ETV Bharat / sports

IND Vs SA: తొలిరోజు ఆట పూర్తి.. దక్షిణాఫ్రికా స్కోరు 17/1

author img

By

Published : Jan 11, 2022, 9:36 PM IST

IND Vs SA: భారత్​తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్​లో ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది. క్రీజులో మహారాజ్(6), మార్​క్రమ్(8) ఉన్నారు. కాగా, టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 223 పరుగులు చేసింది.

elgar
ఎల్గర్

IND Vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆటపూర్తయ్యే సమయానికి తొలి ఇన్నింగ్స్​లో 8 ఓవర్లు ఆడిన ప్రొటీస్ జట్టు వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మహారాజ్(6), మార్​క్రమ్(8) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఓ వికెట్ తీశాడు. అంతకుముందు టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 223 పరుగులకు ఆలౌటైంది.

ఆట సాగిందిలా..

టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ తొలిరోజే కష్టాల్లో పడింది. మొదటి సెషన్​ ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయిన భారత జట్టు మూడో సెషన్​ ముగియకముందే ఆలౌటైంది. విరాట్​ కోహ్లీ(79) ఒంటరి పోరాటం చేయగా.. పుజారా(43), పంత్(27) ఫర్వాలేదనిపించారు. రహానే(9), అశ్విన్(2), శార్దూల్ ఠాకూర్(12) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 77 ఓవర్లలో 223 పరుగులు చేసింది భారత్.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసొ రబాడ(4), మార్కో జాన్సన్(3) వికెట్లు పడగొట్టి భారత్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. ఒలివర్, ఎంగిడి, మహారాజ్ తలో వికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్​లో 223 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగింది దక్షిణాఫ్రికా. క్రీజులో మార్​క్రామ్, డీన్ ఎల్గర్ ఉన్నారు.

ఇదీ చదవండి:

IND vs SA: లంచ్​ విరామానికి భారత్ స్కోరు 75/2

కోహ్లీ ఒంటరి పోరాటం.. భారత్ 223 ఆలౌట్

IND Vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆటపూర్తయ్యే సమయానికి తొలి ఇన్నింగ్స్​లో 8 ఓవర్లు ఆడిన ప్రొటీస్ జట్టు వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మహారాజ్(6), మార్​క్రమ్(8) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఓ వికెట్ తీశాడు. అంతకుముందు టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 223 పరుగులకు ఆలౌటైంది.

ఆట సాగిందిలా..

టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ తొలిరోజే కష్టాల్లో పడింది. మొదటి సెషన్​ ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయిన భారత జట్టు మూడో సెషన్​ ముగియకముందే ఆలౌటైంది. విరాట్​ కోహ్లీ(79) ఒంటరి పోరాటం చేయగా.. పుజారా(43), పంత్(27) ఫర్వాలేదనిపించారు. రహానే(9), అశ్విన్(2), శార్దూల్ ఠాకూర్(12) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 77 ఓవర్లలో 223 పరుగులు చేసింది భారత్.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసొ రబాడ(4), మార్కో జాన్సన్(3) వికెట్లు పడగొట్టి భారత్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. ఒలివర్, ఎంగిడి, మహారాజ్ తలో వికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్​లో 223 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగింది దక్షిణాఫ్రికా. క్రీజులో మార్​క్రామ్, డీన్ ఎల్గర్ ఉన్నారు.

ఇదీ చదవండి:

IND vs SA: లంచ్​ విరామానికి భారత్ స్కోరు 75/2

కోహ్లీ ఒంటరి పోరాటం.. భారత్ 223 ఆలౌట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.