ETV Bharat / sports

'మరి ఆ రోజుల్లో ఫోన్ మాట్లాడాలంటే..'

author img

By

Published : May 25, 2020, 10:39 AM IST

టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. చరవాణులు లేని సమయంలో ఫోన్లు ఇలా మాట్లాడేవాళ్లం అంటూ ఓ చిత్రం ద్వారా అభిమానులకు వెల్లడించాడు యువీ.

Yuvraj Singh's "Throwback To Days Without Mobile Phones"
'సరిగ్గా ఆడకపోతే ఫోన్​ బిల్లు కట్టేవాళ్లు కాదు'

టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్​, వీవీఎస్​ లక్ష్మణ్​, ఆశిష్​ నెహ్రాలతో కలిసున్న చిత్రాన్ని ఆదివారం సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు. చరవాణులు లేని కాలం నాటి ఆ చిత్రం అందర్ని నవ్వించే విధంగా ఉంది.

"ఓ పేలవ ప్రదర్శన తర్వాత తల్లిదండ్రులు మీ ఫోన్​ బిల్లును చెల్లించకపోతే" అనే క్యాప్షన్​తో నెహ్రా, సెహ్వాగ్​, లక్ష్మణ్​లను ట్యాగ్​ చేశాడు. మొబైల్స్​ లేని రోజుల్లో ఫోన్​ మాట్లాడుకోవడానికి మాజీ క్రికెటర్లు ఈ విధంగా బూత్​లో నిల్చొని కష్టపడేవారని యువీ తెలిపాడు.

When your parents don’t pay your mobile phone bill after a bad performance 😆! #throwback to days without 📱😇 @virendersehwag @VVSLaxman281 pic.twitter.com/qF8LIUCSt6

— yuvraj singh (@YUVSTRONG12) May 24, 2020

కీపిట్​ అప్​ ఛాలెంజ్​

యువరాజ్​.. ఇటీవలే​ సామాజిక మాధ్యమాల్లో భారత మాజీ క్రికెటర్లకు ఓ సరికొత్త సవాలు విసిరాడు. #KeepItUp​ అనే ఛాలెంజ్​ను ప్రారంభించి దీన్ని కొనసాగించండి అంటూ పలువురిని నామినేట్​ చేశాడు. అందులో మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​, రోహిత్​ శర్మ, హర్భజన్​ సింగ్​తో పాటు యునైటెడ్​ నేషన్స్​, నటి దియా మీర్జా ఉన్నారు. అయితే ఈ ఛాలెంజ్​ను స్వీకరించిన సచిన్​.. కళ్లకు గంతలు కట్టుకొని అదే పని చేయమని యువీకి తిరిగి నామినేట్​ చేశాడు.

ఇదీ చూడండి... భారత హాకీ లెజెండ్​ బల్బీర్ ​సింగ్ ఇకలేరు

టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్​, వీవీఎస్​ లక్ష్మణ్​, ఆశిష్​ నెహ్రాలతో కలిసున్న చిత్రాన్ని ఆదివారం సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు. చరవాణులు లేని కాలం నాటి ఆ చిత్రం అందర్ని నవ్వించే విధంగా ఉంది.

"ఓ పేలవ ప్రదర్శన తర్వాత తల్లిదండ్రులు మీ ఫోన్​ బిల్లును చెల్లించకపోతే" అనే క్యాప్షన్​తో నెహ్రా, సెహ్వాగ్​, లక్ష్మణ్​లను ట్యాగ్​ చేశాడు. మొబైల్స్​ లేని రోజుల్లో ఫోన్​ మాట్లాడుకోవడానికి మాజీ క్రికెటర్లు ఈ విధంగా బూత్​లో నిల్చొని కష్టపడేవారని యువీ తెలిపాడు.

కీపిట్​ అప్​ ఛాలెంజ్​

యువరాజ్​.. ఇటీవలే​ సామాజిక మాధ్యమాల్లో భారత మాజీ క్రికెటర్లకు ఓ సరికొత్త సవాలు విసిరాడు. #KeepItUp​ అనే ఛాలెంజ్​ను ప్రారంభించి దీన్ని కొనసాగించండి అంటూ పలువురిని నామినేట్​ చేశాడు. అందులో మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​, రోహిత్​ శర్మ, హర్భజన్​ సింగ్​తో పాటు యునైటెడ్​ నేషన్స్​, నటి దియా మీర్జా ఉన్నారు. అయితే ఈ ఛాలెంజ్​ను స్వీకరించిన సచిన్​.. కళ్లకు గంతలు కట్టుకొని అదే పని చేయమని యువీకి తిరిగి నామినేట్​ చేశాడు.

ఇదీ చూడండి... భారత హాకీ లెజెండ్​ బల్బీర్ ​సింగ్ ఇకలేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.