ETV Bharat / sports

WC 19: క్రికెట్​ 'దేవుడి' కల నెరవేరిన వేళ

28 ఏళ్ల తర్వాత ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగిన రోజు... క్రికెట్​ దేవుడి కల నెరవేరిన వేళ అది.. అలాంటి 2011 ప్రపంచకప్​ విశేషాలను చూసేద్దామా మరి..

author img

By

Published : May 27, 2019, 5:27 PM IST

WC 19: క్రికెట్​ 'దేవుడి' కల నెరవేరిన వేళ

2011 ప్రపంచకప్​... అప్పటికి భారత్​ విశ్వవిజేతగా నిలిచి 28 ఏళ్లు గడిచిపోయింది. కపిల్​దేవ్​ నేతృత్వంలో భీకర కరేబియన్​ జట్టును ఓడించి తొలిసారి 1983లో భారత్​ ప్రపంచకప్​ గెలిచింది. ఆ తర్వాత జరిగిన మరో ఆరు ప్రపంచకప్​ టోర్నీల్లో భారత్​కు నిరాశే ఎదురైంది.

1983 ప్రపంచకప్​ గెలిచిన భారత్​
1983 ప్రపంచకప్​ గెలిచిన భారత్​

స్వదేశంలో జరిగిన 2011 ప్రపంచకప్​పై యావత్​ దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2007 టీ20 ప్రపంచకప్​లో భారత్​ను విశ్వవిజేతగా నిలిపిన తిరుగులేని సారథి ఎంఎస్​ ధోనిపైనే అందరి నమ్మకం. వరల్డ్​కప్​ను ముద్దాడాలన్నది క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ కల. అది ఈ ప్రపంచకప్​లోనైనా నెరవేరుతుందా? క్రికెట్ దేవుడికి ఘనమైన వీడ్కోలు దక్కుతుందా? ఒత్తిడిని తట్టుకుని భారత్​ మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందా? ఇన్ని ప్రశ్నల మధ్య భారత్​ టోర్నీలో అడుగుపెట్టింది.

తొలి మ్యాచ్​...

తొలి మ్యాచ్​ భారత్​- బంగ్లాదేశ్​ మధ్య జరిగింది. 2007లో బంగ్లాదేశ్​ చేతిలో భారత్​ ఓడి మెగాటోర్ని నుంచి నిష్క్రమించింది. ఈ పరాజయం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం తెచ్చింది. ఆ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. టోర్నీని కళ్లు చెదిరే ఫోర్​తో ప్రారంభించాడు భారత​ విధ్వంసకర ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. బంగ్లాదేశ్​ బౌలర్లను ఉతికారేస్తూ 175 (140) పరుగులు సాధించాడు వీరూ. విరాట్​ కోహ్లీ 100 (83)తో మ్యాచ్​ స్వరూపాన్ని మార్చేశాడు.

బౌలింగ్​లో మునాఫ్​ పటేల్​ 4 వికెట్లతో చెలరేగాడు. సమష్టి ప్రదర్శనతో 87 పరుగుల తేడాతో భారత్​ జయకేతనం ఎగురవేసి టోర్నీని ఘనంగా ఆరంభించింది.

టోర్నీకే హైలైట్​...

ఇంగ్లాండ్​ X ఐర్లాండ్​ మధ్య జరిగిన మ్యాచ్​ మెగాటోర్నీలో తీవ్ర ఉత్కంఠ రేపింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్ 8/327 భారీ స్కోరు చేసింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్​ జట్టు 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే అనూహ్యంగా ఆరో వికెట్​కు కెవిన్​ ఓబ్రెయిన్​ 113 (63), అలెక్స్​ కుసాక్​ 47 (63) జోడీ 162 పరుగులు జత చేసింది. ప్రపంచకప్​ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.

కెవిన్​ ఓబ్రెయిన్​
కెవిన్​ ఓబ్రెయిన్​

క్వార్టర్స్​ చేరిన జట్లు..

లీగ్​ దశ ముగిశాక పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా పూల్​-ఏ నుంచి క్వార్టర్స్​ చేరాయి. పూల్​- బీ నుంచి భారత్​, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్​, ఇంగ్లాండ్​ క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించాయి.

ఆస్ట్రేలియా X భారత్​...

