ETV Bharat / sports

'డీఆర్​ఎస్​తో ఆటగాళ్లకు న్యాయం జరగట్లేదు'

author img

By

Published : Dec 28, 2020, 1:17 PM IST

ఐసీసీ చొరవ తీసుకుని డీఆర్ఎస్​ నిబంధనల్లో సవరణలు చేయాలని అభిప్రాయపడ్డాడు భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందూల్కర్​. అంపైర్​ కాల్​ నిర్ణయంతో ఆటగాళ్లకు న్యాయం జరగట్లేదని తెలిపాడు.

sachin
సచిన్​

అంతర్జాతీయ క్రికెట్​లో డిసిషన్ రివ్యూ సిస్టమ్‌(డీఆర్​ఎస్​)ను ఉపయోగించే సమయంలో 'అంపైర్ కాల్' నిబంధనను క్షుణ్ణంగా పరిశీలించాలని ఐసీసీని కోరాడు భారత దిగ్గజం సచిన్​ తెందూల్కర్. దీనికి సంబంధించిన నిబంధనల్లో కొన్ని సవరణలు చేయాల్సిందిగా అభిప్రాయపడ్డాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో అసంతృప్తి చెందిన తర్వాత సమీక్షలు తీసుకునే ఆటగాళ్లకు అంపైర్ కాల్ నియమం న్యాయం చేయట్లేదని ట్వీట్​ చేశాడు. భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​లో అంపైర్​ కాల్​ నిర్ణయాలు ఆసీస్​ జట్టుకు అనుకూలంగా ఉంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు మాస్టర్.

రెండో టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​లో మూడో ఓవరు మొదటి బంతికే ఆసీస్ ఓపెనర్ బర్న్స్‌ ఎల్బీడబ్ల్యూ కోసం టీమ్​ఇండియా అప్పీలు చేయగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రీప్లేలో బంతి వికెట్ల అంచునకు తాకినట్టు కనిపించినా.. అంపైర్ కాల్ నిబంధన కింద నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. దీంతోపాటు ఇలాంటిదే మరో సంఘటన కూడా జరిగింది. కాగా, ఇప్పటికే రెండో టెస్టులో అంపైర్ కాల్​పై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్. దీనికి సంబంధించిన నిబంధనలు మార్చాలని ఐసీసీని కోరాడు.

  • The reason players opt for a review is because they’re unhappy with the decision taken by the on-field umpire.
    The DRS system needs to be thoroughly looked into by the @ICC, especially for the ‘Umpires Call’.#AUSvIND

    — Sachin Tendulkar (@sachin_rt) December 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'కోహ్లీ, రహానె దారులు వేరైనా.. లక్ష్యం ఒక్కటే'

అంతర్జాతీయ క్రికెట్​లో డిసిషన్ రివ్యూ సిస్టమ్‌(డీఆర్​ఎస్​)ను ఉపయోగించే సమయంలో 'అంపైర్ కాల్' నిబంధనను క్షుణ్ణంగా పరిశీలించాలని ఐసీసీని కోరాడు భారత దిగ్గజం సచిన్​ తెందూల్కర్. దీనికి సంబంధించిన నిబంధనల్లో కొన్ని సవరణలు చేయాల్సిందిగా అభిప్రాయపడ్డాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో అసంతృప్తి చెందిన తర్వాత సమీక్షలు తీసుకునే ఆటగాళ్లకు అంపైర్ కాల్ నియమం న్యాయం చేయట్లేదని ట్వీట్​ చేశాడు. భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​లో అంపైర్​ కాల్​ నిర్ణయాలు ఆసీస్​ జట్టుకు అనుకూలంగా ఉంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు మాస్టర్.

రెండో టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​లో మూడో ఓవరు మొదటి బంతికే ఆసీస్ ఓపెనర్ బర్న్స్‌ ఎల్బీడబ్ల్యూ కోసం టీమ్​ఇండియా అప్పీలు చేయగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రీప్లేలో బంతి వికెట్ల అంచునకు తాకినట్టు కనిపించినా.. అంపైర్ కాల్ నిబంధన కింద నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. దీంతోపాటు ఇలాంటిదే మరో సంఘటన కూడా జరిగింది. కాగా, ఇప్పటికే రెండో టెస్టులో అంపైర్ కాల్​పై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్. దీనికి సంబంధించిన నిబంధనలు మార్చాలని ఐసీసీని కోరాడు.

  • The reason players opt for a review is because they’re unhappy with the decision taken by the on-field umpire.
    The DRS system needs to be thoroughly looked into by the @ICC, especially for the ‘Umpires Call’.#AUSvIND

    — Sachin Tendulkar (@sachin_rt) December 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'కోహ్లీ, రహానె దారులు వేరైనా.. లక్ష్యం ఒక్కటే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.