ETV Bharat / sports

భారత్​ అక్కడ గెలిచి ఈ తరంలోనే ఉత్తమ జట్టుగా నిలుస్తుందా?

author img

By

Published : Mar 7, 2021, 8:18 AM IST

Updated : Mar 7, 2021, 10:34 AM IST

భారత్​తో నాలుగు టెస్టుల సిరీస్​ను గెలుపుతో ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు.. తర్వాత ఆడిన మూడింట పరాజయం పాలైంది. తమ బ్యాట్స్​మెన్ల వైఫల్యానికి మన పిచ్​లను విమర్శించారు ఆ దేశ క్రికెట్ మాజీలు. చివరికి నాలుగో టెస్టులో భారత లోయర్ ఆర్డర్​ బ్యాట్స్​మెన్లు కలిపి చేసిన పరుగులు కూడా చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఏం సాకులు చెబుతారో ఇంగ్లీష్​ జట్టు మద్దతుదారులు.

Michael Vaughan comments on team india
వాన్​ సవాలును భారత్ అధిగమించేనా?

మొతేరాలో మూడో టెస్టులో స్పిన్నర్ల బంతులు ఆడలేక రెండు జట్ల బ్యాట్స్​మెన్​ అల్లాడిపోవడం, మ్యాచ్​ రెండు రోజుల్లోనే ముగిసిపోవడం వల్ల ఇంగ్లిష్ జట్టు మద్దతుదారులు ఎంతగా రెచ్చిపోయారో తెలిసిందే. కానీ ఆ మ్యాచ్​లో ఇరు జట్లకూ పిచ్​ సమానం. పైగా టాస్ గెలిచింది ఇంగ్లాండ్​. తొలి రోజు బ్యాటింగ్​కు కొంత అనుకూలంగా ఉన్న పిచ్​ మీద మొదట బ్యాటింగ్ చేసింది ఆ జట్టే. అయినా మ్యాచ్​ను భారత్​ సొంతం చేసుకుంది. చివరి టెస్టుకు అనుకున్నట్లే పిచ్​ స్పిన్నర్లకు అనుకూలిస్తూనే బ్యాటింగ్​కూ సహకరించేలా తయారైంది. పైగా ఇది డేనైట్ టెస్టు కాదు. ఈ మ్యాచ్​లోనూ మొదట టాస్​ ఇంగ్లాండే గెలిచింది. మొదట బ్యాటింగే చేసింది. కానీ 200 పైచిలుకు స్కోరుతో సరిపెట్టుకుంది.

ఇప్పుడేమంటారు మద్దతుదారులు?

రెండో రోజు భారత్​ బ్యాటింగ్​లో ఎంత ఇబ్బంది పడిందో అందరూ చూశారు. కానీ 146 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్​.. ఆ తర్వాత ఒత్తిడి కొనసాగించలేకపోయింది. పట్టుదలతో నిలిస్తే పిచ్​ ఎలా ఉన్నా పరుగులు సాధించొచ్చని పంత్​, సుందర్​ చాటి చెప్పారు. ఆ ఇన్నింగ్స్​లు పూర్తిగా వారి ఘనత. అవి ఇంగ్లాండ్ వైఫల్యానికి సూచికలు కూడా. మూడో రోజు ఉదయం సుందర్, అక్షర్​ ఎంత సాధికారితతో ఆడారో అందరూ చూశారు. రెండో సెషన్లో అదే పిచ్​ మీద ఇంగ్లిష్​ బ్యాట్స్​మెన్​ తేలిపోయారు. లోయర్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్ అయిన సుందర్, అక్షర్​ కలిపి చేసిన పరుగులు కూడా ఆ జట్టు మొత్తం కలిసి చేయలేకపోయింది. ఇక పిచ్​ను ఏమని నిందిస్తారు ఇంగ్లాండ్ మద్దతుదారులు.

ఇక సాకులేవీ?

