ETV Bharat / sports

ప్రాక్టీసులో ధోనీ రచ్చ.. సిక్సర్లే సిక్సర్లు

author img

By

Published : Aug 21, 2020, 4:48 PM IST

గత ఐదు రోజులుగా చెన్నైలో నిర్వహించిన ప్రాక్టీసు క్యాంప్​కు సంబంధించిన వీడియోను సీఎస్క్ ట్వీట్ చేసింది. ఇందులో భాగంగా సిక్సర్లు కొడుతూ కనిపించాడు కెప్టెన్ ధోనీ.

ప్రాక్టీసులో ధోనీ రచ్చ.. సిక్సర్లే సిక్సర్లు
ధోనీ ప్రాక్టీసు వీడియో

ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. చెన్నైలో జరిగిన ప్రాక్టీసు​ క్యాంప్​లో సిక్సులతో ఇరగదీశాడు. ఓ వైపు మహీ బంతిని స్టాండ్స్​లో పంపిస్తుంటే పక్కనే ఉన్న రైనా విజిల్స్ వేస్తూ కనిపించాడు. ఆగస్టు 15-20 వరకు ఈ ప్రాక్టీసు సెషన్ జరిగినట్లు తెలుస్తోంది.

"ఈ సూపర్​ క్యాంప్ సూపర్ ఫ్యాన్స్​ను చాలా మిస్సయింది. కానీ దీనిని పెద్ద విజిల్​తో ముగిస్తామని అనుకుంటున్నాం" -చెన్నై సూపర్​కింగ్స్ ట్వీట్

ఈ ఏడాది ఆగస్టు 15 సాయంత్రం 7:29 గంటలకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా, కొద్దినిమిషాల తర్వాత రైనా కూడా క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. రాబోయే ఐపీఎల్ వీరిద్దరూ ఎలా ఆడతారో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

"నేను అక్కడే ఉన్నాను. ధోనీ చాలాసేపు ప్రాక్టీసు చేశాడు(కరోనా రాకముందు ప్రాక్టీసులో). మీరు త్వరలో హెలికాప్టర్ షాట్లను చూస్తారు. ఐపీఎల్​కు మహీ గ్రేట్ బ్రాండ్ అంబాసిడర్, అత్యుత్తమ క్రికెటర్"

-ఓ వర్చువల్ వీడియోలో సురేశ్ రైనా

ఐపీఎల్​లో పాల్గొనడంలో భాగంగా పంజాబ్, దిల్లీ, కోల్​కతా జట్లు దుబాయ్ చేరుకోగా.. బెంగళూరు, చెన్నై టీమ్​లు శుక్రవారం ఆ దేశానికి పయనమయ్యాయి.

చెన్నై జట్టులోని హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో కొన్ని రోజుల తర్వాత యూఏఈ వెళ్లనుండగా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు లుంగి ఎంగిడి, డుప్లెసిస్ సెప్టెంబరు తొలి వారంలో అక్కడికి చేరుకోనున్నారు. బ్రావో, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ శాంట్నర్​లు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత యూఈఏకి పయనమవుతారు.

ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. చెన్నైలో జరిగిన ప్రాక్టీసు​ క్యాంప్​లో సిక్సులతో ఇరగదీశాడు. ఓ వైపు మహీ బంతిని స్టాండ్స్​లో పంపిస్తుంటే పక్కనే ఉన్న రైనా విజిల్స్ వేస్తూ కనిపించాడు. ఆగస్టు 15-20 వరకు ఈ ప్రాక్టీసు సెషన్ జరిగినట్లు తెలుస్తోంది.

"ఈ సూపర్​ క్యాంప్ సూపర్ ఫ్యాన్స్​ను చాలా మిస్సయింది. కానీ దీనిని పెద్ద విజిల్​తో ముగిస్తామని అనుకుంటున్నాం" -చెన్నై సూపర్​కింగ్స్ ట్వీట్

ఈ ఏడాది ఆగస్టు 15 సాయంత్రం 7:29 గంటలకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా, కొద్దినిమిషాల తర్వాత రైనా కూడా క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. రాబోయే ఐపీఎల్ వీరిద్దరూ ఎలా ఆడతారో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

"నేను అక్కడే ఉన్నాను. ధోనీ చాలాసేపు ప్రాక్టీసు చేశాడు(కరోనా రాకముందు ప్రాక్టీసులో). మీరు త్వరలో హెలికాప్టర్ షాట్లను చూస్తారు. ఐపీఎల్​కు మహీ గ్రేట్ బ్రాండ్ అంబాసిడర్, అత్యుత్తమ క్రికెటర్"

-ఓ వర్చువల్ వీడియోలో సురేశ్ రైనా

ఐపీఎల్​లో పాల్గొనడంలో భాగంగా పంజాబ్, దిల్లీ, కోల్​కతా జట్లు దుబాయ్ చేరుకోగా.. బెంగళూరు, చెన్నై టీమ్​లు శుక్రవారం ఆ దేశానికి పయనమయ్యాయి.

చెన్నై జట్టులోని హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో కొన్ని రోజుల తర్వాత యూఏఈ వెళ్లనుండగా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు లుంగి ఎంగిడి, డుప్లెసిస్ సెప్టెంబరు తొలి వారంలో అక్కడికి చేరుకోనున్నారు. బ్రావో, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ శాంట్నర్​లు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత యూఈఏకి పయనమవుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.