ETV Bharat / sports

యూకే పర్యటనలో క్రికెటర్ల కుటుంబాలకూ అనుమతి

ఇంగ్లాండ్​ పర్యటనకు భారత ఆటగాళ్లతో పాటు వారి కుటుంబాలకు అనుమతించినట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. సుదీర్ఘమైన పర్యటనలోని బయోబబుల్​ వల్ల ప్లేయర్లు మానసిక కుంగుబాటుకు గురవ్వకుండా ఉండేందుకు కుటుంబసభ్యులను పర్యటనకు ఈ అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.

author img

By

Published : Jun 1, 2021, 1:13 PM IST

Players' families allowed for UK trip
యూకే పర్యటనలో క్రికెటర్ల కుటుంబాలకూ అనుమతి

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనుంది. ఈ పోరులో టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. దీంతో పాటు టెస్టు సిరీస్​లో ఆడేందుకు భారత మహిళల టీమ్​ కూడా యూకే వెళ్లనుంది. సుదీర్ఘమైన క్వారంటైన్​ కారణంగా ఆటగాళ్లు తమ కుటుంబాలను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఆడేందుకు న్యూజిలాండ్​ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్​ చేరుకోగా.. భారత జట్టు జూన్​ 2న పయనం కానుంది. టీమ్ఇండియా ఆటగాళ్లతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ, సెక్రటరీ జైషా కూడా యూకే వెళ్లనున్నారు. అయితే వీరికి కూడా క్వారంటైన్​ తప్పనిసరి అని ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

"అవును.. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబాలను యూకే తీసుకెళ్లేందుకు అనుమతించాం. అటు పురుషులతో పాటు మహిళల క్రీడాకారిణులకూ ఈ అవకాశాన్ని కల్పించాం. ఆటగాళ్లకు మానసికంగా ఎలాంటి మద్దతు కావాలో బీసీసీఐకి తెలుసు. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఇంగ్లాండ్​ వెళ్లే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ, సెక్రటరీ జైషాకు కూడా క్వారంటైన్​ తప్పనిసరి అని తెలుస్తోంది. ఆ దేశం క్వారంటైన్​ రూల్స్​ ప్రకారం ఆటగాళ్లకు నిర్బంధంలో కొంత సమయం తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది".

- బీసీసీఐ అధికారి

ప్రపంచటెస్టు ఛాంపియన్​ షిప్​(జూన్​ 18-22), ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​(ఆగస్టు 4-సెప్టెంబరు 14) కోసం కఠిన ఆంక్షల నడుమ ఆటగాళ్లు దాదాపు మూడున్నర నెలలు ఇంగ్లాండ్​లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో బయోబబుల్​ వల్ల వారు మానసిక కుంగుబాటుకు గురవ్వకుండా ఉండేందుకు వారి కుటుంబసభ్యులను పర్యటనకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇంగ్లాండ్​ పర్యటనలో భారత మహిళల జట్టు ఓ టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్​ 16-జులై 14వరకు ఈ సిరీస్​ జరగనుంది. ప్రస్తుతం ప్లేయర్స్​ అందరూ క్వారంటైన్​లో ఉండి ఫిట్​నెస్​ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇదీ చూడండి: WTC final: టీమ్​ఇండియాకు మాజీ క్రికెటర్​ హెచ్చరిక

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనుంది. ఈ పోరులో టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. దీంతో పాటు టెస్టు సిరీస్​లో ఆడేందుకు భారత మహిళల టీమ్​ కూడా యూకే వెళ్లనుంది. సుదీర్ఘమైన క్వారంటైన్​ కారణంగా ఆటగాళ్లు తమ కుటుంబాలను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఆడేందుకు న్యూజిలాండ్​ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్​ చేరుకోగా.. భారత జట్టు జూన్​ 2న పయనం కానుంది. టీమ్ఇండియా ఆటగాళ్లతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ, సెక్రటరీ జైషా కూడా యూకే వెళ్లనున్నారు. అయితే వీరికి కూడా క్వారంటైన్​ తప్పనిసరి అని ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

"అవును.. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబాలను యూకే తీసుకెళ్లేందుకు అనుమతించాం. అటు పురుషులతో పాటు మహిళల క్రీడాకారిణులకూ ఈ అవకాశాన్ని కల్పించాం. ఆటగాళ్లకు మానసికంగా ఎలాంటి మద్దతు కావాలో బీసీసీఐకి తెలుసు. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఇంగ్లాండ్​ వెళ్లే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ, సెక్రటరీ జైషాకు కూడా క్వారంటైన్​ తప్పనిసరి అని తెలుస్తోంది. ఆ దేశం క్వారంటైన్​ రూల్స్​ ప్రకారం ఆటగాళ్లకు నిర్బంధంలో కొంత సమయం తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది".

- బీసీసీఐ అధికారి

ప్రపంచటెస్టు ఛాంపియన్​ షిప్​(జూన్​ 18-22), ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​(ఆగస్టు 4-సెప్టెంబరు 14) కోసం కఠిన ఆంక్షల నడుమ ఆటగాళ్లు దాదాపు మూడున్నర నెలలు ఇంగ్లాండ్​లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో బయోబబుల్​ వల్ల వారు మానసిక కుంగుబాటుకు గురవ్వకుండా ఉండేందుకు వారి కుటుంబసభ్యులను పర్యటనకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇంగ్లాండ్​ పర్యటనలో భారత మహిళల జట్టు ఓ టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్​ 16-జులై 14వరకు ఈ సిరీస్​ జరగనుంది. ప్రస్తుతం ప్లేయర్స్​ అందరూ క్వారంటైన్​లో ఉండి ఫిట్​నెస్​ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇదీ చూడండి: WTC final: టీమ్​ఇండియాకు మాజీ క్రికెటర్​ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.