టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. 2007లో సెప్టెంబరు 24న జరిగిన టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో తలపడిన మ్యాచ్ను గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఇన్నింగ్ ఎంతో ప్రత్యేకమైందని కొనియాడాడు.
"ఈ మ్యాచ్లో గౌతమ్ గంభీర్.. 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి రోహిత్ శర్మ. అద్భుతంగా ఆడాడు. కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టు స్కోరును 150కు చేర్చాడు. రెండు బౌండరీలు, ఓ సిక్స్ బాదాడు. కానీ అతడి ప్రతిభను మేమెవ్వరం గుర్తించలేదు."
-యువీ, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఈ మ్యాచ్లో పాక్పై భారత్ ఐదు పరుగులు తేడాతో విజయం సాధించింది.
ఇది చూడండి జులై 30 నుంచి వన్డే ప్రపంచకప్ సూపర్లీగ్ ప్రారంభం