ETV Bharat / sports

కొవిడ్ టీకా తొలి డోస్​ తీసుకున్న కోహ్లీ

author img

By

Published : May 10, 2021, 2:30 PM IST

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇషాంత్ శర్మ దంపతులు కరోనా తొలి డోస్ టీకా తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా వ్యాక్సినేషన్​లో పాల్గొనాలని విరాట్ కోరాడు.

india-skipper-virat-kohli-receives-first-dose-of-covid-19-vaccine
కొవిడ్ తొలి డోస్​ టీకా తీసుకున్న కోహ్లీ

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొవిడ్ టీకా తొలి డోస్​ తీసుకున్నాడు. ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా వ్యాక్సిన్​ తీసుకోవాలని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరాడు. మరో భారత క్రికెటర్​ ఇషాంత్ శర్మతో పాటు అతని భార్య ప్రతిమా సింగ్​ కూడా కరోనా టీకా తీసుకున్నారు. గత వారం ఉమేష్ యాదవ్​, ఆజింక్య రహానె, శిఖర్​ ధావన్​ టీకా తొలి డోస్​ను తీసుకున్నారు.

వరల్డ్ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ కోసం జూన్​ 2న ఇంగ్లాండ్​కు వెళ్లనుంది భారత జట్టు. ఆ సమయానికి ఆటగాళ్లందరూ తొలి డోస్​ టీకా తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కానీ, రెండో డోస్​పై సందిగ్ధం నెలకొంది.

"18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్​కు అనుమతించింది భారత ప్రభుత్వం. దీంతో క్రికెటర్లు ఒక్కొక్కరుగా టీకా తీసుకుంటున్నారు. కానీ, రెండో డోస్​ ఎప్పుడు ఇస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయంపై ఇంగ్లాండ్ క్రికెట్​ బోర్డుతో కలిసి పనిచేయాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు యూకే ప్రభుత్వం ఒప్పుకోకపోతే.. తిరిగి భారత్​లోనే రెండో డోస్​ తీసుకోవాల్సి ఉంటుంది." అని ఆ అధికారి తెలిపారు.

డబ్ల్యూటీసీ ఫైనల్​ భారత్​, న్యూజిలాండ్ జట్ల మధ్య జూన్​ 18-22 వరకు జరగనుంది. జూన్​ 23వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలో కోహ్లీని మించిన వారే లేరు'

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొవిడ్ టీకా తొలి డోస్​ తీసుకున్నాడు. ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా వ్యాక్సిన్​ తీసుకోవాలని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరాడు. మరో భారత క్రికెటర్​ ఇషాంత్ శర్మతో పాటు అతని భార్య ప్రతిమా సింగ్​ కూడా కరోనా టీకా తీసుకున్నారు. గత వారం ఉమేష్ యాదవ్​, ఆజింక్య రహానె, శిఖర్​ ధావన్​ టీకా తొలి డోస్​ను తీసుకున్నారు.

వరల్డ్ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ కోసం జూన్​ 2న ఇంగ్లాండ్​కు వెళ్లనుంది భారత జట్టు. ఆ సమయానికి ఆటగాళ్లందరూ తొలి డోస్​ టీకా తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కానీ, రెండో డోస్​పై సందిగ్ధం నెలకొంది.

"18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్​కు అనుమతించింది భారత ప్రభుత్వం. దీంతో క్రికెటర్లు ఒక్కొక్కరుగా టీకా తీసుకుంటున్నారు. కానీ, రెండో డోస్​ ఎప్పుడు ఇస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయంపై ఇంగ్లాండ్ క్రికెట్​ బోర్డుతో కలిసి పనిచేయాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు యూకే ప్రభుత్వం ఒప్పుకోకపోతే.. తిరిగి భారత్​లోనే రెండో డోస్​ తీసుకోవాల్సి ఉంటుంది." అని ఆ అధికారి తెలిపారు.

డబ్ల్యూటీసీ ఫైనల్​ భారత్​, న్యూజిలాండ్ జట్ల మధ్య జూన్​ 18-22 వరకు జరగనుంది. జూన్​ 23వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలో కోహ్లీని మించిన వారే లేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.