ETV Bharat / sports

'ఐపీఎల్​లో ఎక్కువ మంది స్వదేశీ కోచ్​లు ఉండాలి'

author img

By

Published : Sep 9, 2020, 7:33 AM IST

ఐపీఎల్​ లాంటి దేశవాళీ టోర్నీలో భారత కోచ్​లను అధికంగా చూడాలనుకుంటున్నట్లు ఆకాంక్షించాడు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కోచ్​ అనిల్​ కుంబ్లే. ప్రస్తుత సీజన్​లో తానొక్కడే స్వదేశీ కోచ్​నని చెప్పాడు.

Lack of Indian head coaches in IPL isn't true reflection of our resources: Anil Kumble
అనిల్​ కుంబ్లే

ఐపీఎల్​లో మరింత మంది స్వదేశీ కోచ్​లను చూడాలని అనుకుంటున్నట్లు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ప్రధాన కోచ్​ అనిల్​ కుంబ్లే చెప్పాడు. ప్రస్తుతం సీజన్​లో భారత్​ నుంచి​ కుంబ్లే ఒక్కడే ఉన్నాడు. ఇది మన దేశంలో ఉన్న వనరులను ప్రతిబింబించడం లేదని అన్నాడు.

"ఐపీఎల్​లో మరింత మంది భారత కోచ్​లు ఉండాలని కోరుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితి దేశంలో ఉన్న వనరులను ప్రతిబింబించట్లేదు. ఏదో ఓ దశలో స్వదేశం నుంచి ఎక్కువ మంది కోచ్​లు వస్తారు."

- అనిల్​ కుంబ్లే, పంజాబ్ జట్టు​ ప్రధాన కోచ్​

ప్రస్తుత ఐపీఎల్​లో ఏడు ఫ్రాంఛైజీలకు విదేశీయులే కోచ్​లుగా ఉన్నారు. పాంటింగ్​ (దిల్లీ), బ్రెండన్​ మెక్​కలమ్​ (కోల్​కతా), ఫ్లెమింగ్​ (చెన్నై), జయవర్ధనే (ముంబయి), బేలిస్​ (సన్​రైజర్స్​), కాటిచ్​ (బెంగళూరు), మెక్​డొనాల్డ్​ (రాజస్థాన్​) ఈ జాబితాలో ఉన్నారు.

కొన్ని ప్రాక్టీసు మ్యాచ్​లు ఆడితే తమ జట్టు కూర్పుపై తనకు ఓ అవగాహన వస్తుందని కుంబ్లే అన్నాడు. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​ సహా పంజాబ్​ జట్టులో చాలా మంది కర్ణాటక ఆటగాళ్లు ఉన్నారు. కోచ్​ కుంబ్లేదీ కర్ణాటకనే. దీనిపై కుంబ్లే మాట్లాడుతూ.."ఎక్కువ మంది కర్ణాటక వాళ్లు ఉండటం ఉపకరిస్తుంది. ఇతర కుర్రాళ్లతోనూ వాళ్ల భాషల్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. పంజాబీ కుర్రాళ్లతో కాస్త పంజాబీలోనూ మాట్లాడతా. వాళ్లను అలరించడానికి ప్రయత్నిస్తా" అని తెలిపాడు.

ఐపీఎల్​లో మరింత మంది స్వదేశీ కోచ్​లను చూడాలని అనుకుంటున్నట్లు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ప్రధాన కోచ్​ అనిల్​ కుంబ్లే చెప్పాడు. ప్రస్తుతం సీజన్​లో భారత్​ నుంచి​ కుంబ్లే ఒక్కడే ఉన్నాడు. ఇది మన దేశంలో ఉన్న వనరులను ప్రతిబింబించడం లేదని అన్నాడు.

"ఐపీఎల్​లో మరింత మంది భారత కోచ్​లు ఉండాలని కోరుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితి దేశంలో ఉన్న వనరులను ప్రతిబింబించట్లేదు. ఏదో ఓ దశలో స్వదేశం నుంచి ఎక్కువ మంది కోచ్​లు వస్తారు."

- అనిల్​ కుంబ్లే, పంజాబ్ జట్టు​ ప్రధాన కోచ్​

ప్రస్తుత ఐపీఎల్​లో ఏడు ఫ్రాంఛైజీలకు విదేశీయులే కోచ్​లుగా ఉన్నారు. పాంటింగ్​ (దిల్లీ), బ్రెండన్​ మెక్​కలమ్​ (కోల్​కతా), ఫ్లెమింగ్​ (చెన్నై), జయవర్ధనే (ముంబయి), బేలిస్​ (సన్​రైజర్స్​), కాటిచ్​ (బెంగళూరు), మెక్​డొనాల్డ్​ (రాజస్థాన్​) ఈ జాబితాలో ఉన్నారు.

కొన్ని ప్రాక్టీసు మ్యాచ్​లు ఆడితే తమ జట్టు కూర్పుపై తనకు ఓ అవగాహన వస్తుందని కుంబ్లే అన్నాడు. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​ సహా పంజాబ్​ జట్టులో చాలా మంది కర్ణాటక ఆటగాళ్లు ఉన్నారు. కోచ్​ కుంబ్లేదీ కర్ణాటకనే. దీనిపై కుంబ్లే మాట్లాడుతూ.."ఎక్కువ మంది కర్ణాటక వాళ్లు ఉండటం ఉపకరిస్తుంది. ఇతర కుర్రాళ్లతోనూ వాళ్ల భాషల్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. పంజాబీ కుర్రాళ్లతో కాస్త పంజాబీలోనూ మాట్లాడతా. వాళ్లను అలరించడానికి ప్రయత్నిస్తా" అని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.