ETV Bharat / sports

కొత్త సంవత్సరం హార్దిక్​ పాండ్య సంకల్పమిదేనంటా

టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ఈ ఏడాది తన సంకల్పమేంటో వివరించాడు. అదే తన లక్ష్యమని చెప్పాడు. అలా చేయడం తనకు తెలుసని అన్నాడు.

author img

By

Published : Jan 2, 2023, 9:54 PM IST

IND VS SL Hardik pandya New year wish is to win Worldcup
కొత్త సంవత్సరం హార్దిక్​ పాండ్య సంకల్పమిదేనంటా

న్యూ ఇయర్​లోకి అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరూ.. ఈ ఏడాది ఏం సాధించాలనే సంకల్పం సిద్ధం చేసుకొంటారు. అలాగే టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్‌ పాండ్య కూడా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. తన సంకల్పమేంటో వివరించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా హార్దిక్ పాండ్య సారథ్యంలోని భారత్‌ మంగళవారం శ్రీలంకతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. సిరీస్‌ ప్రారంభం సందర్భంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అతడు.. రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్‌ పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ప్రపంచమంతా అతడి వెంటే ఉందని తెలిపాడు.

"తప్పకుండా గతేడాదిని తలుచుకోవాలి. గాయాలతో నిలకడగా జట్టులో ఉండలేకపోయా. అలాగే మేం టీ20 ప్రపంచకప్‌ 2022ను నెగ్గాలని తీవ్రంగా ప్రయత్నించాం. అయితే అది కుదరలేదు. అయినా ఫర్వాలేదు. ఎప్పుడూ ముందుకు వెళ్లాలనే ఆలోచిస్తూ ఉంటా. నేను ఇంకేం సాధించాలి..? అని అనుకొంటే మాత్రం ఇంకా చాలా ఉందనే చెప్తా. ఎందుకంటే నా కెరీర్‌లో పెద్దగా సాధించిందేమీ లేదు. అందుకే నా లక్ష్యం, ఈ ఏడాది సంకల్పం మాత్రం వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాలి. ఇంతకంటే పెద్ద సంకల్పం మరొకటి ఉండదేమో. ఆ దిశగా మేమంతా కృషి చేస్తాం" అని హార్దిక్‌ పేర్కొన్నాడు.

అదే నాకు తెలుసు.. జీవిత లక్ష్యం సాధించాలంటే కష్టపడాలనే పాఠాలను బలంగా నమ్ముతానని హార్దిక్‌ తెలిపాడు. "కష్టపడి పని చేయడం ఏంటో నాకు బాగా తెలుసు. అగాథంలోకి (జట్టులో నుంచి తప్పించడం) పడిపోయినప్పటికీ కష్టపడి మరీ మళ్లీ జట్టులోకి రాగలిగా. గాయాలు ఆటలో ఓ భాగం. వాటిని నేనేం మార్చలేను. కానీ గాయాల నుంచి కోలుకుని రావడానికి శ్రమ పడాల్సింది మాత్రం నేను. అందుకోసం ఎలాంటి కష్టానికైనా వెనకడుగు వేయను. ఇక నా అత్యుత్తమ ఆటను ఆడేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటా" అని చెప్పాడు.

ఇదీ చూడండి: అది ధోనీ క్రేజ్​ అంటే.. ఆ ప్రాక్టీస్ మ్యాచ్​ కోసం 20వేల మంది

న్యూ ఇయర్​లోకి అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరూ.. ఈ ఏడాది ఏం సాధించాలనే సంకల్పం సిద్ధం చేసుకొంటారు. అలాగే టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్‌ పాండ్య కూడా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. తన సంకల్పమేంటో వివరించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా హార్దిక్ పాండ్య సారథ్యంలోని భారత్‌ మంగళవారం శ్రీలంకతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. సిరీస్‌ ప్రారంభం సందర్భంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అతడు.. రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్‌ పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ప్రపంచమంతా అతడి వెంటే ఉందని తెలిపాడు.

"తప్పకుండా గతేడాదిని తలుచుకోవాలి. గాయాలతో నిలకడగా జట్టులో ఉండలేకపోయా. అలాగే మేం టీ20 ప్రపంచకప్‌ 2022ను నెగ్గాలని తీవ్రంగా ప్రయత్నించాం. అయితే అది కుదరలేదు. అయినా ఫర్వాలేదు. ఎప్పుడూ ముందుకు వెళ్లాలనే ఆలోచిస్తూ ఉంటా. నేను ఇంకేం సాధించాలి..? అని అనుకొంటే మాత్రం ఇంకా చాలా ఉందనే చెప్తా. ఎందుకంటే నా కెరీర్‌లో పెద్దగా సాధించిందేమీ లేదు. అందుకే నా లక్ష్యం, ఈ ఏడాది సంకల్పం మాత్రం వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాలి. ఇంతకంటే పెద్ద సంకల్పం మరొకటి ఉండదేమో. ఆ దిశగా మేమంతా కృషి చేస్తాం" అని హార్దిక్‌ పేర్కొన్నాడు.

అదే నాకు తెలుసు.. జీవిత లక్ష్యం సాధించాలంటే కష్టపడాలనే పాఠాలను బలంగా నమ్ముతానని హార్దిక్‌ తెలిపాడు. "కష్టపడి పని చేయడం ఏంటో నాకు బాగా తెలుసు. అగాథంలోకి (జట్టులో నుంచి తప్పించడం) పడిపోయినప్పటికీ కష్టపడి మరీ మళ్లీ జట్టులోకి రాగలిగా. గాయాలు ఆటలో ఓ భాగం. వాటిని నేనేం మార్చలేను. కానీ గాయాల నుంచి కోలుకుని రావడానికి శ్రమ పడాల్సింది మాత్రం నేను. అందుకోసం ఎలాంటి కష్టానికైనా వెనకడుగు వేయను. ఇక నా అత్యుత్తమ ఆటను ఆడేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటా" అని చెప్పాడు.

ఇదీ చూడండి: అది ధోనీ క్రేజ్​ అంటే.. ఆ ప్రాక్టీస్ మ్యాచ్​ కోసం 20వేల మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.