ETV Bharat / sports

నా స్థానంలో ధోనీ బరిలోకి దిగాలి: రైనా - రైనా ధోనీ వార్తలు

ఈసారి ఐపీఎల్​కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా. దీంతో అతడి మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై తాజాగా రైనా స్పందించాడు.

నా స్థానంలో ధోనీ బరిలోకి దిగాలి: రైనా
నా స్థానంలో ధోనీ బరిలోకి దిగాలి: రైనా
author img

By

Published : Sep 5, 2020, 7:06 PM IST

వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్​రౌండర్ సురేశ్ రైనా. దీంతో ఈ సారి ఆ జట్టుకు మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై రైనానే స్పందించాడు. ఆ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ ఆడితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

"మూడో స్థానం చాలా ముఖ్యమైంది. ఈ స్థానంలో ధోనీ బ్యాటింగ్ చేస్తే సమతుల్యం లభిస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు రైనా.

ఇదే అభిప్రాయాన్ని చాలా మంది వెల్లడించారు. మాజీలు, ప్రముఖ ఆటగాళ్లు, అభిమానులు అందరూ ధోనీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తే చూడాలని ఆశిస్తున్నారు.

సెప్టెంబర్ 19న మెగా లీగ్ ప్రారంభంకానుంది. దుబాయి వేదికగా జరిగే ఈ టోర్నీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్​రౌండర్ సురేశ్ రైనా. దీంతో ఈ సారి ఆ జట్టుకు మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై రైనానే స్పందించాడు. ఆ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ ఆడితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

"మూడో స్థానం చాలా ముఖ్యమైంది. ఈ స్థానంలో ధోనీ బ్యాటింగ్ చేస్తే సమతుల్యం లభిస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు రైనా.

ఇదే అభిప్రాయాన్ని చాలా మంది వెల్లడించారు. మాజీలు, ప్రముఖ ఆటగాళ్లు, అభిమానులు అందరూ ధోనీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తే చూడాలని ఆశిస్తున్నారు.

సెప్టెంబర్ 19న మెగా లీగ్ ప్రారంభంకానుంది. దుబాయి వేదికగా జరిగే ఈ టోర్నీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.