ETV Bharat / sports

దక్షిణాఫ్రికాలో స్టీవ్​స్మిత్​కు మళ్లీ సాండ్​పేపర్​ గోల

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్​ స్మిత్​ తీరు మరోసారి వివాదాస్పదమైంది. దక్షిణాఫ్రికాలో బాల్​ టాంపరింగ్​ వివాదం తర్వాత మళ్లీ అదే దేశ పర్యటనకు వెళ్లిన అతడికి అభిమానుల నుంచి చుక్కెదురైంది. బ్యాటింగ్​లో తనదైన స్ఫూర్తి ప్రదర్శించలేదని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

author img

By

Published : Feb 22, 2020, 7:43 PM IST

Updated : Mar 2, 2020, 5:17 AM IST

Steve Smith hits boundary of Dale Steyn's dead delivery
స్టీవ్​స్మిత్​కు మళ్లీ సాండ్​పేపర్​ గోల.. ఎందుకో తెలుసా?

దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్​ కోసం ఆ దేశంలో అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. సఫారీ జట్టుతో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్​లో ఆసీస్..​ 107 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్​లో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించని స్మిత్​.. మళ్లీ విమర్శలపాలయ్యాడు.

ఏమైందంటే?

జోహెన్స్​బర్గ్​లో జరిగిన ఈ మ్యాచ్​లో సఫారీ బౌలర్​ స్టెయిన్​ వేసిన మూడో ఓవర్​లో ఓ సంఘటన జరిగింది. స్టెయిన్​ బౌలింగ్​ వేసే క్రమంలో చేతిలో నుంచి జారిన బంతి డెడ్​ బాల్ రూపంలో బ్యాట్స్​మన్​ వద్దకు వెళ్లింది. ఆ బంతిని కొట్టకుండా అడ్డుకోవాల్సిన స్మిత్​.. ఫ్రంట్​ఫుట్​కు వచ్చి బౌండరీ తరలించాడు. అంపైర్​ డెడ్​ బాల్​గా ప్రకటించినా స్మిత్​ పట్టించుకోలేదని, కనీసం క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదని స్మిత్​పై అసహనం వ్యక్తం చేశారు ఆతిథ్య జట్టు అభిమానులు. కొందరూ 'సాండ్​పేపర్​ ఫర్​ సేల్'​ అంటూ తను గతంలో చేసిన బాల్​ ట్యాంపరింగ్​ను గుర్తు చేస్తూ పోస్టుర్లు ప్రదర్శించారు.

తలదించుకున్న గడ్డపైనే

2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన స్మిత్​... బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అనంతరం ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. అప్పట్నుంచి తనదైన ఫామ్​తో రాణిస్తున్నాడు. ఇప్పుడు జరిగిన తొలి టీ20లో తన జట్టును గెలిపించాడు. 45 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 89 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్.. 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూ​ బౌలర్ అగర్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ నాలుగో బంతికి డుప్లెసిస్‌ను ఔట్‌ చేసిన అగర్‌.. ఆ తర్వాత వరుస బంతుల్లో ఫెలుక్వాయో, స్టెయిన్‌లను పెవిలియన్ చేర్చాడు.

దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్​ కోసం ఆ దేశంలో అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. సఫారీ జట్టుతో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్​లో ఆసీస్..​ 107 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్​లో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించని స్మిత్​.. మళ్లీ విమర్శలపాలయ్యాడు.

ఏమైందంటే?

జోహెన్స్​బర్గ్​లో జరిగిన ఈ మ్యాచ్​లో సఫారీ బౌలర్​ స్టెయిన్​ వేసిన మూడో ఓవర్​లో ఓ సంఘటన జరిగింది. స్టెయిన్​ బౌలింగ్​ వేసే క్రమంలో చేతిలో నుంచి జారిన బంతి డెడ్​ బాల్ రూపంలో బ్యాట్స్​మన్​ వద్దకు వెళ్లింది. ఆ బంతిని కొట్టకుండా అడ్డుకోవాల్సిన స్మిత్​.. ఫ్రంట్​ఫుట్​కు వచ్చి బౌండరీ తరలించాడు. అంపైర్​ డెడ్​ బాల్​గా ప్రకటించినా స్మిత్​ పట్టించుకోలేదని, కనీసం క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదని స్మిత్​పై అసహనం వ్యక్తం చేశారు ఆతిథ్య జట్టు అభిమానులు. కొందరూ 'సాండ్​పేపర్​ ఫర్​ సేల్'​ అంటూ తను గతంలో చేసిన బాల్​ ట్యాంపరింగ్​ను గుర్తు చేస్తూ పోస్టుర్లు ప్రదర్శించారు.

తలదించుకున్న గడ్డపైనే

2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన స్మిత్​... బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అనంతరం ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. అప్పట్నుంచి తనదైన ఫామ్​తో రాణిస్తున్నాడు. ఇప్పుడు జరిగిన తొలి టీ20లో తన జట్టును గెలిపించాడు. 45 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 89 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్.. 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూ​ బౌలర్ అగర్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ నాలుగో బంతికి డుప్లెసిస్‌ను ఔట్‌ చేసిన అగర్‌.. ఆ తర్వాత వరుస బంతుల్లో ఫెలుక్వాయో, స్టెయిన్‌లను పెవిలియన్ చేర్చాడు.

Last Updated : Mar 2, 2020, 5:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.