క్వార్టర్స్​లో భారత్​ బలమైన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొంది. అహ్మదాబాద్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్​ చేసింది. కెప్టెన్​ రికీ పాంటింగ్​ 104 శతకంతో చెలరేగగా.. ఆసిస్​ 261 పరుగుల లక్ష్యాన్ని ధోనిసేన ముందు ఉంచింది. సమష్టిగా రాణించిన భారత బ్యాట్స్​మెన్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. సచిన్​ 53, గంభీర్​ 50, యువరాజ్ సింగ్ 57*, రైనా 34* పరుగులు చేశారు.

మిగిలిన క్వార్టర్స్​ ఇలా...

వెస్టిండీస్​తో తలపడి పాకిస్థాన్​ సెమీస్​ చేరింది. మరో క్వార్టర్స్​లో ఇంగ్లాండ్​ను ఓడించి శ్రీలంక సెమీస్​ బెర్త్​ నిలుపుకొంది. మెగాటోర్నీల్లో తన బలహీనతను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికా మరోసారి కివీస్​కు మ్యాచ్​ అప్పగించింది.

సెమీస్​లో ఢీ అంటే ఢీ...

సెమీస్​లో న్యూజిలాండ్​ X శ్రీలంక, చిరకాల ప్రత్యర్థులైన భారత్ X పాకిస్థాన్​ తలపడ్డాయి.

మొదటి సెమీస్​లో కివీస్​ను 217 పరుగులకే ఆలౌట్​ చేసింది లంక జట్టు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో విజయం చివరకు శ్రీలంక జట్టునే వరించింది.

దాయాదుల పోరు...

మొహాలీలో జరిగిన దాయాదుల సమరానికి స్టేడియం అభిమానులతో నిండిపోయింది. మొత్తం 35 వేల మంది ఈ మ్యాచ్​ను స్టేడియంలో వీక్షించారు. ముందుగా బ్యాటింగ్​కు దిగిన భారత్​ 9/260 పరుగులు చేసింది. సచిన్​ 85 (115) పరుగులతో రాణించాడు. తెందూల్కర్ ఈ మ్యాచ్​లో మొత్తం 6 సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 క్యాచ్​లు జార విడిచారు పాక్​ ఆటగాళ్లు.

261 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాక్​ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 231 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటి వరకు ప్రపంచకప్​ టోర్నీలో ఒక్కసారి కూడా భారత్​ను ఓడించలేకపోయిన పాక్​... తన రికార్డును కొనసాగించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వాంఖడే వేదికగా...

శ్రీలంక X భారత్​ మధ్య ముంబయి వాంఖడే వేదికగా ఫైనల్​ జరిగింది. ప్రపంచకప్​ చరిత్రలో తొలిసారి రెండు ఆసియా జట్లు తుదిపోరులో తలపడ్డాయి. అభిమానుల అరుపుల మధ్య రిఫరీకి టాస్​ సమయంలో ఎవరేం చెప్పారో వినపడక టాస్​ రెండోసారి వేయాల్సి వచ్చింది. టాస్​ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్​ ఎంచుకుంది. మహేలా జయవర్థనే 104 (88) సాయంతో 6/ 274 పరుగులు చేసింది లంక జట్టు.

కిక్కిరిసిన స్టేడియంలో అభిమానుల అరుపుల మధ్య భారత ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్​కు వచ్చారు. అయితే తొలి ఓవర్లోనే లసిత్​ మలింగ సెహ్వాగ్​ను ఎల్​బీడబ్లూ చేసి పెవిలియన్​కు పంపాడు. కొద్ది సేపటికే సచిన్​ను అవుట్​ చేసాడు మలింగ. స్టేడియం మొత్తం నిశబ్దం అలుముకుంది. విరాట్ కోహ్లీ​ 35 సాయంతో గౌతమ్​ గంభీర్ 97 (122) అద్భుతంగా ఆడాడు.

గౌతమ్​ గంభీర్​
గౌతమ్​ గంభీర్​

కోహ్లీ వెనుదిరిగాక ఫామ్​లో ఉన్న యువరాజ్​ను కాదని కెప్టెన్​ ధోని క్రీజులోకి వచ్చాడు. చివరి వరకు నిలిచిన ధోని మైదానంలో ఎడాపెడా షాట్లతో విరుచుకుపడ్డాడు. 91* పరుగులు చేశాడు. చివర్లో తన మార్కు హెలికాఫ్టర్​ షాట్​తో సిక్సర్​ బాది 28 ఏళ్ల భారత్​ నిరీక్షణకు తెరదించాడు. క్రికెట్​ దేవుడు సచిన్​ ​కల సాకారం చేశాడు.

