దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ సలహా తర్వాత తన ఆటతీరులో మార్పొచ్చిందని ముంబయి కెప్టెన్ పృథ్వీ షా తెలిపాడు. నిరుడు ఐపీఎల్లో నిరాశ పరిచిన పృథ్వీ.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ విఫలమయ్యాడు. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఆరు బంతులే ఎదుర్కోవడం వల్ల పృథ్వీకి తర్వాతి టెస్టుల్లో అవకాశం దక్కలేదు. శుభ్మన్ గిల్తో అతడి స్థానాన్ని భర్తీ చేశారు.
'సచిన్తో మాట్లాడాక నా బ్యాటింగ్లో మార్పొచ్చింది'
గతేడాది ఐపీఎల్తో పాటు ఆస్ట్రేలియా పర్యటనలోనూ విఫలమైన యువ క్రికెటర్ పృథ్వీ షా.. ప్రస్తుతం జరుగుతోన్న విజయ్ హజారే టోర్నీలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తనదైన ఆటతీరుతో ముంబయి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇంతలో అంత మార్పు రావడానికి కారణాలను తాజాగా వెల్లడించాడు పృథ్వీ.
!['సచిన్తో మాట్లాడాక నా బ్యాటింగ్లో మార్పొచ్చింది' Mumbai captain Prithvi Shah has said that he has changed his style of play following the advice of legendary Sachin Tendulkar.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10987400-thumbnail-3x2-shasach.jpg?imwidth=3840)
2020లో ఘోరంగా విఫలమైన పృథ్వీ.. విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడి, 188.5 సగటుతో 754 పరుగులు సాధించాడు. ఆసీస్ పర్యటన అనంతరం సచిన్ను కలవడం తన ఆటలో మార్పునకు కారణమని పృథ్వీ పేర్కొన్నాడు. "నాకంతా గందరగోళంగా అనిపించింది. గల్లీ ప్రాంతంలో నా బ్యాటు కాస్త కిందకి వెళ్తోంది. కానీ కెరీర్ మొత్తం అలాగే పరుగులు రాబట్టా. నేను ఔటవుతున్న విధానమే అసలు సమస్య. దాన్ని వెంటనే సరిచేయాలి. బ్యాటును సరిగానే ఎత్తుతున్నా గాని దేహానికి కాస్త దూరంగా వెళ్తోంది. దేహానికి బ్యాటును దగ్గరగా ఉంచాలి. ఆ పని చేయలేకపోతున్నా. ఆసీస్ నుంచి రాగానే సచిన్ సర్ను కలిశా. బ్యాటింగ్ శైలిలో ఎక్కువ మార్పులు చేయొద్దన్నాడు. వీలైనంత వరకు దేహానికి దగ్గరగా ఆడమన్నాడు. బంతిని కాస్త ఆలస్యంగా ఆడుతున్నట్లు చెప్పాడు" అని పృథ్వీ వివరించాడు.
ఇదీ చదవండి: 'పిచ్ సవాళ్లు విసిరింది- షాట్లు ఆడలేకపోయాం'
దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ సలహా తర్వాత తన ఆటతీరులో మార్పొచ్చిందని ముంబయి కెప్టెన్ పృథ్వీ షా తెలిపాడు. నిరుడు ఐపీఎల్లో నిరాశ పరిచిన పృథ్వీ.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ విఫలమయ్యాడు. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఆరు బంతులే ఎదుర్కోవడం వల్ల పృథ్వీకి తర్వాతి టెస్టుల్లో అవకాశం దక్కలేదు. శుభ్మన్ గిల్తో అతడి స్థానాన్ని భర్తీ చేశారు.
2020లో ఘోరంగా విఫలమైన పృథ్వీ.. విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడి, 188.5 సగటుతో 754 పరుగులు సాధించాడు. ఆసీస్ పర్యటన అనంతరం సచిన్ను కలవడం తన ఆటలో మార్పునకు కారణమని పృథ్వీ పేర్కొన్నాడు. "నాకంతా గందరగోళంగా అనిపించింది. గల్లీ ప్రాంతంలో నా బ్యాటు కాస్త కిందకి వెళ్తోంది. కానీ కెరీర్ మొత్తం అలాగే పరుగులు రాబట్టా. నేను ఔటవుతున్న విధానమే అసలు సమస్య. దాన్ని వెంటనే సరిచేయాలి. బ్యాటును సరిగానే ఎత్తుతున్నా గాని దేహానికి కాస్త దూరంగా వెళ్తోంది. దేహానికి బ్యాటును దగ్గరగా ఉంచాలి. ఆ పని చేయలేకపోతున్నా. ఆసీస్ నుంచి రాగానే సచిన్ సర్ను కలిశా. బ్యాటింగ్ శైలిలో ఎక్కువ మార్పులు చేయొద్దన్నాడు. వీలైనంత వరకు దేహానికి దగ్గరగా ఆడమన్నాడు. బంతిని కాస్త ఆలస్యంగా ఆడుతున్నట్లు చెప్పాడు" అని పృథ్వీ వివరించాడు.
ఇదీ చదవండి: 'పిచ్ సవాళ్లు విసిరింది- షాట్లు ఆడలేకపోయాం'