దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని గ్లౌజులపై సైనిక అధికారిక చిహ్నం 'బలిదాన్' ఉండడం పట్ల ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై చాలా మంది మాజీ ఆటగాళ్లు, క్రికెట్ బోర్డు అధికారులు, ప్రముఖులు స్పందించారు. అయితే తాజాగా ధోనికి టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఓ వినూత్న సలహా చెప్పాడు. ఈ విధంగా చేస్తే ఐసీసీ ఆ లోగో ధరించకుండా అడ్డుకోలేదని సూచించాడు.
" బలిదాన్ బ్యాడ్జ్ వాడటాన్ని ఐసీసీ ఒప్పుకోలేదు కదా.. అయితే ఇలా ప్రయత్నించు. బ్యాటుపై రెండు లోగోలను బ్యాట్స్మెన్ అతికించుకునే అవకాశం ఉంది. అందులో ఒక లోగో రూపంలో బలిదాన్ చిహ్నాన్ని వాడు. గ్లౌజులపై ఆ చిహ్నాం ఉంటే తప్పు కాని బ్యాటుపై కాదు. గ్లౌజులపై కాకుండా బలిదాన్ గుర్తును బ్యాట్పై వాడేందుకు రాతపూర్వకంగా అనుమతి తీసుకో. దానికి ఐసీసీ కచ్చితంగా అనుమతి ఇస్తుంది. ఎందుకంటే బ్యాటుపై తయారీ సంస్థ సహా మరో లోగో ఆటగాడికి సంబంధించినది వాడుకోవచ్చు".
-- సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్
గతంలోనూ సెహ్వాగ్ ఎస్ఐఎస్జే.ఇన్ (సెహ్వాగ్ అంతర్జాతీయ పాఠశాల) పేరును ఇలాగే బ్యాటుపై ముద్రించుకున్నాడు. దీనికి ఐసీసీ అనుమతి ఇచ్చింది. దానిని చాలా మ్యాచ్ల్లో ఉపయోగించినట్లు ధోనికి సూచించాడు సెహ్వాగ్. అంతేకాకుండా బలిదాన్ బ్యాడ్జితో మ్యాచ్ వీక్షించాలని భారత ప్రజలను కోరాడు.
"భారత సైనికులంటే నాకే కాదు... ధోనికి, దేశ ప్రజలకు చాలా అభిమానం. అయితే వాళ్లని మనం గౌరవించాలంటే బలిదాన్ బ్యాడ్జ్తో మ్యాచ్ వీక్షించాలి. ఆ గుర్తును ఫొటో తీయండి. మీ నిరనసను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో నన్ను లేదా ధోనిని ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. నేను మీ భావోద్వేగాలను రీట్వీట్, లైక్, షేర్ చేసేందుకు ప్రయత్నిస్తా" అని చెప్పుకొచ్చాడు సెహ్వాగ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జూన్ 9న ఆసీస్తో జరగనున్న మ్యాచ్లో భారత్ గెలుస్తుందని ఆశాభవం వ్యక్తం చేశాడు వీరూ. ధోనీ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గెలుస్తాడని జోస్యం చెప్పాడు.
ఇవీ చూడండి: