ETV Bharat / sports

శార్దుల్​, భువనేశ్వర్​ విషయంలో కోహ్లీ విస్మయం

అద్భుత ప్రదర్శన చేసిన శార్దుల్​, భువనేశ్వర్​కు మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్​ ఆఫ్ ది సిరీస్​ ఇవ్వకపోవడం కోహ్లీని ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్​తో ఆదివారం వన్డే సిరీస్​ను 2-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది.

author img

By

Published : Mar 29, 2021, 9:02 AM IST

Updated : Mar 29, 2021, 11:42 AM IST

Kohli surprised at Shardul not getting man of the match and Bhuvi missing man of the series
కోహ్లీ శార్దుల్

నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్​పై భారత్ అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో శార్దుల్ ఠాకుర్​కు మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​ ఇవ్వకపోవడం, భువనేశ్వర్​కు మ్యాన్​ ఆఫ్ ది సిరీస్​ రాకపోవడంపై కెప్టెన్ కోహ్లీ విస్మయం వ్యక్తం చేశాడు.

"శార్దుల్​కు మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్, భువీకి మ్యాన్​ ఆఫ్ ది సిరీస్​ ఇవ్వకపోవడంపై నన్ను ఆశ్చర్యపరిచింది. భిన్న పరిస్థితుల్లో వారు అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కారణమయ్యారు" అని మ్యాచ్​ అనంతరం కోహ్లీ చెప్పాడు.

Kohli surprised at Shardul not getting man of the match
భువనేశ్వర్ కుమార్

"ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుపై సిరీస్ గెలవడం, నిజంగా మాకు(టీమ్​ఇండియాకు) మధురమైన అనుభూతి. ఇది నిజంగా చాలా గొప్ప సీజన్. ఇప్పుడు ఐపీఎల్​ కోసం ఎదురుచూస్తున్నాం" అని విరాట్ అన్నాడు.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 322/9 మాత్రమే చేయగలిగింది. సామ్ కరన్(95 నాటౌట్) అద్భుత పోరాటం చేసినప్పటికీ తమ జట్టును గెలిపించలేకపోయాడు.

ఇవీ చదవండి:

నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్​పై భారత్ అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో శార్దుల్ ఠాకుర్​కు మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​ ఇవ్వకపోవడం, భువనేశ్వర్​కు మ్యాన్​ ఆఫ్ ది సిరీస్​ రాకపోవడంపై కెప్టెన్ కోహ్లీ విస్మయం వ్యక్తం చేశాడు.

"శార్దుల్​కు మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్, భువీకి మ్యాన్​ ఆఫ్ ది సిరీస్​ ఇవ్వకపోవడంపై నన్ను ఆశ్చర్యపరిచింది. భిన్న పరిస్థితుల్లో వారు అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కారణమయ్యారు" అని మ్యాచ్​ అనంతరం కోహ్లీ చెప్పాడు.

Kohli surprised at Shardul not getting man of the match
భువనేశ్వర్ కుమార్

"ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుపై సిరీస్ గెలవడం, నిజంగా మాకు(టీమ్​ఇండియాకు) మధురమైన అనుభూతి. ఇది నిజంగా చాలా గొప్ప సీజన్. ఇప్పుడు ఐపీఎల్​ కోసం ఎదురుచూస్తున్నాం" అని విరాట్ అన్నాడు.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 322/9 మాత్రమే చేయగలిగింది. సామ్ కరన్(95 నాటౌట్) అద్భుత పోరాటం చేసినప్పటికీ తమ జట్టును గెలిపించలేకపోయాడు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 29, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.