ETV Bharat / sports

డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రేక్షకులకు అనుమతి

author img

By

Published : Mar 10, 2021, 4:30 PM IST

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ను సౌథాంప్టన్​ వేదికగా నిర్వహించనున్నట్లు ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. ఈ టెస్టును జూన్​ 18 నుంచి 22 మధ్య నిర్వహించనుండగా.. జూన్​ 23వ తేదీని రిజర్వ్​డేగా ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్​ను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేసింది.

Limited fans to be allowed in stadium for WTC final in Southampton
డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రేక్షకులకు అనుమతి

భారత్​, న్యూజిలాండ్​ మధ్య జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ను సౌథాంప్టన్​ వేదికగా జరగనున్నట్లు ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. ఈ తుదిపోరును జూన్​ 18 నుంచి 22 వరకు నిర్వహించనుంది. అయితే దీనికి రిజర్వ్​డేగా జూన్​ 23వ తేదీని ప్రకటించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ వేదికను మార్చినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. సౌథాంప్టన్​లో అప్పటి పరిస్థితిని బట్టి ప్రేక్షకులను కొంతమేర అనుమతిస్తామని వెల్లడించింది.

కరోనా సంక్షోభం తర్వాత సౌథాంప్టన్​లోనే వెస్టిండీస్​, పాకిస్థాన్​ జట్లతో సిరీస్​లను బయోబబుల్​ ఏర్పాటు చేసి ఇంగ్లాండ్​ బోర్డు విజయవంతంగా నిర్వహించింది. దీంతో టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కూ ఇదే మైదానాన్ని వినియోగించాలని.. ఐసీసీ నిర్ణయించింది.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు ముందుగా న్యూజిలాండ్​ అర్హత సాధించగా.. ఇటీవలే ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో గెలుపొందిన టీమ్ఇండియా తుదిపోరుకు చేరుకుంది.

ఇదీ చూడండి: టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ వేదిక మార్పు

భారత్​, న్యూజిలాండ్​ మధ్య జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ను సౌథాంప్టన్​ వేదికగా జరగనున్నట్లు ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. ఈ తుదిపోరును జూన్​ 18 నుంచి 22 వరకు నిర్వహించనుంది. అయితే దీనికి రిజర్వ్​డేగా జూన్​ 23వ తేదీని ప్రకటించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ వేదికను మార్చినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. సౌథాంప్టన్​లో అప్పటి పరిస్థితిని బట్టి ప్రేక్షకులను కొంతమేర అనుమతిస్తామని వెల్లడించింది.

కరోనా సంక్షోభం తర్వాత సౌథాంప్టన్​లోనే వెస్టిండీస్​, పాకిస్థాన్​ జట్లతో సిరీస్​లను బయోబబుల్​ ఏర్పాటు చేసి ఇంగ్లాండ్​ బోర్డు విజయవంతంగా నిర్వహించింది. దీంతో టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కూ ఇదే మైదానాన్ని వినియోగించాలని.. ఐసీసీ నిర్ణయించింది.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు ముందుగా న్యూజిలాండ్​ అర్హత సాధించగా.. ఇటీవలే ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో గెలుపొందిన టీమ్ఇండియా తుదిపోరుకు చేరుకుంది.

ఇదీ చూడండి: టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ వేదిక మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.