సచిన్​ను భూజాలపై మోస్తూ భారత ఆటగాళ్లు వాంఖడేలో తిరిగిన దృశ్యాలు ఇప్పటికీ ప్రతి భారత అభిమానికి ఓ మధుర జ్ఞాపకమే.

వరల్డ్​కప్​ను పట్టుకున్న సచిన్
వరల్డ్​కప్​ను పట్టుకున్న సచిన్

ఆసక్తికర విషయాలు....

  1. యువరాజ్​ సింగ్​ ఆల్​రౌండ్​ ప్రదర్శనతో భారత్​ వరల్డ్​కప్​ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
    మ్యాన్​ ఆఫ్​ ది టార్నమెంట్​
    మ్యాన్​ ఆఫ్​ ది టార్నమెంట్​
  2. సెహ్వాగ్​ టోర్నీని ఫోర్​తో ఆరంభిస్తే... ధోని సిక్సర్​తో ముగించాడు.
  3. ప్రపంచకప్​ ఫైనల్లో సెంచరీ చేసి కూడా ఓటమి వైపు నిలిచిన జట్టులో ఉన్నవాడు జయవర్థనే ఒక్కడే.
  4. మ్యాన్​ ఆఫ్​ ద టోర్నమెంట్​ - యువరాజ్​ సింగ్
  5. అత్యధిక పరుగులు - తిలకరత్నే దిల్షన్ ( 500)
  6. అత్యధిక వికెట్లు - షాహిద్​ అఫ్రిదీ (21)
  7. అత్యధిక స్కోరు - భారత్​ 4/370 (బంగ్లాదేశ్​తో)
  8. అత్యల్ప స్కోరు - బంగ్లాదేశ్​ 58 (వెస్టిండీస్​తో)
  9. మ్యాచ్​ ఆఫ్​ ద టోర్నమెంట్ - ఇంగ్లాండ్​ X ఐర్లాండ్​

2011 ప్రపంచకప్​... అప్పటికి భారత్​ విశ్వవిజేతగా నిలిచి 28 ఏళ్లు గడిచిపోయింది. కపిల్​దేవ్​ నేతృత్వంలో భీకర కరేబియన్​ జట్టును ఓడించి తొలిసారి 1983లో భారత్​ ప్రపంచకప్​ గెలిచింది. ఆ తర్వాత జరిగిన మరో ఆరు ప్రపంచకప్​ టోర్నీల్లో భారత్​కు నిరాశే ఎదురైంది.

1983 ప్రపంచకప్​ గెలిచిన భారత్​
1983 ప్రపంచకప్​ గెలిచిన భారత్​

స్వదేశంలో జరిగిన 2011 ప్రపంచకప్​పై యావత్​ దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2007 టీ20 ప్రపంచకప్​లో భారత్​ను విశ్వవిజేతగా నిలిపిన తిరుగులేని సారథి ఎంఎస్​ ధోనిపైనే అందరి నమ్మకం. వరల్డ్​కప్​ను ముద్దాడాలన్నది క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ కల. అది ఈ ప్రపంచకప్​లోనైనా నెరవేరుతుందా? క్రికెట్ దేవుడికి ఘనమైన వీడ్కోలు దక్కుతుందా? ఒత్తిడిని తట్టుకుని భారత్​ మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందా? ఇన్ని ప్రశ్నల మధ్య భారత్​ టోర్నీలో అడుగుపెట్టింది.

తొలి మ్యాచ్​...

తొలి మ్యాచ్​ భారత్​- బంగ్లాదేశ్​ మధ్య జరిగింది. 2007లో బంగ్లాదేశ్​ చేతిలో భారత్​ ఓడి మెగాటోర్ని నుంచి నిష్క్రమించింది. ఈ పరాజయం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం తెచ్చింది. ఆ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. టోర్నీని కళ్లు చెదిరే ఫోర్​తో ప్రారంభించాడు భారత​ విధ్వంసకర ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. బంగ్లాదేశ్​ బౌలర్లను ఉతికారేస్తూ 175 (140) పరుగులు సాధించాడు వీరూ. విరాట్​ కోహ్లీ 100 (83)తో మ్యాచ్​ స్వరూపాన్ని మార్చేశాడు.

బౌలింగ్​లో మునాఫ్​ పటేల్​ 4 వికెట్లతో చెలరేగాడు. సమష్టి ప్రదర్శనతో 87 పరుగుల తేడాతో భారత్​ జయకేతనం ఎగురవేసి టోర్నీని ఘనంగా ఆరంభించింది.

