2005 ఏప్రిల్లో భారత్ పాకిస్థాన్తో వన్డే సిరీస్ ఆడుతోంది. విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో సచిన్ ఆరంభంలో రనౌట్ అయ్యాడు. అప్పుడు వన్డౌన్లో నూనుగు మీసాలతో ఓ 24 ఏళ్ల కుర్రాడు బ్యాటింగ్కు దిగాడు. అందరూ ఇతను ఏమి ఆడతాడులే.. సెహ్వాగ్కు అండగా నిలిస్తే చాలని అనుకున్నారు. కానీ భీకర రీతిలో అద్భుతమైన సెంచరీ చేశాడు. అతడే మహేంద్ర సింగ్ ధోనీ. 148 పరుగులతో రెచ్చిపోయాడు. మరుసటి రోజు పత్రికల్లో, టీవిల్లో ఇదే వార్త. ముఖ్యంగా వినూత్నంగా ధోనీ ఆడిన షాట్ గురించే చర్చ. అనంతరం హెలికాప్టర్ షాట్గా బాగా పాపులర్ అయింది. ఈ షాట్ను మహీకి అతడి స్నేహితుడు సంతోష్ లాల్ నేర్పించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సమోసా కోసం హెలీకాప్టర్ షాట్ నేర్పించాడు..
హెలికాప్టర్ షాట్ తనకు సంతోష్ అనే స్నేహితుడు నేర్పించాడని ధోనినే చాలా సార్లు తెలిపాడు. చిన్నతనం నుంచే మిత్రులైన వీరిద్దరూ జార్ఖాండ్ తరపున రంజీ మ్యాచ్ల్లో కలిసి ఆడారు. ఆసక్తికరమైన విషయమేమంటే సమోసాల కోసం ధోనికి హెలికాప్టర్ షాట్ ఎలా ఆడాలో నెర్పాడంట సంతోష్. ఈ షాట్ను అతడు(సంతోష్) 'తప్పడ్ షాట్' అని పిలిచేవాడంట. అతికొద్దిమందితోనే సన్నిహితంగా ఉండే ధోని చివరి వరకు సంతోష్ను వదులుకోలేదు.
![SANTHOSH- DHONI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3772946_mahi.jpg)
అనారోగ్యంతో మిత్రుని మరణం..