ETV Bharat / sports

వన్డే సిరీస్​లో కివీస్ బోణీ​.. కోహ్లీసేన ఓటమి

author img

By

Published : Feb 5, 2020, 3:48 PM IST

Updated : Feb 29, 2020, 6:54 AM IST

టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించి, మూడు వన్డేల సిరీస్​లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. రాస్​ టేలర్(109*).. కివీస్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్
మ్యాచ్

హామిల్టన్ వేదికగా జరిగిన భారత్​తో జరిగిన తొలి వన్డేలో కివీస్ ఘనవిజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్​లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (103) సెంచరీతో రాణించాడు. రాహుల్ (88*), విరాట్ కోహ్లీ (51) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్​ దూకుడుగా ఆటను ప్రారంభించింది.

ఓపెనర్ నికోలస్ (78) అర్ధశతకం చేశాడు. గప్తిల్ (32), నికోలస్ ఔటైన తర్వాత టేలర్, లాథమ్​ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ షాట్ ఆడబోయి లాథమ్ (69) పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో టేలర్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ చివర్లో నీషమ్ (9), గ్రాండ్​హోమ్ (1) వికెట్లు పడటంతో కాస్త ఉత్కంఠరేగింది. కానీ టేలర్ (109*), సాంట్నర్ (12*) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఫలితంగా కివీస్ 48.1 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ జోరు

హామిల్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న తొలి వన్డేలో భారత జట్టు పరుగుల వరద పారించింది. బ్యాట్స్​మన్​ శ్రేయస్​ అయ్యర్​ శతకంతో రాణించాడు. కెప్టెన్ విరాట్​ కోహ్లీ, కేఎల్​ రాహుల్​ అర్ధశతకాలు చేశారు. టీ20ల్లో అదరగొట్టిన అయ్యర్​.. అదే ఊపును వన్డేల్లోనూ కొనసాగించాడు. 107 బంతుల్లో 103 పరుగుల చేసి.. కెరీర్​లో తొలిసారి వన్డే శతకం నమోదు చేసుకున్నాడు. మొత్తం ఇన్నింగ్స్​లో 11 ఫోర్లు, 1 సిక్సర్​ బాదాడు. అయితే సెంచరీ తర్వాత జోరు పెంచే క్రమంలో సౌథీ బౌలింగ్​లో సాంట్నర్​కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు.

కోహ్లీ, రాహుల్​ అర్ధశతకాలు

టాస్​ ఓడిన భారత బ్యాటింగ్​లో ఓపెనర్లు మయాంక్​ అగర్వాల్​ 32(31 బంతుల్లో; 6 ఫోర్లు), పృథ్వీ షా 20(21 బంతుల్లో; 3 ఫోర్లు) శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధాటిగా ఆడిన వీరిద్దరూ 4 పరుగుల వ్యవధిలోనే ఔటయ్యారు. గ్రాండ్​హోమ్​ బౌలింగ్​లో పృథ్వీ ఔటవ్వగా... మయాంక్​ సౌథీ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి కోహ్లీ, శ్రేయస్​ ఇన్నింగ్స్​ను నడిపించారు. విరాట్​ కెరీర్​లో మరో అర్ధశతకం ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్​ చేరాడు.

సూపర్​ ఫామ్​లో ఉన్న కేఎల్​ రాహుల్​(88) మరోసారి సూపర్​ ఇన్నింగ్స్​ ఆడాడు. 64 బంతుల్లో 88 రన్స్​ చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఆఖర్లో కేదార్​ జాదవ్​(26*) నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారత జట్టు 347 రన్స్​ చేసింది. న్యూజిలాండ్​ బౌలర్లలో టిమ్​ సౌథీ 2 వికెట్లు, గ్రాండ్​హోమ్​, సోధీ తలో వికెట్​ సాధించారు.

హామిల్టన్ వేదికగా జరిగిన భారత్​తో జరిగిన తొలి వన్డేలో కివీస్ ఘనవిజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్​లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (103) సెంచరీతో రాణించాడు. రాహుల్ (88*), విరాట్ కోహ్లీ (51) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్​ దూకుడుగా ఆటను ప్రారంభించింది.

ఓపెనర్ నికోలస్ (78) అర్ధశతకం చేశాడు. గప్తిల్ (32), నికోలస్ ఔటైన తర్వాత టేలర్, లాథమ్​ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ షాట్ ఆడబోయి లాథమ్ (69) పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో టేలర్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ చివర్లో నీషమ్ (9), గ్రాండ్​హోమ్ (1) వికెట్లు పడటంతో కాస్త ఉత్కంఠరేగింది. కానీ టేలర్ (109*), సాంట్నర్ (12*) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఫలితంగా కివీస్ 48.1 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ జోరు

హామిల్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న తొలి వన్డేలో భారత జట్టు పరుగుల వరద పారించింది. బ్యాట్స్​మన్​ శ్రేయస్​ అయ్యర్​ శతకంతో రాణించాడు. కెప్టెన్ విరాట్​ కోహ్లీ, కేఎల్​ రాహుల్​ అర్ధశతకాలు చేశారు. టీ20ల్లో అదరగొట్టిన అయ్యర్​.. అదే ఊపును వన్డేల్లోనూ కొనసాగించాడు. 107 బంతుల్లో 103 పరుగుల చేసి.. కెరీర్​లో తొలిసారి వన్డే శతకం నమోదు చేసుకున్నాడు. మొత్తం ఇన్నింగ్స్​లో 11 ఫోర్లు, 1 సిక్సర్​ బాదాడు. అయితే సెంచరీ తర్వాత జోరు పెంచే క్రమంలో సౌథీ బౌలింగ్​లో సాంట్నర్​కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు.

కోహ్లీ, రాహుల్​ అర్ధశతకాలు

టాస్​ ఓడిన భారత బ్యాటింగ్​లో ఓపెనర్లు మయాంక్​ అగర్వాల్​ 32(31 బంతుల్లో; 6 ఫోర్లు), పృథ్వీ షా 20(21 బంతుల్లో; 3 ఫోర్లు) శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధాటిగా ఆడిన వీరిద్దరూ 4 పరుగుల వ్యవధిలోనే ఔటయ్యారు. గ్రాండ్​హోమ్​ బౌలింగ్​లో పృథ్వీ ఔటవ్వగా... మయాంక్​ సౌథీ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి కోహ్లీ, శ్రేయస్​ ఇన్నింగ్స్​ను నడిపించారు. విరాట్​ కెరీర్​లో మరో అర్ధశతకం ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్​ చేరాడు.

సూపర్​ ఫామ్​లో ఉన్న కేఎల్​ రాహుల్​(88) మరోసారి సూపర్​ ఇన్నింగ్స్​ ఆడాడు. 64 బంతుల్లో 88 రన్స్​ చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఆఖర్లో కేదార్​ జాదవ్​(26*) నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారత జట్టు 347 రన్స్​ చేసింది. న్యూజిలాండ్​ బౌలర్లలో టిమ్​ సౌథీ 2 వికెట్లు, గ్రాండ్​హోమ్​, సోధీ తలో వికెట్​ సాధించారు.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 29, 2020, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.