టోర్నీకే హైలైట్​...

ఇంగ్లాండ్​ X ఐర్లాండ్​ మధ్య జరిగిన మ్యాచ్​ మెగాటోర్నీలో తీవ్ర ఉత్కంఠ రేపింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్ 8/327 భారీ స్కోరు చేసింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్​ జట్టు 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే అనూహ్యంగా ఆరో వికెట్​కు కెవిన్​ ఓబ్రెయిన్​ 113 (63), అలెక్స్​ కుసాక్​ 47 (63) జోడీ 162 పరుగులు జత చేసింది. ప్రపంచకప్​ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.

కెవిన్​ ఓబ్రెయిన్​
కెవిన్​ ఓబ్రెయిన్​

క్వార్టర్స్​ చేరిన జట్లు..

లీగ్​ దశ ముగిశాక పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా పూల్​-ఏ నుంచి క్వార్టర్స్​ చేరాయి. పూల్​- బీ నుంచి భారత్​, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్​, ఇంగ్లాండ్​ క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించాయి.

ఆస్ట్రేలియా X భారత్​...

క్వార్టర్స్​లో భారత్​ బలమైన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొంది. అహ్మదాబాద్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్​ చేసింది. కెప్టెన్​ రికీ పాంటింగ్​ 104 శతకంతో చెలరేగగా.. ఆసిస్​ 261 పరుగుల లక్ష్యాన్ని ధోనిసేన ముందు ఉంచింది. సమష్టిగా రాణించిన భారత బ్యాట్స్​మెన్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. సచిన్​ 53, గంభీర్​ 50, యువరాజ్ సింగ్ 57*, రైనా 34* పరుగులు చేశారు.

మిగిలిన క్వార్టర్స్​ ఇలా...

వెస్టిండీస్​తో తలపడి పాకిస్థాన్​ సెమీస్​ చేరింది. మరో క్వార్టర్స్​లో ఇంగ్లాండ్​ను ఓడించి శ్రీలంక సెమీస్​ బెర్త్​ నిలుపుకొంది. మెగాటోర్నీల్లో తన బలహీనతను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికా మరోసారి కివీస్​కు మ్యాచ్​ అప్పగించింది.

సెమీస్​లో ఢీ అంటే ఢీ...

సెమీస్​లో న్యూజిలాండ్​ X శ్రీలంక, చిరకాల ప్రత్యర్థులైన భారత్ X పాకిస్థాన్​ తలపడ్డాయి.

మొదటి సెమీస్​లో కివీస్​ను 217 పరుగులకే ఆలౌట్​ చేసింది లంక జట్టు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో విజయం చివరకు శ్రీలంక జట్టునే వరించింది.

దాయాదుల పోరు...

మొహాలీలో జరిగిన దాయాదుల సమరానికి స్టేడియం అభిమానులతో నిండిపోయింది. మొత్తం 35 వేల మంది ఈ మ్యాచ్​ను స్టేడియంలో వీక్షించారు. ముందుగా బ్యాటింగ్​కు దిగిన భారత్​ 9/260 పరుగులు చేసింది. సచిన్​ 85 (115) పరుగులతో రాణించాడు. తెందూల్కర్ ఈ మ్యాచ్​లో మొత్తం 6 సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 క్యాచ్​లు జార విడిచారు పాక్​ ఆటగాళ్లు.

261 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాక్​ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 231 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటి వరకు ప్రపంచకప్​ టోర్నీలో ఒక్కసారి కూడా భారత్​ను ఓడించలేకపోయిన పాక్​... తన రికార్డును కొనసాగించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వాంఖడే వేదికగా...

శ్రీలంక X భారత్​ మధ్య ముంబయి వాంఖడే వేదికగా ఫైనల్​ జరిగింది. ప్రపంచకప్​ చరిత్రలో తొలిసారి రెండు ఆసియా జట్లు తుదిపోరులో తలపడ్డాయి. అభిమానుల అరుపుల మధ్య రిఫరీకి టాస్​ సమయంలో ఎవరేం చెప్పారో వినపడక టాస్​ రెండోసారి వేయాల్సి వచ్చింది. టాస్​ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్​ ఎంచుకుంది. మహేలా జయవర్థనే 104 (88) సాయంతో 6/ 274 పరుగులు చేసింది లంక జట్టు.

