ETV Bharat / sports

'గులాబ్​ జామూన్​ తింటూ ఎలా మాట్లాడుతున్నావు రోహిత్​'

రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు తాను ఎంపికవ్వడంపై అభిమానులకు ధన్యావాదాలు తెలుపుతూ టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​శర్మ ఓ వీడియో షేర్ చేశాడు. దీనిపై మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​సింగ్​ ఆసక్తికర కామెంట్​ చేశాడు.

author img

By

Published : Aug 23, 2020, 7:35 AM IST

"Must You Tease The Khel Ratna": Ritika Reacts After Yuvraj Singh Trolls Rohit Sharma
'గులాబ్​ జామూన్​ తింటూ ఎలా మాట్లాడుతున్నావు రోహిత్​'

ఈ ఏడాది రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు ఎంపికైన టీమ్ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియా పంచుకున్నాడు. దేశానికి మరెన్నో పురస్కారాలు తీసుకువస్తానని అందులో పేర్కొన్నాడు. ఈ వీడియోపై మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ ఆసక్తికర కామెంట్​ చేశాడు.

"నీ నోటిలో రెండు పక్కలా గులాబ్​ జామూన్​ పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నావో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది" అని రోహిత్​ భార్య రితికను ట్యాగ్​ చేశాడు. దీనికి స్పందించిన రితిక.. "మీరు ఈ ఖేల్​రత్నను టీజ్​ చేయండి" అంటూ రిప్లే ఇచ్చింది.

రోహిత్​శర్మ వీడియోపై కామెంట్ చేసిన యువరాజ్​, రోహిత్​ భార్య రితిక

ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. వారిలో క్రికెటర్​ రోహిత్​శర్మ, పారా అథ్లెట్​ మరియప్పన్​ తంగవేలు, టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​ మనికా బత్రా, రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్​ ఉన్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్న క్రికెటర్లలో సచిన్​ తెందూల్కర్​, మహేంద్ర సింగ్​ ధోనీ, విరాట్​ కోహ్లీ ఉన్నారు. ఇప్పుడు రోహిత్​ నాలుగో క్రికెటర్​గా గుర్తింపు పొందాడు. భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్​గా వ్యవహరించని ఓ క్రికెటర్ ఈ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ ఏడాది రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు ఎంపికైన టీమ్ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియా పంచుకున్నాడు. దేశానికి మరెన్నో పురస్కారాలు తీసుకువస్తానని అందులో పేర్కొన్నాడు. ఈ వీడియోపై మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ ఆసక్తికర కామెంట్​ చేశాడు.

"నీ నోటిలో రెండు పక్కలా గులాబ్​ జామూన్​ పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నావో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది" అని రోహిత్​ భార్య రితికను ట్యాగ్​ చేశాడు. దీనికి స్పందించిన రితిక.. "మీరు ఈ ఖేల్​రత్నను టీజ్​ చేయండి" అంటూ రిప్లే ఇచ్చింది.

రోహిత్​శర్మ వీడియోపై కామెంట్ చేసిన యువరాజ్​, రోహిత్​ భార్య రితిక

ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. వారిలో క్రికెటర్​ రోహిత్​శర్మ, పారా అథ్లెట్​ మరియప్పన్​ తంగవేలు, టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​ మనికా బత్రా, రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్​ ఉన్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్న క్రికెటర్లలో సచిన్​ తెందూల్కర్​, మహేంద్ర సింగ్​ ధోనీ, విరాట్​ కోహ్లీ ఉన్నారు. ఇప్పుడు రోహిత్​ నాలుగో క్రికెటర్​గా గుర్తింపు పొందాడు. భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్​గా వ్యవహరించని ఓ క్రికెటర్ ఈ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.