ETV Bharat / sports

Kuldeep: 'ఆ సిరీస్​లోనైనా​ అవకాశం వస్తుందని..'

author img

By

Published : Jun 6, 2021, 6:39 PM IST

ఇంగ్లాండ్​ పర్యటనలో చోటు దక్కలేదని బాధపడుతున్న స్పిన్నర్ కుల్దీప్.. శ్రీలంక సిరీస్​లోనైనా ఆడే అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కొంతకాలంగా సరిగ్గా అవకాశాలు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.

Kuldeep
కుల్దీప్

కొన్ని నెలలుగా స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​కు జట్టులో చోటు దొరకక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఎంపికైనా తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోతున్నాడు. ఇంగ్లాండ్​ పర్యటనకు ఎంపికవ్వలేదు. ఈ క్రమంలోనే ఈ విషయమై స్పందించిన కుల్దీప్ చాలా బాధపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటన సమయంలోనే పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన భారత్ మరో జట్టు శ్రీలంక టూర్​కు వెళ్లనుంది. కనీసం ఈ సిరీస్​కు అయినా అతడిని సెలక్టర్లు ఎంపిక చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నట్లు కుల్దీప్​ ఆశాభావం వ్యక్తం చేశాడు.

"టీమ్​ఇండియాలో స్థానం దక్కకపోవడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే జట్టుతో కలిసి మంచి ప్రదర్శన చేసి విజయాల్లో భాగస్వామ్యం అవ్వాలని అనుకున్నాను. క్రికెట్​లో ఇలాంటివి జరుగుతుంటుంటాయి. జట్టులో కలిసి ఆడటానికి అవకాశం రానప్పుడు ఏ ఆటగాడైనా బాధపడటాడు. టీమ్​లో ఉండటానికి ఆశగా ఎదురుచూస్తుంటాడు. కానీ కొన్ని సందర్భాలలో పరిస్థితులు అనుకూలించవు. అయితే అదే సమయంలో మరో అవకాశం దొరికితే బాగా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. శ్రీలంక పర్యటనకు నాకు అవకాశం వస్తుందని భావిస్తున్నాను"

-కుల్దీప్​ యాదవ్​, టీమ్​ఇండియా క్రికెటర్​

మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ రిటైర్‌ అవ్వకముందు కుల్దీప్​ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ మణికట్టు మాంత్రిక ద్వయంగా ప్రశంసలు అందుకున్నారు. కానీ వారిద్దరూ కలిసి ఆడే పరిస్థితులు ఇప్పుడు లేవు. కుల్దీప్​.. కెరీర్​లో ఇప్పటివరకు ఏడు టెస్టులు(26వికెట్లు), 63వన్డేలు(105), 21టీ20(39), 45ఐపీఎల్​(40)మ్యాచ్​లు ఆడాడు. జులైలో శ్రీలంక పర్యటనకు టీమ్​ఇండియా వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి.

ఇదీ చూడండి 'జడ్డూ వల్లే జట్టులో చోటు దక్కడం లేదు'

కొన్ని నెలలుగా స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​కు జట్టులో చోటు దొరకక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఎంపికైనా తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోతున్నాడు. ఇంగ్లాండ్​ పర్యటనకు ఎంపికవ్వలేదు. ఈ క్రమంలోనే ఈ విషయమై స్పందించిన కుల్దీప్ చాలా బాధపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటన సమయంలోనే పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన భారత్ మరో జట్టు శ్రీలంక టూర్​కు వెళ్లనుంది. కనీసం ఈ సిరీస్​కు అయినా అతడిని సెలక్టర్లు ఎంపిక చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నట్లు కుల్దీప్​ ఆశాభావం వ్యక్తం చేశాడు.

"టీమ్​ఇండియాలో స్థానం దక్కకపోవడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే జట్టుతో కలిసి మంచి ప్రదర్శన చేసి విజయాల్లో భాగస్వామ్యం అవ్వాలని అనుకున్నాను. క్రికెట్​లో ఇలాంటివి జరుగుతుంటుంటాయి. జట్టులో కలిసి ఆడటానికి అవకాశం రానప్పుడు ఏ ఆటగాడైనా బాధపడటాడు. టీమ్​లో ఉండటానికి ఆశగా ఎదురుచూస్తుంటాడు. కానీ కొన్ని సందర్భాలలో పరిస్థితులు అనుకూలించవు. అయితే అదే సమయంలో మరో అవకాశం దొరికితే బాగా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. శ్రీలంక పర్యటనకు నాకు అవకాశం వస్తుందని భావిస్తున్నాను"

-కుల్దీప్​ యాదవ్​, టీమ్​ఇండియా క్రికెటర్​

మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ రిటైర్‌ అవ్వకముందు కుల్దీప్​ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ మణికట్టు మాంత్రిక ద్వయంగా ప్రశంసలు అందుకున్నారు. కానీ వారిద్దరూ కలిసి ఆడే పరిస్థితులు ఇప్పుడు లేవు. కుల్దీప్​.. కెరీర్​లో ఇప్పటివరకు ఏడు టెస్టులు(26వికెట్లు), 63వన్డేలు(105), 21టీ20(39), 45ఐపీఎల్​(40)మ్యాచ్​లు ఆడాడు. జులైలో శ్రీలంక పర్యటనకు టీమ్​ఇండియా వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి.

ఇదీ చూడండి 'జడ్డూ వల్లే జట్టులో చోటు దక్కడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.