ETV Bharat / sports

మహిళల టీ20 ఛాలెంజ్​లో మరో జట్టు​: బీసీసీఐ

author img

By

Published : Feb 29, 2020, 5:24 PM IST

Updated : Mar 2, 2020, 11:33 PM IST

ఈ ఏడాది జరగబోయే మహిళల టీ20 ఛాలెంజ్​లో అదనంగా మరో జట్టు చేరింది. రాజస్థాన్​ జైపుర్​లో వీటి మధ్య మ్యాచ్​లు జరగనున్నాయి.

bcci_
మహిళల టీ20 ఛాలెంజ్​లో మరో జట్టు​: బీసీసీఐ

మహిళల టీ20 ఛాలెంజ్​ మూడో సీజన్​కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న మూడు జట్లతో పాటు ఈసారి కొత్తగా మరో జట్టు చేరింది. ఈ విషయాన్ని బీసీసీఐ.. శనివారం అధికారికంగా వెల్లడించింది. జైపుర్​లోని సవాయ్ మాన్​సింగ్ మైదానం ఈ మ్యాచ్​లకు వేదిక. ఐపీఎల్-2020 ప్లేఆఫ్స్ జరిగేటప్పుడు ఈ నాలుగు జట్ల మధ్య ఏడు మ్యాచ్​లు జరగనున్నాయి.

2018లో మొదలైన ఈ టోర్నీలో తొలుత రెండు జట్లు ఆడాయి. గతేడాది ట్రైల్​ బ్లేజర్స్, సూపర్​నోవాస్​, వెలాసిటీల మధ్య మ్యాచ్​లు జరిగాయి. ఇందులో గెలిచిన సూపర్​నోవాస్... వరుసగా రెండోసారి టైటిల్ దక్కించుకుంది.

​ఐపీఎల్‌ 13వ సీజన్.. వచ్చే నెల 29 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్​ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

ఇదీ చూడండి : దుబాయ్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో జకోవిచ్​

మహిళల టీ20 ఛాలెంజ్​ మూడో సీజన్​కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న మూడు జట్లతో పాటు ఈసారి కొత్తగా మరో జట్టు చేరింది. ఈ విషయాన్ని బీసీసీఐ.. శనివారం అధికారికంగా వెల్లడించింది. జైపుర్​లోని సవాయ్ మాన్​సింగ్ మైదానం ఈ మ్యాచ్​లకు వేదిక. ఐపీఎల్-2020 ప్లేఆఫ్స్ జరిగేటప్పుడు ఈ నాలుగు జట్ల మధ్య ఏడు మ్యాచ్​లు జరగనున్నాయి.

2018లో మొదలైన ఈ టోర్నీలో తొలుత రెండు జట్లు ఆడాయి. గతేడాది ట్రైల్​ బ్లేజర్స్, సూపర్​నోవాస్​, వెలాసిటీల మధ్య మ్యాచ్​లు జరిగాయి. ఇందులో గెలిచిన సూపర్​నోవాస్... వరుసగా రెండోసారి టైటిల్ దక్కించుకుంది.

​ఐపీఎల్‌ 13వ సీజన్.. వచ్చే నెల 29 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్​ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

ఇదీ చూడండి : దుబాయ్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో జకోవిచ్​

Last Updated : Mar 2, 2020, 11:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.