ETV Bharat / sports

డకౌట్​ ట్వీట్​తో అభిమానుల ఆగ్రహం.. పోస్ట్​ డిలీట్​ - ఉత్తరాఖండ్​ పోలీస్​ ట్వీట్​

డ్రైవింగ్​పై అవగాహన కోసం టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ డకౌట్​ను ఉపయోగించి ఉత్తరాఖండ్​ పోలీసులు చేసిన ట్వీట్​పై వివాదం చెలరేగింది. దీంతో ఆ పోస్ట్​పై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆ ట్వీట్​ డిలీట్​ చేయకతప్పలేదు.

Uttarakhand Police Deletes Tweet After Facing Backlash
డకౌట్​ ట్వీట్​తో అభిమానుల ఆగ్రహం.. పోస్ట్​ డిలీట్​
author img

By

Published : Mar 14, 2021, 7:55 AM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ చిత్రాన్ని ఉపయోగించి చేసిన ట్వీట్‌ను ఉత్తరాఖండ్‌ పోలీసులు తొలగించారు. అభిమానుల నుంచి విమర్శలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు చేసిన ట్వీట్‌పై కొందరు నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో విరాట్‌ కోహ్లీ డకౌట్‌ అయ్యాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో విరాట్‌ వికెట్లను వదిలేసి ఆడాడు. ఆదిల్‌ రషీద్‌ వేసిన బంతిన బలంగా బాదబోయాడు. అయితే బ్యాటుకు తగిలిన బంతి నేరుగా లాంగాఫ్‌లో జోర్డాన్‌ వద్దకు వెళ్లింది. అతడు బంతిని సులభంగా ఒడిసిపట్టాడు. శ్రేయస్‌ మినహా మిగతా ఆటగాళ్లు విఫలం కావడం వల్ల టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

  • हेलमेट लगाना ही काफ़ी नहीं है!
    पूरे होशोहवास में गाड़ी चलाना ज़रूरी है,
    वरना कोहली की तरह आप भी ज़ीरो पर आउट हो सकते हैं. #INDvEND #ViratKohli pic.twitter.com/l66KD4NMdG

    — Uttarakhand Police (@uttarakhandcops) March 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్‌ పోలీసులు విరాట్‌ చిత్రాన్ని ఉపయోగించుకున్నారు. 'హెల్మెట్‌ ఒక్కటే సరిపోదు. పూర్తి ధ్యాసతో డ్రైవింగ్‌ చేయడం అత్యంత ఆవశ్యకం. లేకపోతే కోహ్లీ మాదిరిగానే మీరూ డకౌట్‌ అవుతారు' అని హిందీలో పోస్ట్‌ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్‌పై అభిమానులు మండిపడ్డారు. చేసిన ట్వీట్‌ టీమ్‌ఇండియా కెప్టెన్‌ను అవమానించేలా ఉందంటూ కొందరు.. పోస్ట్‌ చేసిన చిత్రానికి, ట్వీట్‌కు సంబంధం లేదని మరికొందరు విమర్శించారు. దీంతో ట్వీట్‌ తొలగించక తప్పలేదు!

ఇదీ చూడండి: కోహ్లీ ఔట్​ను ఉత్తరాఖండ్​ పోలీసులు ఎలా వాడుకున్నారంటే?

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ చిత్రాన్ని ఉపయోగించి చేసిన ట్వీట్‌ను ఉత్తరాఖండ్‌ పోలీసులు తొలగించారు. అభిమానుల నుంచి విమర్శలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు చేసిన ట్వీట్‌పై కొందరు నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో విరాట్‌ కోహ్లీ డకౌట్‌ అయ్యాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో విరాట్‌ వికెట్లను వదిలేసి ఆడాడు. ఆదిల్‌ రషీద్‌ వేసిన బంతిన బలంగా బాదబోయాడు. అయితే బ్యాటుకు తగిలిన బంతి నేరుగా లాంగాఫ్‌లో జోర్డాన్‌ వద్దకు వెళ్లింది. అతడు బంతిని సులభంగా ఒడిసిపట్టాడు. శ్రేయస్‌ మినహా మిగతా ఆటగాళ్లు విఫలం కావడం వల్ల టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

  • हेलमेट लगाना ही काफ़ी नहीं है!
    पूरे होशोहवास में गाड़ी चलाना ज़रूरी है,
    वरना कोहली की तरह आप भी ज़ीरो पर आउट हो सकते हैं. #INDvEND #ViratKohli pic.twitter.com/l66KD4NMdG

    — Uttarakhand Police (@uttarakhandcops) March 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్‌ పోలీసులు విరాట్‌ చిత్రాన్ని ఉపయోగించుకున్నారు. 'హెల్మెట్‌ ఒక్కటే సరిపోదు. పూర్తి ధ్యాసతో డ్రైవింగ్‌ చేయడం అత్యంత ఆవశ్యకం. లేకపోతే కోహ్లీ మాదిరిగానే మీరూ డకౌట్‌ అవుతారు' అని హిందీలో పోస్ట్‌ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్‌పై అభిమానులు మండిపడ్డారు. చేసిన ట్వీట్‌ టీమ్‌ఇండియా కెప్టెన్‌ను అవమానించేలా ఉందంటూ కొందరు.. పోస్ట్‌ చేసిన చిత్రానికి, ట్వీట్‌కు సంబంధం లేదని మరికొందరు విమర్శించారు. దీంతో ట్వీట్‌ తొలగించక తప్పలేదు!

ఇదీ చూడండి: కోహ్లీ ఔట్​ను ఉత్తరాఖండ్​ పోలీసులు ఎలా వాడుకున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.