కిక్కిరిసిన స్టేడియంలో అభిమానుల అరుపుల మధ్య భారత ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్​కు వచ్చారు. అయితే తొలి ఓవర్లోనే లసిత్​ మలింగ సెహ్వాగ్​ను ఎల్​బీడబ్లూ చేసి పెవిలియన్​కు పంపాడు. కొద్ది సేపటికే సచిన్​ను అవుట్​ చేసాడు మలింగ. స్టేడియం మొత్తం నిశబ్దం అలుముకుంది. విరాట్ కోహ్లీ​ 35 సాయంతో గౌతమ్​ గంభీర్ 97 (122) అద్భుతంగా ఆడాడు.

గౌతమ్​ గంభీర్​
గౌతమ్​ గంభీర్​

కోహ్లీ వెనుదిరిగాక ఫామ్​లో ఉన్న యువరాజ్​ను కాదని కెప్టెన్​ ధోని క్రీజులోకి వచ్చాడు. చివరి వరకు నిలిచిన ధోని మైదానంలో ఎడాపెడా షాట్లతో విరుచుకుపడ్డాడు. 91* పరుగులు చేశాడు. చివర్లో తన మార్కు హెలికాఫ్టర్​ షాట్​తో సిక్సర్​ బాది 28 ఏళ్ల భారత్​ నిరీక్షణకు తెరదించాడు. క్రికెట్​ దేవుడు సచిన్​ ​కల సాకారం చేశాడు.

సచిన్​ను భూజాలపై మోస్తూ భారత ఆటగాళ్లు వాంఖడేలో తిరిగిన దృశ్యాలు ఇప్పటికీ ప్రతి భారత అభిమానికి ఓ మధుర జ్ఞాపకమే.

వరల్డ్​కప్​ను పట్టుకున్న సచిన్
వరల్డ్​కప్​ను పట్టుకున్న సచిన్

ఆసక్తికర విషయాలు....

  1. యువరాజ్​ సింగ్​ ఆల్​రౌండ్​ ప్రదర్శనతో భారత్​ వరల్డ్​కప్​ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
    మ్యాన్​ ఆఫ్​ ది టార్నమెంట్​
    మ్యాన్​ ఆఫ్​ ది టార్నమెంట్​
  2. సెహ్వాగ్​ టోర్నీని ఫోర్​తో ఆరంభిస్తే... ధోని సిక్సర్​తో ముగించాడు.
  3. ప్రపంచకప్​ ఫైనల్లో సెంచరీ చేసి కూడా ఓటమి వైపు నిలిచిన జట్టులో ఉన్నవాడు జయవర్థనే ఒక్కడే.
  4. మ్యాన్​ ఆఫ్​ ద టోర్నమెంట్​ - యువరాజ్​ సింగ్
  5. అత్యధిక పరుగులు - తిలకరత్నే దిల్షన్ ( 500)
  6. అత్యధిక వికెట్లు - షాహిద్​ అఫ్రిదీ (21)
  7. అత్యధిక స్కోరు - భారత్​ 4/370 (బంగ్లాదేశ్​తో)
  8. అత్యల్ప స్కోరు - బంగ్లాదేశ్​ 58 (వెస్టిండీస్​తో)
  9. మ్యాచ్​ ఆఫ్​ ద టోర్నమెంట్ - ఇంగ్లాండ్​ X ఐర్లాండ్​
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Borg El Arab Stadium, Alexandria, Egypt. 26th May 2019.
1. 00:00 Exterior shot of Borg El Arab stadium
2. 00:07 Borg El Arab stadium gate
3. 00:13 Zamalek supporters watching the game
4. 00:19 Zamalek supporter reaction during penalty shootout, 1-0 score (1-1 AGG)
5. 00:32 SOUNDBITE (Arabic) Unidentified Zamalek supporter:
"The game was great and thank God for winning. It took us a long way to reach here. We needed to get this result at home. We all love our club.  El Zamalek it's more important than anything else."
6. 00:43 Zamalek fans celebrating
7. 01:00 SOUNDBITE (Arabic) Unidentified Zamalek supporter:
"The best thing that happened in my life is El Zamalek. I'm A Zamalek fan 'till my very last breath. Long Live Zamalek, the best club in Egypt."
8. 01:12 Various of fans celebrating  
SOURCE: SNTV
DURATION: 01:48
STORYLINE:
Zamalek fans gathered in the streets of Alexandria to celebrate their side lifted the CAF Confederation Cup for the first time in their history after beating RSB Berkane of Morocco 5-3 on penalties.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.