ETV Bharat / sports

ఇది కాదు ఆ సెంచరీనే ఇప్పటికీ ఉత్తమం: రహానె

author img

By

Published : Dec 28, 2020, 5:32 PM IST

లార్డ్స్​లో తాను చేసిన సెంచరీనే ఉత్తమమైనదని భారత ఆటగాడు రహానె చెప్పాడు. ప్రస్తుతం ఆసీస్​తో టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియాకు తాత్కాలిక కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

Still feel the hundred at Lord's is my best, says Rahane after MCG masterclass
'లార్డ్స్​ సెంచరీ నాకు ఇప్పటికీ ఉత్తమం!'

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​ అజింక్య రహానె అదరగొట్టాడు. మిగిలిన బ్యాట్స్​మెన్​ తడబడుతున్నా తాను మాత్రం దృఢంగా నిలబడి సెంచరీ చేశాడు. దీంతో భారత పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఈ శతకం కంటే ఇంగ్లాండ్​పై లార్డ్స్​ చేసిన సెంచరీనే తనకు ఎప్పటికీ ఉత్తమమని అన్నాడు.

"సెంచరీ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇంగ్లాండ్​పై లార్డ్స్​లో చేసిన శతకం నా కెరీర్​లో ది బెస్ట్. ఆసీస్​తో బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజూ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్సీ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడానికే. ఇందులో క్రెడిట్​ అంతా బౌలర్లదే.. వారు సరైన ప్రదేశాల్లో బౌలింగ్​ చేశారు. అయితే ఈ మ్యాచ్​ ఇంకా పూర్తి కాలేదు. మేం ఇంకా నాలుగు వికెట్లు తీయాల్సి ఉంది"

- అజింక్య రహానె, టీమ్​ఇండియా టెస్టు తాత్కాలిక కెప్టెన్​

2014లో ఇంగ్లాండ్​ పర్యటనలో లార్డ్స్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో రహానె 154 బంతుల్లో 103 పరుగులు చేశాడు.

అడిలైడ్​ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ నాయకత్వంలోని టీమ్ఇండియా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత పితృత్వ సెలవులపై కోహ్లీ స్వదేశానికి వెళ్లగా, అతడి స్థానంలో రహానె కెప్టెన్సీ చేస్తున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఫీల్డింగ్​ సెట్​ చేయడం సహా బౌలర్లలను సరైన సమయంలో ఉపయోగించుకుంటున్నాడని మాజీల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇదీ చూడండి: ఐసీసీ అవార్డులు: కోహ్లీకి రెండు.. ధోనీకి ఒకటి

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​ అజింక్య రహానె అదరగొట్టాడు. మిగిలిన బ్యాట్స్​మెన్​ తడబడుతున్నా తాను మాత్రం దృఢంగా నిలబడి సెంచరీ చేశాడు. దీంతో భారత పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఈ శతకం కంటే ఇంగ్లాండ్​పై లార్డ్స్​ చేసిన సెంచరీనే తనకు ఎప్పటికీ ఉత్తమమని అన్నాడు.

"సెంచరీ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇంగ్లాండ్​పై లార్డ్స్​లో చేసిన శతకం నా కెరీర్​లో ది బెస్ట్. ఆసీస్​తో బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజూ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్సీ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడానికే. ఇందులో క్రెడిట్​ అంతా బౌలర్లదే.. వారు సరైన ప్రదేశాల్లో బౌలింగ్​ చేశారు. అయితే ఈ మ్యాచ్​ ఇంకా పూర్తి కాలేదు. మేం ఇంకా నాలుగు వికెట్లు తీయాల్సి ఉంది"

- అజింక్య రహానె, టీమ్​ఇండియా టెస్టు తాత్కాలిక కెప్టెన్​

2014లో ఇంగ్లాండ్​ పర్యటనలో లార్డ్స్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో రహానె 154 బంతుల్లో 103 పరుగులు చేశాడు.

అడిలైడ్​ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ నాయకత్వంలోని టీమ్ఇండియా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత పితృత్వ సెలవులపై కోహ్లీ స్వదేశానికి వెళ్లగా, అతడి స్థానంలో రహానె కెప్టెన్సీ చేస్తున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఫీల్డింగ్​ సెట్​ చేయడం సహా బౌలర్లలను సరైన సమయంలో ఉపయోగించుకుంటున్నాడని మాజీల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇదీ చూడండి: ఐసీసీ అవార్డులు: కోహ్లీకి రెండు.. ధోనీకి ఒకటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.