మహిళల టీ20 ఛాలెంజ్ మూడో సీజన్కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న మూడు జట్లతో పాటు ఈసారి కొత్తగా మరో జట్టు చేరింది. ఈ విషయాన్ని బీసీసీఐ.. శనివారం అధికారికంగా వెల్లడించింది. జైపుర్లోని సవాయ్ మాన్సింగ్ మైదానం ఈ మ్యాచ్లకు వేదిక. ఐపీఎల్-2020 ప్లేఆఫ్స్ జరిగేటప్పుడు ఈ నాలుగు జట్ల మధ్య ఏడు మ్యాచ్లు జరగనున్నాయి.
2018లో మొదలైన ఈ టోర్నీలో తొలుత రెండు జట్లు ఆడాయి. గతేడాది ట్రైల్ బ్లేజర్స్, సూపర్నోవాస్, వెలాసిటీల మధ్య మ్యాచ్లు జరిగాయి. ఇందులో గెలిచిన సూపర్నోవాస్... వరుసగా రెండోసారి టైటిల్ దక్కించుకుంది.
ఐపీఎల్ 13వ సీజన్.. వచ్చే నెల 29 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఇదీ చూడండి : దుబాయ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో జకోవిచ్