టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్ దేవల్ సాహే(73) అనారోగ్య సమస్యలతో మంగళవారం మృతి చెందారు. ఆయన శరీరంలోని అన్ని అవయవాలు పాడైపోవడం వల్ల తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభినవ్ ఆకాశ్ సాహే వెల్లడించారు.
సాహే గతంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేశారు. ఆయనకు ఓ భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహీని.. తన స్వగ్రామం రాంచీలో తొలిసారి టర్ఫ్ పిచ్లపై ఆడటం నేర్పించారు. అనంతర కాలంలో ధోనీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, ఎన్నో ఘనతల్ని సాధించాడు.
ఇదీ చూడండి : 'ధోనీని ఆటపట్టిస్తా.. జీవా వినేది అతడి మాటలే'