ETV Bharat / sports

ఆ షాట్లను మిస్ అవుతున్నా: రోహిత్ - రోహిత్​ శర్మ బెస్ట్​ సిక్సర్లు

తన కెరీర్​లో తనకు ఇష్టమైన సిక్సర్లను ఇన్​స్టాగ్రామ్​లో తాజాగా పంచుకున్నాడు టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​శర్మ. అలాంటి షాట్లను ప్రస్తుతం మిస్​ అవుతున్నట్లు వెల్లడించాడు​.

Rohit Sharma shares compilation video of his six-hitting prowess
ఆ షాట్లను మిస్​ అవుతున్నా: రోహిత్​ శర్మ
author img

By

Published : Jun 11, 2020, 5:31 PM IST

టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.. తన కెరీర్​లో కొట్టిన అత్యుత్తమ సిక్సర్లను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా గుర్తుచేసుకున్నాడు. మెరుపు షాట్లతో బంతి కొన్నిసార్లు స్డేడియం ఆవలివైపుకు వెళ్లింది. ఈ వీడియోను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. "అలాంటి షాట్​లను మిస్​ అవుతున్నా" అనే క్యాప్షన్​తో పోస్ట్​ చేశాడు హిట్​మ్యాన్.

ప్రకృతిపై ప్రేమ

లాక్​డౌన్​ కారణంగా లభించిన విరామ సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు రోహిత్​. గతవారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుకోవాలని.. సోమవారం ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్రనీటిని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చాడు రోహిత్​ శర్మ.

కరోనా కారణంగా మార్చి నుంచే క్రీడా టోర్నీలన్ని వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఐపీఎల్​-13 సీజన్​ను నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. అయితే టోర్నీని ఈ ఏడాదిలో కచ్చితంగా నిర్వహిస్తామని తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు.

ఇదీ చూడండి... నా కెరీర్​లో ఆ మ్యాచ్​లు ప్రత్యేకం: భజ్జీ

టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.. తన కెరీర్​లో కొట్టిన అత్యుత్తమ సిక్సర్లను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా గుర్తుచేసుకున్నాడు. మెరుపు షాట్లతో బంతి కొన్నిసార్లు స్డేడియం ఆవలివైపుకు వెళ్లింది. ఈ వీడియోను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. "అలాంటి షాట్​లను మిస్​ అవుతున్నా" అనే క్యాప్షన్​తో పోస్ట్​ చేశాడు హిట్​మ్యాన్.

ప్రకృతిపై ప్రేమ

లాక్​డౌన్​ కారణంగా లభించిన విరామ సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు రోహిత్​. గతవారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుకోవాలని.. సోమవారం ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్రనీటిని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చాడు రోహిత్​ శర్మ.

కరోనా కారణంగా మార్చి నుంచే క్రీడా టోర్నీలన్ని వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఐపీఎల్​-13 సీజన్​ను నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. అయితే టోర్నీని ఈ ఏడాదిలో కచ్చితంగా నిర్వహిస్తామని తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు.

ఇదీ చూడండి... నా కెరీర్​లో ఆ మ్యాచ్​లు ప్రత్యేకం: భజ్జీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.