ETV Bharat / sports

లాక్​డౌన్​ కోసం ధోనీ సిక్స్​ను ఉపయోగించిన పోలీసులు

2011 ప్రపంచకప్​ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్స్ సిక్స్​ను కరోనాపై అవగాహన కోసం ఉపయోగించారు ముంబయి పోలీసులు. ఆ ఫొటోను ట్వీట్ చేసి, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

author img

By

Published : Apr 3, 2020, 3:58 PM IST

లాక్​డౌన్​ కోసం ధోనీ సిక్స్​ను ఉపయోగించిన పోలీసులు
ధోనీ

భారత్​లో ప్రస్తుతం లాక్​డౌన్ అమల్లో​ ఉంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలెవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే ముంబయి పోలీసులు కాస్త విభిన్న ప్రయత్నం చేశారు. 2011 ప్రపంచకప్​ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్​ను ఇందుకోసం ఉపయోగించారు. ఆ ఫొటోను ట్వీట్ చేసి, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చెప్పారు.

mumbai police tweeted ms dhoni six in world cup 2011
ధోనీ విన్నింగ్స్ సిక్స్ గురించి ముంబయి పోలీసులు ట్వీట్

"2011 ప్రపంచకప్​ను టీమిండియా​ గెలుచుకున్నప్పుడు ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఇళ్లలోనే ఉండి, భారత్ లక్ష్యాన్ని ఛేదించే సమయం కోసం ఎదురుచూస్తున్నాం" -ముంబయి పోలీసులు ట్వీట్

ప్రస్తుతం భారత్​లో 2301 మందికి కరోనా సోకగా, 56 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 54,194 మంది మృతిచెందారు.

భారత్​లో ప్రస్తుతం లాక్​డౌన్ అమల్లో​ ఉంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలెవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే ముంబయి పోలీసులు కాస్త విభిన్న ప్రయత్నం చేశారు. 2011 ప్రపంచకప్​ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్​ను ఇందుకోసం ఉపయోగించారు. ఆ ఫొటోను ట్వీట్ చేసి, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చెప్పారు.

mumbai police tweeted ms dhoni six in world cup 2011
ధోనీ విన్నింగ్స్ సిక్స్ గురించి ముంబయి పోలీసులు ట్వీట్

"2011 ప్రపంచకప్​ను టీమిండియా​ గెలుచుకున్నప్పుడు ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఇళ్లలోనే ఉండి, భారత్ లక్ష్యాన్ని ఛేదించే సమయం కోసం ఎదురుచూస్తున్నాం" -ముంబయి పోలీసులు ట్వీట్

ప్రస్తుతం భారత్​లో 2301 మందికి కరోనా సోకగా, 56 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 54,194 మంది మృతిచెందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.