ETV Bharat / sports

కరోనా సంక్షోభంలోనూ తరగని కోహ్లీ బ్రాండ్ వాల్యూ!

author img

By

Published : Feb 4, 2021, 2:10 PM IST

Updated : Feb 4, 2021, 2:39 PM IST

గతేడాదికి సంబంధించిన అత్యంత విలువైన ప్రముఖుల జాబితాను డఫ్​ అండ్​ ఫెల్ప్స్​ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో రూ.1733 కోట్లతో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్​ హీరోలు అక్షయ్​ కుమార్​, రణ్​వీర్​ సింగ్​ నిలిచారు.

Team india Captain Virat Kohli remains most-valued celebs for 4th year in row: Report
కరోనా సంక్షోభంలోనూ తరగని కోహ్లీ బ్రాండ్ వాల్యూ!

2020 ఏడాదికిగానూ అత్యంత విలువైన ప్రముఖుల జాబితాలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. వరుసగా నాలుగోసారి చోటు దక్కించుకున్నాడు. రూ.1733 కోట్ల బ్రాండ్​ విలువతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్​ హీరోలు అక్షయ్​ కుమార్​, రణ్​వీర్​ సింగ్​ ఉన్నారు.

ప్రముఖుల బ్రాండ్​ వ్యాల్యూయేషన్​ ఆరవ ఎడిషన్​ ప్రకారం.. రూ. 866 కోట్ల బ్రాండ్​ విలువతో (గతేడాదితో పోలిస్తే 13.8 శాతం వృద్ధి) బాలీవుడ్​ సూపర్​స్టార్​ అక్షయ్​ కుమార్​ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో రణ్​వీర్​ సింగ్​ రూ.750 కోట్ల బ్రాండ్​ విలువను సొంతం చేసుకున్నాడు.

ప్రముఖుల బ్రాండ్​ వాల్యూను అంచనా వేసే డఫ్​ అండ్​ ఫెల్ప్స్​ సంస్థ గురువారం ఈ వివరాలను ప్రకటించింది. కరోనా సంక్షోభంలోనూ కోహ్లీ బ్రాండ్​ విలువ అదే విధంగా ఉన్నా.. గతేడాదితో పోలిస్తే ఈ జాబితాలోని టాప్​-20 సెలబ్రిటీలు వారి విలువలో 5 శాతాన్ని కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది.

ఈ జాబితాలోని టాప్​-10 స్థానాల్లో 9 మంది సినీప్రముఖులు ఉండగా.. ఒక్క స్థానంలో క్రికెటర్​ కోహ్లీ ఉండటం విశేషం. ఆ తొమ్మిది మంది సినీ సెలబ్రిటీల్లో ఇద్దరు నటీమణులు ఉన్నారు.

ఆ తర్వాత నాలుగో స్థానంలో బాలీవుడ్​ బాద్షా.. రూ.372.5 కోట్ల బ్రాండ్​ వాల్యూతో ఉన్నాడు.

ర్యాంకింగ్​ సెలబ్రిటీ బ్రాండ్​ వాల్యూ
1)విరాట్​ కోహ్లీ రూ. 1733 కోట్లు
2) అక్షయ్​ కుమార్​రూ. 866 కోట్లు
3) రణ్​వీర్​ సింగ్​ రూ. 750 కోట్లు
4) షారుక్​ ఖాన్​ రూ. 372.5 కోట్లు
5) దీపికా పదుకొణె

రూ. 367.5 కోట్లు

(2019లో మూడోస్థానం)

6) అలియా భట్​

రూ. 350 కోట్లు

(2019లో ఏడోస్థానం)

ఆయుష్మాన్​ ఖురానా

రూ. 350 కోట్లు

(2019లో జాబితాతో

పోలిస్తే నాలుగు స్థానాలు

మెరుగయ్యారు)

8) సల్మాన్​ ఖాన్​ రూ. 328 కోట్లు
9) అమితాబ్​ బచ్చన్​ రూ. 322.3 కోట్లు
10)హృతిక్​ రోషన్​ రూ. 287.3 కోట్లు

ఇదీ చూడండి: భారత్​తో తొలి రెండు టెస్టులకు క్రావ్లీ దూరం

2020 ఏడాదికిగానూ అత్యంత విలువైన ప్రముఖుల జాబితాలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. వరుసగా నాలుగోసారి చోటు దక్కించుకున్నాడు. రూ.1733 కోట్ల బ్రాండ్​ విలువతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్​ హీరోలు అక్షయ్​ కుమార్​, రణ్​వీర్​ సింగ్​ ఉన్నారు.

ప్రముఖుల బ్రాండ్​ వ్యాల్యూయేషన్​ ఆరవ ఎడిషన్​ ప్రకారం.. రూ. 866 కోట్ల బ్రాండ్​ విలువతో (గతేడాదితో పోలిస్తే 13.8 శాతం వృద్ధి) బాలీవుడ్​ సూపర్​స్టార్​ అక్షయ్​ కుమార్​ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో రణ్​వీర్​ సింగ్​ రూ.750 కోట్ల బ్రాండ్​ విలువను సొంతం చేసుకున్నాడు.

ప్రముఖుల బ్రాండ్​ వాల్యూను అంచనా వేసే డఫ్​ అండ్​ ఫెల్ప్స్​ సంస్థ గురువారం ఈ వివరాలను ప్రకటించింది. కరోనా సంక్షోభంలోనూ కోహ్లీ బ్రాండ్​ విలువ అదే విధంగా ఉన్నా.. గతేడాదితో పోలిస్తే ఈ జాబితాలోని టాప్​-20 సెలబ్రిటీలు వారి విలువలో 5 శాతాన్ని కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది.

ఈ జాబితాలోని టాప్​-10 స్థానాల్లో 9 మంది సినీప్రముఖులు ఉండగా.. ఒక్క స్థానంలో క్రికెటర్​ కోహ్లీ ఉండటం విశేషం. ఆ తొమ్మిది మంది సినీ సెలబ్రిటీల్లో ఇద్దరు నటీమణులు ఉన్నారు.

ఆ తర్వాత నాలుగో స్థానంలో బాలీవుడ్​ బాద్షా.. రూ.372.5 కోట్ల బ్రాండ్​ వాల్యూతో ఉన్నాడు.

ర్యాంకింగ్​ సెలబ్రిటీ బ్రాండ్​ వాల్యూ
1)విరాట్​ కోహ్లీ రూ. 1733 కోట్లు
2) అక్షయ్​ కుమార్​రూ. 866 కోట్లు
3) రణ్​వీర్​ సింగ్​ రూ. 750 కోట్లు
4) షారుక్​ ఖాన్​ రూ. 372.5 కోట్లు
5) దీపికా పదుకొణె

రూ. 367.5 కోట్లు

(2019లో మూడోస్థానం)

6) అలియా భట్​

రూ. 350 కోట్లు

(2019లో ఏడోస్థానం)

ఆయుష్మాన్​ ఖురానా

రూ. 350 కోట్లు

(2019లో జాబితాతో

పోలిస్తే నాలుగు స్థానాలు

మెరుగయ్యారు)

8) సల్మాన్​ ఖాన్​ రూ. 328 కోట్లు
9) అమితాబ్​ బచ్చన్​ రూ. 322.3 కోట్లు
10)హృతిక్​ రోషన్​ రూ. 287.3 కోట్లు

ఇదీ చూడండి: భారత్​తో తొలి రెండు టెస్టులకు క్రావ్లీ దూరం

Last Updated : Feb 4, 2021, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.