ETV Bharat / sports

ప్రాక్టీస్​ మ్యాచ్​లో కివీస్​ చేతిలో భారత్​ ఓటమి

author img

By

Published : May 25, 2019, 10:10 PM IST

ప్రపంచకప్​ ముందు జరిగిన ప్రాక్టీసు మ్యాచ్​లో భారత క్రికెట్ జట్టు ఓటమి చవిచూసింది. భారత్​ నిర్దేశించిన 180 పరుగులు లక్ష్యాన్ని చేధించిన న్యూజిలాండ్​ 6 వికెట్ల తేడాతో గెలిచింది. కివీస్​ కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ అర్ధసెంచరీలతో రాణించారు. టీమిండియా బ్యాట్స్​మెన్​లో జడేజా మినహా మరెవరూ రాణించలేదు.

ప్రాక్టీస్​ మ్యాచ్​లో టీమిండియా ఘోర పరాభవం

ప్రపంచకప్​లో టీమిండియాకు ఇది కలవరపరిచే అంశం. ఫేవరెట్లలో ఒకటైన భారత్.. శనివారం ఓవల్ వేదికగా జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాట్స్​మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క జడేజా మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. బౌలర్లూ ప్రభావం చూపించలేకపోయారు.

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్​.. మొదట్లోనే మన్రో వికెట్​ను కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే గప్తిల్ పెవిలియన్ చేరాడు.

కివీస్ జోడీ హిట్

అనంతరం క్రీజులోకి వచ్చిన టేలర్, కెప్టెన్ విలియమ్సన్​తో కలిసి నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్​కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లక్ష్యానికి చేరువవుతున్న వేళ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్ ఔటయ్యాడు. గెలిచేందుకు మరో పరుగు చేయాల్సిన సమయంలో 71 పరుగులు చేసిన టేలర్ పెవిలియన్ బాట పట్టాడు. తర్వాతి బ్యాట్స్​మెన్​ లాంఛనాన్ని పూర్తి చేశారు.

kane williamson
కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడిన న్యూజిాలాండ్​ సారధి విలియమ్సన్

టీమిండియా బౌలర్లలో బుమ్రా, హార్దిక్ పాండ్య, చాహల్, జడేజా తలో వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోహ్లీసేన.. ఆకట్టుకోలేకపోయింది. ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచి ప్రత్యర్థి జట్టులోని బౌలర్లు కచ్చితమైన లైన్​ అండ్​ లెంగ్త్​తో బౌలింగ్​ చేశారు. పరుగులు చేసేందుకు భారత బ్యాట్స్​మెన్ కష్టపడ్డారు. వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఒక్క జడేజా మినహా బ్యాట్స్​మెన్ అందరూ విఫలమయ్యారు. హార్దిక్ పాండ్య కొద్ది సేపు క్రీజులో నిలిచినా 30 పరుగులు చేసి నీషమ్ బౌలింగ్​లో ఔటయ్యాడు.

trent boult
కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్

జడేజా నిలబడ్డాడు.. పరువు కాపాడాడు

లోయర్ ఆర్డర్​లో వచ్చిన జడేజా అనూహ్యంగా కివీస్​ బౌలర్లపై చెలరేగాడు. సమయోచితంగా ఆడుతూ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 50 బంతుల్లో 54 పరుగులు చేసి తొమ్మిదో వికెట్​గా వెనుదిరిగాడు.

ravindra jadeja
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా

మిగతా బ్యాట్స్​మెన్​లో రోహిత్ 2, ధావన్ 2, కోహ్లీ18, రాహుల్ 6, హార్దిక్ 30, ధోని 17, దినేశ్ కార్తిక్ 4, భువనేశ్వర్ 1, షమి 2, కుల్​దీప్​ 19 పరుగులు చేశారు.

న్యూజిలాండ్​ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు దక్కించుకోగా, నీషమ్ 3, సౌతీ, గ్రాండ్​హమ్, ఫెర్గ్యూసన్ తలో వికెట్ తీశారు.

ప్రపంచకప్​లో టీమిండియాకు ఇది కలవరపరిచే అంశం. ఫేవరెట్లలో ఒకటైన భారత్.. శనివారం ఓవల్ వేదికగా జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాట్స్​మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క జడేజా మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. బౌలర్లూ ప్రభావం చూపించలేకపోయారు.

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్​.. మొదట్లోనే మన్రో వికెట్​ను కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే గప్తిల్ పెవిలియన్ చేరాడు.

కివీస్ జోడీ హిట్

అనంతరం క్రీజులోకి వచ్చిన టేలర్, కెప్టెన్ విలియమ్సన్​తో కలిసి నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్​కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లక్ష్యానికి చేరువవుతున్న వేళ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్ ఔటయ్యాడు. గెలిచేందుకు మరో పరుగు చేయాల్సిన సమయంలో 71 పరుగులు చేసిన టేలర్ పెవిలియన్ బాట పట్టాడు. తర్వాతి బ్యాట్స్​మెన్​ లాంఛనాన్ని పూర్తి చేశారు.

kane williamson
కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడిన న్యూజిాలాండ్​ సారధి విలియమ్సన్

టీమిండియా బౌలర్లలో బుమ్రా, హార్దిక్ పాండ్య, చాహల్, జడేజా తలో వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోహ్లీసేన.. ఆకట్టుకోలేకపోయింది. ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచి ప్రత్యర్థి జట్టులోని బౌలర్లు కచ్చితమైన లైన్​ అండ్​ లెంగ్త్​తో బౌలింగ్​ చేశారు. పరుగులు చేసేందుకు భారత బ్యాట్స్​మెన్ కష్టపడ్డారు. వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఒక్క జడేజా మినహా బ్యాట్స్​మెన్ అందరూ విఫలమయ్యారు. హార్దిక్ పాండ్య కొద్ది సేపు క్రీజులో నిలిచినా 30 పరుగులు చేసి నీషమ్ బౌలింగ్​లో ఔటయ్యాడు.

trent boult
కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్

జడేజా నిలబడ్డాడు.. పరువు కాపాడాడు

లోయర్ ఆర్డర్​లో వచ్చిన జడేజా అనూహ్యంగా కివీస్​ బౌలర్లపై చెలరేగాడు. సమయోచితంగా ఆడుతూ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 50 బంతుల్లో 54 పరుగులు చేసి తొమ్మిదో వికెట్​గా వెనుదిరిగాడు.

ravindra jadeja
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా

మిగతా బ్యాట్స్​మెన్​లో రోహిత్ 2, ధావన్ 2, కోహ్లీ18, రాహుల్ 6, హార్దిక్ 30, ధోని 17, దినేశ్ కార్తిక్ 4, భువనేశ్వర్ 1, షమి 2, కుల్​దీప్​ 19 పరుగులు చేశారు.

న్యూజిలాండ్​ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు దక్కించుకోగా, నీషమ్ 3, సౌతీ, గ్రాండ్​హమ్, ఫెర్గ్యూసన్ తలో వికెట్ తీశారు.

AP Video Delivery Log - 1400 GMT News
Saturday, 25 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1227: Nepal Everest Record AP Clients Only 4212583
Sherpa completes record 24 ascents of Everest
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.