వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్ను కైవసం చేసుకుని ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ఈ జట్టుపై రెండో టెస్టులో 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన భారత్ పేసర్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ.
"టీ20 బౌలర్ అనే పేరును చెరిపేస్తూ ప్రపంచ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో రాణించే స్థాయికి చేరాడు బుమ్రా. తానేంటో నిరూపించుకుని పూర్తిస్థాయి ఆటగాడిగా మారాడు. పేస్, స్వింగ్లతో అన్ని విధాలుగా బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తున్నాడు. అంతర్జాతీయ వేదికపై పరిపూర్ణమైన బౌలర్ బుమ్రా. ప్రపంచంలోనే అతడు అత్యుత్తమ పేసర్ అనడంలో సందేహం లేదు. ఆటలో ఎంతో శ్రద్ధ చూపిస్తూ తనని తాను మలుచుకున్నాడు. బుమ్రా మా జట్టులో ఉండటం అదృష్టం". -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
తొలి టెస్టులో విండీస్పై చెలరేగిన బుమ్రా.. రెండో మ్యాచ్లోనూ ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. టాప్ 5 బ్యాట్స్మెన్లతో కలిపి 6 వికెట్లు తీశాడు. ఇదే మ్యాచ్లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్గా రికార్డు సాధించాడు.
ఇదీ చూడండి: టీ20లకు ప్రముఖ క్రికెటర్ మిథాలీ వీడ్కోలు