ETV Bharat / sports

పాక్ ఆటగాళ్ల జెర్సీలపై అఫ్రిదీ ఫౌండేషన్​ లోగో

author img

By

Published : Jul 9, 2020, 4:37 PM IST

Updated : Jul 9, 2020, 5:00 PM IST

పాకిస్థాన్​ క్రికెట్​ జట్టుకు స్పాన్సర్​ కష్టాలు ఎదురయ్యాయి. గతంలో జట్టు పోషకునిగా వ్యవహరించిన ఓ పానీయ సంస్థతో ఒప్పందం ఇటీవలే ముగిసింది. ఆ తర్వాత పాక్​ జట్టుకు కొత్త స్పాన్సర్​ ఎవరూ దొరకలేదు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్​ షాహిద్​ అఫ్రిదీకి చెందిన ఫౌండేషన్​ లోగోను ఆటగాళ్ల జెర్సీలపై ప్రదర్శించాలని నిర్ణయించింది పీసీబీ.

Struggling to find sponsors, Pakistan players to sport Shahid Afridi Foundation logo on their jerseys
పాక్ ఆటగాళ్ల జెర్సీలపై అఫ్రిదీ ఫౌండేషన్​ లోగో

ఇంగ్లాండ్​ పర్యటన కోసం జట్టుకు స్పాన్సర్లను వెతకడంలో విఫలమైంది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు. దీంతో ఈ సిరీస్​లో మాజీ కెప్టెన్​​ షాహిద్​ అఫ్రిదీకి చెందిన ఫౌండేషన్​ లోగోను పాక్​ ఆటగాళ్ల కిట్లపై ప్రదర్శించాలని పీసీబీ నిర్ణయించింది. దీనిపై ట్విట్టర్​లో ఆనందాన్ని వ్యక్తం చేశాడు అఫ్రిది.

"ఇంగ్లాండ్​ పర్యటనలో పాకిస్థాన్​ ఆటగాళ్లు వారి కిట్లపై 'షాహిద్​ అఫ్రిదీ ఫౌండేషన్​' లోగోను ప్రదర్శించాలనుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే పీసీబీకి మా ఛారిటీ భాగస్వామిగా ఉంది. వసీమ్​ ఖాన్​, పీసీబీ మద్దతుకు ధన్యవాదాలు. ఆల్​దిబెస్ట్​ పాక్​ క్రికెట్​ టీమ్​".

- షాహిద్​ అఫ్రిదీ, పాకిస్థాన్​ మాజీ కెప్టెన్

కరోనా కారణంగా ఆర్థిక భారాన్ని మోస్తున్న పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) ఇంగ్లాండ్​తో జరిగే సిరీస్​ కోసం స్పాన్సర్​ను వెతకడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పాక్​ జట్టు​ లోగో స్పాన్సర్​షిప్​ ఒప్పందంపై సంతకం చేయడానికి ఓ పానీయ సంస్థతో చర్చలు కొనసాగుతున్నాయి. సదరు సంస్థ అంచనాల కంటే చాలా తక్కువ మొత్తానికి అంటే గతంలో చెల్లించిన మొత్తంలో 35 శాతం నుంచి 40 శాతమే టెండర్​ వేసినట్లు ఓ పీసీబీ అధికారి వెల్లడించాడు.​

ఇంగ్లాండ్​ పర్యటన కోసం జట్టుకు స్పాన్సర్లను వెతకడంలో విఫలమైంది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు. దీంతో ఈ సిరీస్​లో మాజీ కెప్టెన్​​ షాహిద్​ అఫ్రిదీకి చెందిన ఫౌండేషన్​ లోగోను పాక్​ ఆటగాళ్ల కిట్లపై ప్రదర్శించాలని పీసీబీ నిర్ణయించింది. దీనిపై ట్విట్టర్​లో ఆనందాన్ని వ్యక్తం చేశాడు అఫ్రిది.

"ఇంగ్లాండ్​ పర్యటనలో పాకిస్థాన్​ ఆటగాళ్లు వారి కిట్లపై 'షాహిద్​ అఫ్రిదీ ఫౌండేషన్​' లోగోను ప్రదర్శించాలనుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే పీసీబీకి మా ఛారిటీ భాగస్వామిగా ఉంది. వసీమ్​ ఖాన్​, పీసీబీ మద్దతుకు ధన్యవాదాలు. ఆల్​దిబెస్ట్​ పాక్​ క్రికెట్​ టీమ్​".

- షాహిద్​ అఫ్రిదీ, పాకిస్థాన్​ మాజీ కెప్టెన్

కరోనా కారణంగా ఆర్థిక భారాన్ని మోస్తున్న పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) ఇంగ్లాండ్​తో జరిగే సిరీస్​ కోసం స్పాన్సర్​ను వెతకడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పాక్​ జట్టు​ లోగో స్పాన్సర్​షిప్​ ఒప్పందంపై సంతకం చేయడానికి ఓ పానీయ సంస్థతో చర్చలు కొనసాగుతున్నాయి. సదరు సంస్థ అంచనాల కంటే చాలా తక్కువ మొత్తానికి అంటే గతంలో చెల్లించిన మొత్తంలో 35 శాతం నుంచి 40 శాతమే టెండర్​ వేసినట్లు ఓ పీసీబీ అధికారి వెల్లడించాడు.​

Last Updated : Jul 9, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.