ETV Bharat / international

హోటల్​లో భారీ అగ్నిప్రమాదం- 76 మంది మృతి - FIRE ACCIDENT AT TURKEY

తుర్కియేలోని ఓ రిసార్ట్​లోని హోటల్​లో అగ్నిప్రమాదం- అనేక మంది మృతి

Fire Accident at Turkey
Fire Accident at Turkey (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2025, 6:06 PM IST

Updated : Jan 22, 2025, 6:59 AM IST

Fire Accident at Turkey : తుర్కియేలోని బోలు ప్రావిన్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 76 మంది మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తుర్కియే వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. మరో ఇద్దరు భవనంపై నుంచి దూకి మృతిచెందారని వెల్లడించారు.

తుర్కియే కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు కర్టల్‌కాయ రిసార్ట్‌లోని 12 అంతస్తుల హోటల్​లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేశారు. ఘటన స్థలికి 30 అగ్నిమాపక వాహనాలు, 28 అంబులెన్సులు వచ్చినట్లు తుర్కియే మీడియా పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 234 మంది అతిథులు బస చేసినట్లు తెలిపింది. హోటల్‌కు చెందిన ఒక ఉద్యోగి దాదాపు 20 మందిని కాపాడారని వెల్లడించింది. కొంత మంది గదుల్లో నుంచి దుప్పట్ల సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించారని స్థానికులు చెప్పారు.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని బోలు ప్రావిన్స్‌ గవర్నర్ చెప్పారు. అందుకోసం ఆరుగురు ప్రాసిక్యూటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. మరోవైపు రిస్టార్​లోని మిగిలిన అతిథులను ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి, చుట్టుపక్కల హోటళ్లకు పంపించారని తెలిపారు.

Fire Accident at Turkey : తుర్కియేలోని బోలు ప్రావిన్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 76 మంది మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తుర్కియే వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. మరో ఇద్దరు భవనంపై నుంచి దూకి మృతిచెందారని వెల్లడించారు.

తుర్కియే కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు కర్టల్‌కాయ రిసార్ట్‌లోని 12 అంతస్తుల హోటల్​లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేశారు. ఘటన స్థలికి 30 అగ్నిమాపక వాహనాలు, 28 అంబులెన్సులు వచ్చినట్లు తుర్కియే మీడియా పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 234 మంది అతిథులు బస చేసినట్లు తెలిపింది. హోటల్‌కు చెందిన ఒక ఉద్యోగి దాదాపు 20 మందిని కాపాడారని వెల్లడించింది. కొంత మంది గదుల్లో నుంచి దుప్పట్ల సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించారని స్థానికులు చెప్పారు.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని బోలు ప్రావిన్స్‌ గవర్నర్ చెప్పారు. అందుకోసం ఆరుగురు ప్రాసిక్యూటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. మరోవైపు రిస్టార్​లోని మిగిలిన అతిథులను ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి, చుట్టుపక్కల హోటళ్లకు పంపించారని తెలిపారు.

Last Updated : Jan 22, 2025, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.