ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్లీచ్ బౌలింగ్ విధానాన్ని విమర్శించాడు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. అతడు వేసే బంతులు అంతగా ప్రభావం చూపవని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లీష్ జట్టు మాజీ పేసర్లు గ్రేమ్ స్వాన్, మాంటీ పనేసర్ లాగా వేగంగా బంతులు సంధించలేడని అన్నాడు. 2012లో ఇంగ్లాండ్ సిరీస్ విజయం సాధించడంలో స్వాన్, పనేసర్ కీలక పాత్ర పోషించారు.
"ప్రపంచంలోనే ఉత్తమ బౌలర్లలో గ్రేమ్ స్వాన్, మాంటీ పనేసర్ ఉంటారు. 2012లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్లో వారు ప్రదర్శన అద్భుతం. చాలా వేగవంతంగా బంతులు విసురుతారు. అయితే జాక్ లీచ్ అలాంటి బౌలర్ కాదు. చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తాడు. స్పిన్ ఎక్కువ అయ్యే పిచ్ పై బంతి విసిరే వేగాన్ని అతడు నియంత్రిస్తే విజయవంతం అయ్యే అవకాశం ఉంది" అని సచిన్ అన్నాడు.
ఫిబ్రవరి 5నుంచి ఇంగ్లాండ్-భారత్ మధ్య చెపాక్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఈ మైదానంలో ఎర్ర మట్టి కారణంగా బంతులు ఎక్కువగా బౌన్స్ అవుతాయని అన్నాడు సచిన్. 15వ ఓవర్ నుంచి దాదాపు 60వ ఓవర్ వరకు బంతి రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఈ స్టేడియంలో ఫాస్ట్ బౌలర్లు కీలకంగా వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాలో దాదాపు రెండు నెలలపాటు సిరీస్ ఆడింది టీమ్ఇండియా. మరి అక్కడ ఆడిన ప్రభావం.. చెపాక్ స్టేడియంలో ఆడేటప్పుడు బ్యాట్స్మెన్పై పడుతుందా అని పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దీని గురించి కూడా సచిన్ మాట్లాడారు. "ప్రతి బ్యాట్స్మెన్కు భిన్నమైన విధానం ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రభావం ఇక్కడేమి పడదు. పుజారా విషయానికొస్తే అతడు అద్భుతంగా ఆడతాడు. ఆస్ట్రేలియా సిరీస్లో తానేంటో నిరూపించాడు. అతడి ఆటతీరుకు ముగ్ధుడయ్యాను" అని చెప్పాడు.
ఇదీ చూడండి: ద్రవిడ్పై సచిన్ అలిగిన వేళ!