లేదా? ఇంకొంత విశ్రాంతి అవసరమా?అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. రోహిత్​కు గాయం తగ్గితే వికెట్ల మధ్య పరిగెత్తటం కష్టమేమీ కాదని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్​ను జట్టులోకి తీసుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

అక్టోబరు 18న పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రోహిత్​కు గాయమైంది. ఆ తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లోనూ బరిలోకి దిగలేదు. ఈ మ్యాచ్​లో గెలిచి ప్లేఆఫ్స్​ బెర్తును ఖరారు చేసుకుంది ముంబయి.

లీగ్ అవ్వగానే దుబాయ్​ నుంచి భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది. కోచ్, సిబ్బందితోపాటు, టెస్టు ఆటగాళ్లు పుజారా, విహారి త్వరలోనే దుబాయ్ చేరుకోనున్నారు.

గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్​ శర్మను ఆదివారం బీసీసీఐ వైద్య బృందం పరీక్షించనుంది. అతనికి గాయం తగ్గిందా లేదా? ఇంకొంత విశ్రాంతి అవసరమా?అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. రోహిత్​కు గాయం తగ్గితే వికెట్ల మధ్య పరిగెత్తటం కష్టమేమీ కాదని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్​ను జట్టులోకి తీసుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

అక్టోబరు 18న పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రోహిత్​కు గాయమైంది. ఆ తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లోనూ బరిలోకి దిగలేదు. ఈ మ్యాచ్​లో గెలిచి ప్లేఆఫ్స్​ బెర్తును ఖరారు చేసుకుంది ముంబయి.

లీగ్ అవ్వగానే దుబాయ్​ నుంచి భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది. కోచ్, సిబ్బందితోపాటు, టెస్టు ఆటగాళ్లు పుజారా, విహారి త్వరలోనే దుబాయ్ చేరుకోనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.