ETV Bharat / sports

'సెహ్వాగ్​ రికార్డు అధిగమించాలని యువీ కోరాడు'

వీరేంద్ర సెహ్వాగ్​ అత్యధిక పరుగుల రికార్డు అధిగమించాలని యువరాజ్​ తనకు సూచించినట్లు రోహిత్​ శర్మ తెలిపాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​లో 209 పరుగులతో వెనుదిరిగిన సమయంలో యువీ ఆ మాట తనతో అన్నాడని తాజాగా గుర్తు చేసుకున్నాడు.

author img

By

Published : May 19, 2020, 4:44 PM IST

Updated : May 19, 2020, 5:39 PM IST

Yuvraj Singh wanted me to break Virender Sehwag's record: Rohit Sharma on his maiden ODI double ton
'సెహ్వాగ్​ రికార్డు అధిగమించాలని యువీ కోరాడు'

వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును అధిగమించాలని యువరాజ్​ తనను కోరినట్లు టీమ్​ఇండియా వైస్​కెప్టెన్​ రోహిత్​శర్మ వెల్లడించాడు. 2013లో ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్​లో 209 పరుగులు చేసి సిరీస్​ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు హిట్​మ్యాన్. సోమవారం భారత స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​తో జరిగిన ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో తొలి డబుల్​ సెంచరీ తర్వాత జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నాడు రోహిత్​.

"డబుల్​ సెంచరీ చేసి వెనుదిరిగినపుడు.. 'నువ్వు మరో ఓవర్​ ఆడి ఉంటే సెహ్వాగ్​ రికార్డును బద్దలు కొట్టేవాడివి' అని అన్నాడు యువీ. అప్పటికే డ్రసింగ్​ రూమ్​లో నాపై అంచనాలు చాలా పెట్టుకున్నారు. మరో 10 నుంచి 15 పరుగులు చేసి ఉండాల్సిందని.. యువీ, శిఖర్​ ధావన్​ అన్నారు".

-రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​

2013లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో భారత్​ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఆచితూచి ఆడిన రోహిత్​.. సెంచరీ దాటిన తర్వాత వేగం అమాంతంగా పెంచాడు. 158 బంతుల్లో 209 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్​లో 384 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించిన భారత్​.. 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రోహిత్​ శర్మ కెరీర్​లో ఇప్పటివరకు 224 వన్డేలు, 108 టీ20లు, 32 టెస్టులు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 14,029 పరుగులు చేశాడు. మూడు డబుల్​ సెంచరీలు సాధించాడు. కోల్​కతా ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్​లో 264 పరుగులు సాధించి.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్​గా ఘనత దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి.. పాంటింగ్​ అందుకే కెప్టెన్​గా ఉండనన్నాడు: రోహిత్​

వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును అధిగమించాలని యువరాజ్​ తనను కోరినట్లు టీమ్​ఇండియా వైస్​కెప్టెన్​ రోహిత్​శర్మ వెల్లడించాడు. 2013లో ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్​లో 209 పరుగులు చేసి సిరీస్​ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు హిట్​మ్యాన్. సోమవారం భారత స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​తో జరిగిన ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో తొలి డబుల్​ సెంచరీ తర్వాత జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నాడు రోహిత్​.

"డబుల్​ సెంచరీ చేసి వెనుదిరిగినపుడు.. 'నువ్వు మరో ఓవర్​ ఆడి ఉంటే సెహ్వాగ్​ రికార్డును బద్దలు కొట్టేవాడివి' అని అన్నాడు యువీ. అప్పటికే డ్రసింగ్​ రూమ్​లో నాపై అంచనాలు చాలా పెట్టుకున్నారు. మరో 10 నుంచి 15 పరుగులు చేసి ఉండాల్సిందని.. యువీ, శిఖర్​ ధావన్​ అన్నారు".

-రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​

2013లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో భారత్​ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఆచితూచి ఆడిన రోహిత్​.. సెంచరీ దాటిన తర్వాత వేగం అమాంతంగా పెంచాడు. 158 బంతుల్లో 209 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్​లో 384 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించిన భారత్​.. 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రోహిత్​ శర్మ కెరీర్​లో ఇప్పటివరకు 224 వన్డేలు, 108 టీ20లు, 32 టెస్టులు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 14,029 పరుగులు చేశాడు. మూడు డబుల్​ సెంచరీలు సాధించాడు. కోల్​కతా ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్​లో 264 పరుగులు సాధించి.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్​గా ఘనత దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి.. పాంటింగ్​ అందుకే కెప్టెన్​గా ఉండనన్నాడు: రోహిత్​

Last Updated : May 19, 2020, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.