ETV Bharat / sports

కోహ్లీ.. క్రికెట్​లో గాంధీలా ఉండట్లేదు!

author img

By

Published : Dec 11, 2020, 6:43 PM IST

మైదానంలో దూకుడుగా ఉండే టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ.. ఆటలో గాంధీ మార్గంలో కాకుండా భిన్నంగా వెళ్తున్నాడని మాజీ ఆటగాడు గ్రెగ్ ఛాపెల్ చెప్పాడు. అలానే ప్రస్తుత తరంలో విరాట్, మోస్ట్ పవర్​ఫుల్ ఆటగాడని అన్నాడు.

Kohli's game is unGandhian, says Chappell
కోహ్లీ క్రికెట్​లో గాంధీని అనుసరించట్లేదు!

ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన విదేశీ క్రికెటర్లలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ అత్యుత్తమం అని భారత మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ చెప్పాడు. ఆటలో అతడు గాంధేయ వాదాన్ని అనుసరించట్లేదని అన్నాడు.

"గతంలో ప్రత్యర్థి జట్లతో ఆడేటప్పుడు చాలామంది టీమ్​ఇండియా క్రికెటర్లు నెమ్మదిగా వ్యవహరించేవారు. ఆ విధానాన్ని మార్చిన తొలి ఆటగాడు సౌరభ్ గంగూలీ. కోహ్లీ కూడా తన పరధిలో ఉండాలనుకోవట్లేదు. ఎప్పుడూ దూకుడు స్వభావంతో ఉండేవాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాలనేది అతడి ఆలోచన. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన విదేశీ క్రికెటర్లలో కోహ్లీనే ది బెస్ట్" -గ్రెగ్ ఛాపెల్, ఆసీస్ మాజీ క్రికెటర్

ఆసీస్ పర్యటనలో భాగంగా డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్​ ఆడనుంది టీమ్​ఇండియా. తొలి మ్యాచ్​ తర్వాత భారత కెప్టెన్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి వెళ్లిపోనున్నాడు. ఈ విషయం గురించి ఛాపెల్ మాట్లాడాడు.

Kohli's game is unGandhian, says Chappell
టీమ్​ఇండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్

"టెస్టు క్రికెట్ కోహ్లీకి తొలి ప్రాధాన్యం. ఈ ఫార్మాట్ ద్వారానే జట్టును ఎప్పుడూ దూకుడుగా, ఉత్సాహంగా ఉంచగలుగుతున్నాడు. అదే అతడిపై అందరికీ గౌరవం పెంచేలా చేసింది. విరాట్ ఆట కూడా ఈ ఫార్మాట్​కు చాలా ప్లస్ అయింది" -గ్రెగ్ ఛాపెల్, టీమ్​ఇండియా మాజీ కోచ్

ప్రస్తుతం ప్రపంచంలో కోహ్లీ మోస్ట్ పవర్​ఫుల్ ఆటగాడని గ్రెగ్ ఛాపెల్ ప్రశంసించాడు. అయితే 2014 ఇంగ్లాండ్​ పర్యటన విరాట్ ఆటను, ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాడు. ఈ విషయంలో అతడి కోచ్ లాల్​చంద్ రాజ్​పూత్​ను మెచ్చుకోవాలని అన్నాడు.

ఇవీ చదవండి:

ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన విదేశీ క్రికెటర్లలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ అత్యుత్తమం అని భారత మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ చెప్పాడు. ఆటలో అతడు గాంధేయ వాదాన్ని అనుసరించట్లేదని అన్నాడు.

"గతంలో ప్రత్యర్థి జట్లతో ఆడేటప్పుడు చాలామంది టీమ్​ఇండియా క్రికెటర్లు నెమ్మదిగా వ్యవహరించేవారు. ఆ విధానాన్ని మార్చిన తొలి ఆటగాడు సౌరభ్ గంగూలీ. కోహ్లీ కూడా తన పరధిలో ఉండాలనుకోవట్లేదు. ఎప్పుడూ దూకుడు స్వభావంతో ఉండేవాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాలనేది అతడి ఆలోచన. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన విదేశీ క్రికెటర్లలో కోహ్లీనే ది బెస్ట్" -గ్రెగ్ ఛాపెల్, ఆసీస్ మాజీ క్రికెటర్

ఆసీస్ పర్యటనలో భాగంగా డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్​ ఆడనుంది టీమ్​ఇండియా. తొలి మ్యాచ్​ తర్వాత భారత కెప్టెన్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి వెళ్లిపోనున్నాడు. ఈ విషయం గురించి ఛాపెల్ మాట్లాడాడు.

Kohli's game is unGandhian, says Chappell
టీమ్​ఇండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్

"టెస్టు క్రికెట్ కోహ్లీకి తొలి ప్రాధాన్యం. ఈ ఫార్మాట్ ద్వారానే జట్టును ఎప్పుడూ దూకుడుగా, ఉత్సాహంగా ఉంచగలుగుతున్నాడు. అదే అతడిపై అందరికీ గౌరవం పెంచేలా చేసింది. విరాట్ ఆట కూడా ఈ ఫార్మాట్​కు చాలా ప్లస్ అయింది" -గ్రెగ్ ఛాపెల్, టీమ్​ఇండియా మాజీ కోచ్

ప్రస్తుతం ప్రపంచంలో కోహ్లీ మోస్ట్ పవర్​ఫుల్ ఆటగాడని గ్రెగ్ ఛాపెల్ ప్రశంసించాడు. అయితే 2014 ఇంగ్లాండ్​ పర్యటన విరాట్ ఆటను, ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాడు. ఈ విషయంలో అతడి కోచ్ లాల్​చంద్ రాజ్​పూత్​ను మెచ్చుకోవాలని అన్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.