తొలి టెస్టులో పరాభవం తర్వాత చెపాక్​లో స్పిన్​ పిచ్​ సిద్ధం చేయించుకున్న మాట వాస్తవం. కానీ 'ఆతిథ్య అనుకూలత'ను ఉపయోగించుకోవడం అన్ని జట్లూ చేసేదే. విదేశాలకు వెళ్లినప్పుడు మన జట్టును పేస్​ పిచ్​లే స్వాగతిస్తాయి కాబట్టి దీన్ని ఎవరూ తప్పుపట్టడానికి వీల్లేదు. కాకపోతే మొతేరాలో మూడో టెస్టు మరీ రెండు రోజుల్లో ముగిసిపోవడం వల్ల విమర్శలు తప్పలేదు. అందుకు గులాబి బంతితో ఆడటం ఓ ముఖ్య కారణమన్నది విస్మరించలేని విషయం. చివరి టెస్టుతో ఆ సంగతి రుజువైంది. ఈ మ్యాచ్​లో పిచ్​ కంటే ఆటతీరే ఫలితాన్ని నిర్దేశించింది. దీంతో ఇంగ్లాండ్ సాకులు వెతకడానికి అవకాశమే లేకపోయింది.

వాన్​ సవాల్​..

అయితే ఈ మ్యాచ్​ అవ్వగానే.. ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. భారత్​ను అభినందిస్తూనే ఒక సవాల్​ విసిరాడు. ఈ ఏడాదే ఇంగ్లాండ్​ పర్యటనకు రానున్న భారత్​ అక్కడ కూడా గెలిస్తే ఈ తరంలో ఉత్తమ జట్టుగా అవతరిస్తుందన్నాడు. అక్కడి స్వింగ్ పరిస్థితుల గురించి హెచ్చరిక జారీ చేశాడు. వాన్​ అన్నాడని కాదు కానీ, ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి అగ్ర జట్టును దాని సొంతగడ్డపై మట్టికరిపించిన టీమ్​ఇండియా.. ఇంగ్లాండ్​ను ఇంగ్లాండ్​లో ఓడిస్తే జట్టుకు తిరుగులేదని ఎవ్వరైనా అంగీకరిస్తారు. ​ ​

  • India have been far too good ... the last 3 Tests they have absolutely hammered England ... If they can win in England they are without doubt the best Test team of this era ... but that will take some doing against the swinging ball ... #INDvENG

    — Michael Vaughan (@MichaelVaughan) March 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: విరాట పర్వం- కివీస్​ను కొట్టి జగజ్జేతగా నిలిచేనా?

మొతేరాలో మూడో టెస్టులో స్పిన్నర్ల బంతులు ఆడలేక రెండు జట్ల బ్యాట్స్​మెన్​ అల్లాడిపోవడం, మ్యాచ్​ రెండు రోజుల్లోనే ముగిసిపోవడం వల్ల ఇంగ్లిష్ జట్టు మద్దతుదారులు ఎంతగా రెచ్చిపోయారో తెలిసిందే. కానీ ఆ మ్యాచ్​లో ఇరు జట్లకూ పిచ్​ సమానం. పైగా టాస్ గెలిచింది ఇంగ్లాండ్​. తొలి రోజు బ్యాటింగ్​కు కొంత అనుకూలంగా ఉన్న పిచ్​ మీద మొదట బ్యాటింగ్ చేసింది ఆ జట్టే. అయినా మ్యాచ్​ను భారత్​ సొంతం చేసుకుంది. చివరి టెస్టుకు అనుకున్నట్లే పిచ్​ స్పిన్నర్లకు అనుకూలిస్తూనే బ్యాటింగ్​కూ సహకరించేలా తయారైంది. పైగా ఇది డేనైట్ టెస్టు కాదు. ఈ మ్యాచ్​లోనూ మొదట టాస్​ ఇంగ్లాండే గెలిచింది. మొదట బ్యాటింగే చేసింది. కానీ 200 పైచిలుకు స్కోరుతో సరిపెట్టుకుంది.

