ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారని భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా తెలిపాడు. వచ్చే ప్రపంచకప్లో షమి ప్రధాన పోత్ర పోషిస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
గత ఏడాదిన్నర కాలంగా షమి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడాడు. టెస్ట్ మ్యాచుల్లో బౌలింగ్ చేయడం తేలిక కాదని.. అందుకు ఫిట్నెస్ చాలా అవసరమన్నాడు. ప్రపంచకప్లో షమి భారత్కు వరంగా మారతాడని నెహ్రా పేర్కొన్నాడు.
త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్లోనూ షమి మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షించాడు నెహ్రా. ఇది ప్రపంచకప్కు ఉపయోగపడుతుందని తెలిపాడు.
న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో షమి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.
ఇవీ చదవండి..అచ్చం బుమ్రా లానే...