ETV Bharat / sports

'గులాబీ టెస్టుపై ముందే అంచనాలు వేయడం కష్టం'

author img

By

Published : Feb 20, 2021, 10:59 PM IST

అహ్మదాబాద్​ వేదికగా జరగబోయే పింక్​ టెస్టు గురించి పలు అంశాలు ప్రస్తావించాడు టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్ ఛెతేశ్వర్​ పుజారా. కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియం స్పిన్​కు సహకరిస్తుందా.. లేక పేస్​కు సహకరిస్తుందా.. అనే విషయాన్ని ముందుగా ఊహించటం కష్టమని తెలిపాడు.

You never know with the SG pink ball, it might swing or not: Pujara
'గులాబీ టెస్టుపై ముందే అంచనాలు వేయడం కష్టం'

ఇంగ్లాండ్​తో జరగనున్న మూడో టెస్టు గురించి టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. పునర్​​నిర్మించిన మొతేరా స్టేడియంలో బంతి ఎంత స్వింగ్​ అవుతుందో ఊహించడం కష్టమని పుజారా పేర్కొన్నాడు.

నాలుగు టెస్టుల సిరీస్​లో ఇరు జట్లు చెరో మ్యాచ్​ను గెలవడం వల్ల ఇప్పుడు అహ్మదాబాద్​ వేదికగా జరగబోయే టెస్టుపై అందరి దృష్టి పడింది. పింక్​బాల్​తో జరిగే డే/నైట్​ టెస్టుల్లో భారత్​కు అంతగా అనుభవం లేదు. గులాబీ బంతితో కేవలం రెండు మ్యాచ్​లే ఆడింది టీమ్​ఇండియా.

''నేను చాలా టెస్టు మ్యాచ్​లు ఆడాను. కానీ పింక్​ బాల్​తో ఆడటం నాక్కూడా కొత్తే. బంతి స్వింగ్​ అవుతుందా? స్పిన్​ అవుతుందా? అనేది అంచనా వేయటం కష్టం. అనుభవంతో దీన్నీ ఊహించటం అసంభవం. మొతేరా అనేది పూర్తిగా కొత్త పిచ్​. ఇక్కడ ఆడే కొద్ది ఈ పిచ్​ గురించి అవగాహన పెరుగుతుంది. గతంలో ఈ పిచ్​ స్పిన్​కు సహకరించేది. కాస్త ఓపికతో ఆడితే బ్యాటింగ్​ కూడా సులభమే. 2012లో నేను ఇదే ఇంగ్లాండ్​పై 206 పరుగులతో నాటౌట్​గా నిలిచాను.''

-ఛెతేశ్వర్​ పుజారా, టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్.

'పింక్​ టెస్టులో ఎస్జీ బంతి ఎలా స్పందిస్తుందనేది చూడాలి. మేము గతంలో స్వదేశంలో బంగ్లాదేశ్​తో కోల్​కతా వేదికగా పింక్​బాల్​ టెస్టు ఆడాం. అప్పుడు గెలిచాం. విదేశాలలో ఆస్ట్రేలియాతో సిరీస్​లో 36 పరుగులకే ఆలౌటయ్యాం. అప్పుడు ఓడిపోయాం. అందుకే గులాబీ బంతితో ఎప్పడు ఏమి జరిగేది ఊహించలేం' అని పుజారా తెలిపాడు.

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనలే మా లక్ష్యమని నయావాల్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్​లో తప్పకుండా గెలవాలంటే తాము జట్టుగా రాణించాల్సిన అవసరముందని వెల్లడించాడు.

ఐపీఎల్​పై స్పందిస్తూ..

ఐపీఎల్‌లో తిరిగి ఆడబోతున్నందుకు సంతోషంగా ఉందని, తన సారథి మహేంద్రసింగ్‌ ధోనీ నేతృత్వంలో మరోసారి కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని పుజారా అన్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు.. పుజారాను రూ.50లక్షలకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఫ్రాంఛైజీ విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడం గొప్పగా ఉందన్నాడు.

'ఐపీఎల్‌లో తిరిగి ఆడటం గొప్పగా ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున పచ్చ జెర్సీలో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను మళ్లీ ధోనీ భాయ్‌తో కలిసి ఆడబోతున్నా. టెస్టుల్లో నేను అరంగేట్రం చేసినప్పుడు అతడే నా సారథిగా ఉన్నాడు. దాంతో ధోనీతో కొన్ని తీపి జ్ఞాపకాలున్నాయి. ఇప్పుడు మరోసారి అతడితో ఆడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఐపీఎల్‌ అనేది ఆలోచన విధానంలోని మార్పు. టెస్టు ఫార్మాట్‌ నుంచి ఇందులోకి మారడం మానసిక అంశం. ఈ విషయంలో సరైన సన్నద్ధతతో ముందుకెళ్తే త్వరగా మారిపోవచ్చు. అయితే, రాబోయే సీజన్‌లో నేను మంచి ప్రదర్శన చేస్తాననే నమ్మకం ఉంది' అని పుజారా చెప్పుకొచ్చాడు. కాగా, పుజారా చివరిసారి 2014లో పంజాబ్‌ తరఫున ఆడి ఆరు మ్యాచ్‌ల్లో 125 పరుగులు చేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు క్రికెట్‌ మెగా ఈవెంట్‌లో ఆడబోతున్నాడు.

మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇదే సీజన్‌ కోసం ఓపెనర్‌గా.. ట్రేడింగ్‌ పద్ధతిలో రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రాబిన్‌ ఉతప్పని తీసుకుంది. అతడు రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇక స్టార్‌ ఆటగాడు సురేశ్‌ రైనా తిరిగి జట్టులో చేరడంతో మూడో నంబర్‌ ఆటగాడిగా కొనసాగుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో పుజారా ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడనేది ఆసక్తికరం.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్​తో టీ20లకు సూర్యకుమార్​, ఇషాన్​- జట్టు ఇదే

ఇంగ్లాండ్​తో జరగనున్న మూడో టెస్టు గురించి టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. పునర్​​నిర్మించిన మొతేరా స్టేడియంలో బంతి ఎంత స్వింగ్​ అవుతుందో ఊహించడం కష్టమని పుజారా పేర్కొన్నాడు.

నాలుగు టెస్టుల సిరీస్​లో ఇరు జట్లు చెరో మ్యాచ్​ను గెలవడం వల్ల ఇప్పుడు అహ్మదాబాద్​ వేదికగా జరగబోయే టెస్టుపై అందరి దృష్టి పడింది. పింక్​బాల్​తో జరిగే డే/నైట్​ టెస్టుల్లో భారత్​కు అంతగా అనుభవం లేదు. గులాబీ బంతితో కేవలం రెండు మ్యాచ్​లే ఆడింది టీమ్​ఇండియా.

''నేను చాలా టెస్టు మ్యాచ్​లు ఆడాను. కానీ పింక్​ బాల్​తో ఆడటం నాక్కూడా కొత్తే. బంతి స్వింగ్​ అవుతుందా? స్పిన్​ అవుతుందా? అనేది అంచనా వేయటం కష్టం. అనుభవంతో దీన్నీ ఊహించటం అసంభవం. మొతేరా అనేది పూర్తిగా కొత్త పిచ్​. ఇక్కడ ఆడే కొద్ది ఈ పిచ్​ గురించి అవగాహన పెరుగుతుంది. గతంలో ఈ పిచ్​ స్పిన్​కు సహకరించేది. కాస్త ఓపికతో ఆడితే బ్యాటింగ్​ కూడా సులభమే. 2012లో నేను ఇదే ఇంగ్లాండ్​పై 206 పరుగులతో నాటౌట్​గా నిలిచాను.''

-ఛెతేశ్వర్​ పుజారా, టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్.

'పింక్​ టెస్టులో ఎస్జీ బంతి ఎలా స్పందిస్తుందనేది చూడాలి. మేము గతంలో స్వదేశంలో బంగ్లాదేశ్​తో కోల్​కతా వేదికగా పింక్​బాల్​ టెస్టు ఆడాం. అప్పుడు గెలిచాం. విదేశాలలో ఆస్ట్రేలియాతో సిరీస్​లో 36 పరుగులకే ఆలౌటయ్యాం. అప్పుడు ఓడిపోయాం. అందుకే గులాబీ బంతితో ఎప్పడు ఏమి జరిగేది ఊహించలేం' అని పుజారా తెలిపాడు.

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనలే మా లక్ష్యమని నయావాల్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్​లో తప్పకుండా గెలవాలంటే తాము జట్టుగా రాణించాల్సిన అవసరముందని వెల్లడించాడు.

ఐపీఎల్​పై స్పందిస్తూ..

ఐపీఎల్‌లో తిరిగి ఆడబోతున్నందుకు సంతోషంగా ఉందని, తన సారథి మహేంద్రసింగ్‌ ధోనీ నేతృత్వంలో మరోసారి కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని పుజారా అన్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు.. పుజారాను రూ.50లక్షలకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఫ్రాంఛైజీ విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడం గొప్పగా ఉందన్నాడు.

'ఐపీఎల్‌లో తిరిగి ఆడటం గొప్పగా ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున పచ్చ జెర్సీలో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను మళ్లీ ధోనీ భాయ్‌తో కలిసి ఆడబోతున్నా. టెస్టుల్లో నేను అరంగేట్రం చేసినప్పుడు అతడే నా సారథిగా ఉన్నాడు. దాంతో ధోనీతో కొన్ని తీపి జ్ఞాపకాలున్నాయి. ఇప్పుడు మరోసారి అతడితో ఆడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఐపీఎల్‌ అనేది ఆలోచన విధానంలోని మార్పు. టెస్టు ఫార్మాట్‌ నుంచి ఇందులోకి మారడం మానసిక అంశం. ఈ విషయంలో సరైన సన్నద్ధతతో ముందుకెళ్తే త్వరగా మారిపోవచ్చు. అయితే, రాబోయే సీజన్‌లో నేను మంచి ప్రదర్శన చేస్తాననే నమ్మకం ఉంది' అని పుజారా చెప్పుకొచ్చాడు. కాగా, పుజారా చివరిసారి 2014లో పంజాబ్‌ తరఫున ఆడి ఆరు మ్యాచ్‌ల్లో 125 పరుగులు చేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు క్రికెట్‌ మెగా ఈవెంట్‌లో ఆడబోతున్నాడు.

మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇదే సీజన్‌ కోసం ఓపెనర్‌గా.. ట్రేడింగ్‌ పద్ధతిలో రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రాబిన్‌ ఉతప్పని తీసుకుంది. అతడు రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇక స్టార్‌ ఆటగాడు సురేశ్‌ రైనా తిరిగి జట్టులో చేరడంతో మూడో నంబర్‌ ఆటగాడిగా కొనసాగుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో పుజారా ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడనేది ఆసక్తికరం.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్​తో టీ20లకు సూర్యకుమార్​, ఇషాన్​- జట్టు ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.