ETV Bharat / sports

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ కష్టమే: సీఏ ఛైర్మన్

author img

By

Published : Jun 16, 2020, 11:25 AM IST

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ నిర్వహణ అసాధ్యంగా అనిపిస్తోందని క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్​ ఎర్ల్​ ఎడ్డింగ్స్​ తెలిపారు. ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాప్తి పరిస్థితుల నడుమ.. టోర్నీ జరిగే అవకాశం తక్కువగా ఉన్నట్లు స్పష్టం చేశారు .

T20 World Cup This Year "Unrealistic": Cricket Australia Chairman
'ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ అసాధ్యమే'

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్​ను నిర్వహించడం దాదాపు అసాధ్యమని క్రికెట్ ఆస్ట్రేలియా​ ఛైర్మన్​ ఎర్ల్​ ఎడ్డింగ్స్ అభిప్రాయపడ్డారు. అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే, వైరస్​ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సరిహద్దులను మూసేయడం వల్ల.. టోర్నీ జరిగే అవకాశాలపై సందిగ్ధత నెలకొన్నట్లు ఎడ్డింగ్స్​ తెలిపారు.

"ఈ ఏడాది టోర్నీని ఇంకా అధికారికంగా రద్దు కానీ, వాయిదా కానీ వేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గని సమయంలో 16 దేశాలకు చెందిన జట్లు ఆస్ట్రేలియాకు రావడం అసాధ్యమైన పని. ఇప్పటికే ఐసీసీ ముందు దీనికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ఉంచాం. పరిస్థితులను బట్టి ఓ నిర్ణయానికి వస్తాం.

-ఎర్ల్​ ఎడ్డింగ్స్​, క్రికెట్ ఆస్ట్రేలియా​ ఛైర్మన్​

క్రికెట్ ఆస్ట్రేలియా​ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నిక్​ హోక్లే మాట్లాడుతూ.. వచ్చే నెలలో టోర్నమెంట్​ నిర్వహణపై ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్​ను నిర్వహించడం దాదాపు అసాధ్యమని క్రికెట్ ఆస్ట్రేలియా​ ఛైర్మన్​ ఎర్ల్​ ఎడ్డింగ్స్ అభిప్రాయపడ్డారు. అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే, వైరస్​ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సరిహద్దులను మూసేయడం వల్ల.. టోర్నీ జరిగే అవకాశాలపై సందిగ్ధత నెలకొన్నట్లు ఎడ్డింగ్స్​ తెలిపారు.

"ఈ ఏడాది టోర్నీని ఇంకా అధికారికంగా రద్దు కానీ, వాయిదా కానీ వేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గని సమయంలో 16 దేశాలకు చెందిన జట్లు ఆస్ట్రేలియాకు రావడం అసాధ్యమైన పని. ఇప్పటికే ఐసీసీ ముందు దీనికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ఉంచాం. పరిస్థితులను బట్టి ఓ నిర్ణయానికి వస్తాం.

-ఎర్ల్​ ఎడ్డింగ్స్​, క్రికెట్ ఆస్ట్రేలియా​ ఛైర్మన్​

క్రికెట్ ఆస్ట్రేలియా​ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నిక్​ హోక్లే మాట్లాడుతూ.. వచ్చే నెలలో టోర్నమెంట్​ నిర్వహణపై ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.