ఇప్పుడేమంటారు మద్దతుదారులు?

రెండో రోజు భారత్​ బ్యాటింగ్​లో ఎంత ఇబ్బంది పడిందో అందరూ చూశారు. కానీ 146 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్​.. ఆ తర్వాత ఒత్తిడి కొనసాగించలేకపోయింది. పట్టుదలతో నిలిస్తే పిచ్​ ఎలా ఉన్నా పరుగులు సాధించొచ్చని పంత్​, సుందర్​ చాటి చెప్పారు. ఆ ఇన్నింగ్స్​లు పూర్తిగా వారి ఘనత. అవి ఇంగ్లాండ్ వైఫల్యానికి సూచికలు కూడా. మూడో రోజు ఉదయం సుందర్, అక్షర్​ ఎంత సాధికారితతో ఆడారో అందరూ చూశారు. రెండో సెషన్లో అదే పిచ్​ మీద ఇంగ్లిష్​ బ్యాట్స్​మెన్​ తేలిపోయారు. లోయర్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్ అయిన సుందర్, అక్షర్​ కలిపి చేసిన పరుగులు కూడా ఆ జట్టు మొత్తం కలిసి చేయలేకపోయింది. ఇక పిచ్​ను ఏమని నిందిస్తారు ఇంగ్లాండ్ మద్దతుదారులు.

ఇక సాకులేవీ?

తొలి టెస్టులో పరాభవం తర్వాత చెపాక్​లో స్పిన్​ పిచ్​ సిద్ధం చేయించుకున్న మాట వాస్తవం. కానీ 'ఆతిథ్య అనుకూలత'ను ఉపయోగించుకోవడం అన్ని జట్లూ చేసేదే. విదేశాలకు వెళ్లినప్పుడు మన జట్టును పేస్​ పిచ్​లే స్వాగతిస్తాయి కాబట్టి దీన్ని ఎవరూ తప్పుపట్టడానికి వీల్లేదు. కాకపోతే మొతేరాలో మూడో టెస్టు మరీ రెండు రోజుల్లో ముగిసిపోవడం వల్ల విమర్శలు తప్పలేదు. అందుకు గులాబి బంతితో ఆడటం ఓ ముఖ్య కారణమన్నది విస్మరించలేని విషయం. చివరి టెస్టుతో ఆ సంగతి రుజువైంది. ఈ మ్యాచ్​లో పిచ్​ కంటే ఆటతీరే ఫలితాన్ని నిర్దేశించింది. దీంతో ఇంగ్లాండ్ సాకులు వెతకడానికి అవకాశమే లేకపోయింది.

వాన్​ సవాల్​..

అయితే ఈ మ్యాచ్​ అవ్వగానే.. ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. భారత్​ను అభినందిస్తూనే ఒక సవాల్​ విసిరాడు. ఈ ఏడాదే ఇంగ్లాండ్​ పర్యటనకు రానున్న భారత్​ అక్కడ కూడా గెలిస్తే ఈ తరంలో ఉత్తమ జట్టుగా అవతరిస్తుందన్నాడు. అక్కడి స్వింగ్ పరిస్థితుల గురించి హెచ్చరిక జారీ చేశాడు. వాన్​ అన్నాడని కాదు కానీ, ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి అగ్ర జట్టును దాని సొంతగడ్డపై మట్టికరిపించిన టీమ్​ఇండియా.. ఇంగ్లాండ్​ను ఇంగ్లాండ్​లో ఓడిస్తే జట్టుకు తిరుగులేదని ఎవ్వరైనా అంగీకరిస్తారు. ​ ​

  • India have been far too good ... the last 3 Tests they have absolutely hammered England ... If they can win in England they are without doubt the best Test team of this era ... but that will take some doing against the swinging ball ... #INDvENG

    — Michael Vaughan (@MichaelVaughan) March 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: విరాట పర్వం- కివీస్​ను కొట్టి జగజ్జేతగా నిలిచేనా?

Last Updated : Mar 7, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.