ETV Bharat / sports

'చాలా గ్యాప్​ వచ్చింది.. అందుకే భయమేసింది'

author img

By

Published : Aug 30, 2020, 11:07 AM IST

క్వారంటైన్​ పూర్తి చేసుకుని ట్రైనింగ్​ సెషన్​లో అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ క్రమంలోనే స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారని కోహ్లీ పేర్కొన్నాడు.

Virat Kohli
కోహ్లీ

ఐపీఎల్​ కోసం దుబాయ్​ చేరిన రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిరోజు ట్రైనింగ్​ ముగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. ఈ క్రమంలోనే జట్టు సారథి విరాట్​ కోహ్లీ మాట్లాడుతూ.. మొదటి శిక్షణ సమావేశంలో సంతృప్తి చెందినట్లు పేర్కొన్నాడు. స్పిన్నర్లు చాలా బాగా రాణిస్తున్నారని అన్నాడు. ఐదు నెలల పాటు క్రికెట్​కు దూరంగా ఉండటం వల్ల తొలిరోజు శిక్షణలో అడుగుపెట్టే ముందు కాస్త భయపడినట్లు వెల్లడించాడు.

"నిజానికి ఐదునెలలు బ్యాటింగ్​కు దూరంగా ఉండటం వల్ల ట్రైనింగ్​ ప్రారంభించాలంటే భయమేసింది. కానీ ఊహించిన దానికంటే చాలా బాగుంది. లాక్​డౌన్​ సమయంలో కాస్త శిక్షణ పొందుతూ.. నా ఫిట్​నెస్​ను కాపాడుకుంటూ వచ్చా. అది నాకు చాలా ప్లస్​ అయ్యింది. ఒక వేళ ఫిట్​గా లేకుండా సీజన్​లో అడుగుపెడితే.. అది మనల్ని చాలా బాధిస్తుంది. స్పిన్నర్ల విషయానికొస్తే.. మొదటి రోజు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. షాబాజ్​ నదీమ్​, వాషింగ్టన్​ సుందర్​ బంతిని సరైన ప్రదేశంలో ల్యాండ్​ చేస్తున్నారు. చాహల్​ బౌలింగ్​ కూడా బాగుంది"

-విరాట్​ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్​

కరోనాతో లభించిన సుదీర్ఘ విరామం తర్వాత తిగిరి మైదానంలో అడుగుపెట్టడంపై ఆర్సీబీ బృందం సంతోషం వ్యక్తం చేసింది. కాగా కరోనా పరీక్షల్లో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మంది సిబ్బందికి పాజిటివ్​ నిర్ధరణ అయినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే వారిలో ఎటువంటి లక్షణాలు గుర్తించలేదని పేర్కొంది. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్​లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

ఐపీఎల్​ కోసం దుబాయ్​ చేరిన రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిరోజు ట్రైనింగ్​ ముగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. ఈ క్రమంలోనే జట్టు సారథి విరాట్​ కోహ్లీ మాట్లాడుతూ.. మొదటి శిక్షణ సమావేశంలో సంతృప్తి చెందినట్లు పేర్కొన్నాడు. స్పిన్నర్లు చాలా బాగా రాణిస్తున్నారని అన్నాడు. ఐదు నెలల పాటు క్రికెట్​కు దూరంగా ఉండటం వల్ల తొలిరోజు శిక్షణలో అడుగుపెట్టే ముందు కాస్త భయపడినట్లు వెల్లడించాడు.

"నిజానికి ఐదునెలలు బ్యాటింగ్​కు దూరంగా ఉండటం వల్ల ట్రైనింగ్​ ప్రారంభించాలంటే భయమేసింది. కానీ ఊహించిన దానికంటే చాలా బాగుంది. లాక్​డౌన్​ సమయంలో కాస్త శిక్షణ పొందుతూ.. నా ఫిట్​నెస్​ను కాపాడుకుంటూ వచ్చా. అది నాకు చాలా ప్లస్​ అయ్యింది. ఒక వేళ ఫిట్​గా లేకుండా సీజన్​లో అడుగుపెడితే.. అది మనల్ని చాలా బాధిస్తుంది. స్పిన్నర్ల విషయానికొస్తే.. మొదటి రోజు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. షాబాజ్​ నదీమ్​, వాషింగ్టన్​ సుందర్​ బంతిని సరైన ప్రదేశంలో ల్యాండ్​ చేస్తున్నారు. చాహల్​ బౌలింగ్​ కూడా బాగుంది"

-విరాట్​ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్​

కరోనాతో లభించిన సుదీర్ఘ విరామం తర్వాత తిగిరి మైదానంలో అడుగుపెట్టడంపై ఆర్సీబీ బృందం సంతోషం వ్యక్తం చేసింది. కాగా కరోనా పరీక్షల్లో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మంది సిబ్బందికి పాజిటివ్​ నిర్ధరణ అయినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే వారిలో ఎటువంటి లక్షణాలు గుర్తించలేదని పేర్కొంది. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్​లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.