ETV Bharat / sports

విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్​ సాధ్యమేనా?

author img

By

Published : May 30, 2020, 4:37 PM IST

కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 13వ సీజన్​ నిరవధిక వాయిదా పడింది. అయితే సెప్టెంబర్​ నుంచి డిసెంబర్​ మధ్య ఈ మెగాటోర్నీని కాస్త కుదించి నిర్వహించాలన్న యోచనలో ఉంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో స్వదేశీ ఆటగాళ్లతోనే టోర్నీ జరిగితే ఎలా ఉంటుంది? అనే అంశం ప్రస్తావనకు రాగా.. దానిపై కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ సహ యజమాని నెస్​వాడియా స్పందించారు.

Indian Premier League can't happen without foreign stars
విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్​ సాధ్యం కాదా?

ఐపీఎల్​.. ప్రపంచంలోనే అతిపెద్ద, ధనిక క్రికెట్​ లీగ్​. అలాంటి మెగా ఈవెంట్​ను విదేశీ ఆటగాళ్లు లేకుండా నిర్వహించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ సహ యజమాని నెస్​వాడియా. కరోనా సమయంలో ఈ లీగ్​ నిర్వహణ, రద్దుపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బీసీసీఐ తొందరపడినట్టే అని అన్నారు.

"ఐపీఎల్​ అనేది భారత్​ తయారుచేసిన ఓ అంతర్జాతీయ టోర్నీ. ప్రపంచంలోనే ప్రీమియర్​ క్రికెట్​ను అందిస్తున్న ఈవెంట్​ ఇది. అందుకే ఈ అంతర్జాతీయ వేదికపై అంతర్జాతీయ క్రికెటర్లు ఉండాల్సిందే" అని వాడియా అభిప్రాయపడ్డారు.

Kings XI Punjab co-owner Ness Wadia
నెస్​ వాడియా

భిన్నాభిప్రాయాలు..

ఐపీఎల్​ నిర్వహణపై ఆయా ఫ్రాంచైజీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ ఆటగాళ్లకు ప్రయాణాల ఆంక్షల నేపథ్యంలో భారతీయ ఆటగాళ్లతో ఆడించినా సరిపోతుందని రాజస్థాన్​ జట్టు ప్రతిపాదించగా.. ఆ నిర్ణయాన్ని చెన్నై సూపర్​కింగ్స్​, పంజాబ్​ జట్లు వ్యతిరేకించాయి.

"ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు మనం ఎదురుచూడక తప్పదు. వైరస్​ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో చెప్పలేం. ఇప్పటికే జర్మనీ ఫుట్​బాల్​ పోటీలు మొదలుపెట్టాలని చూస్తోంది. మనం కూడా ఐపీఎల్​ను నిర్వహిస్తే అభిమానులు బాగా ఆదరిస్తారు. కానీ అందుకు కాస్త సమయం పడుతుంది. వచ్చే రెండు నెలల్లో పరిస్థితులను బట్టే టోర్నీ​ నిర్వహణ ఆధారపడి ఉంటుంది"

-నెస్​ వాడియా

ప్రయాణ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఐపీఎల్​లో పాల్గొనేందుకు ఆటగాళ్లు భారత్​కు వస్తారో లేదో అనేది కీలకంగా మారింది. బీసీసీఐ చాలా అంశాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని వాడియా చెప్పారు.

జులై-ఆగస్టులో ఈ మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్-డిసెంబర్​ మధ్య సమయానుగుణంగా ఐపీఎల్​ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్​-నవంబర్​ మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచకప్​పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఐపీఎల్​పై ఆశలు ఇంకా చిగురిస్తున్నాయి.

ఈ ఏడాది ఐపీఎల్​ జరగకపోతే దాదాపు 4వేల కోట్లపైనే ఆదాయం నష్టపోవాల్సి వస్తుందని అంచనా వేసింది బీసీసీఐ. ఇది టీ20 వరల్డ్​కప్​ నష్టం కంటే చాలా ఎక్కువ.

ఇదీ చూడండి: ఐపీఎల్​ జట్టులో ధోనీకి దక్కని చోటు!

ఐపీఎల్​.. ప్రపంచంలోనే అతిపెద్ద, ధనిక క్రికెట్​ లీగ్​. అలాంటి మెగా ఈవెంట్​ను విదేశీ ఆటగాళ్లు లేకుండా నిర్వహించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ సహ యజమాని నెస్​వాడియా. కరోనా సమయంలో ఈ లీగ్​ నిర్వహణ, రద్దుపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బీసీసీఐ తొందరపడినట్టే అని అన్నారు.

"ఐపీఎల్​ అనేది భారత్​ తయారుచేసిన ఓ అంతర్జాతీయ టోర్నీ. ప్రపంచంలోనే ప్రీమియర్​ క్రికెట్​ను అందిస్తున్న ఈవెంట్​ ఇది. అందుకే ఈ అంతర్జాతీయ వేదికపై అంతర్జాతీయ క్రికెటర్లు ఉండాల్సిందే" అని వాడియా అభిప్రాయపడ్డారు.

Kings XI Punjab co-owner Ness Wadia
నెస్​ వాడియా

భిన్నాభిప్రాయాలు..

ఐపీఎల్​ నిర్వహణపై ఆయా ఫ్రాంచైజీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ ఆటగాళ్లకు ప్రయాణాల ఆంక్షల నేపథ్యంలో భారతీయ ఆటగాళ్లతో ఆడించినా సరిపోతుందని రాజస్థాన్​ జట్టు ప్రతిపాదించగా.. ఆ నిర్ణయాన్ని చెన్నై సూపర్​కింగ్స్​, పంజాబ్​ జట్లు వ్యతిరేకించాయి.

"ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు మనం ఎదురుచూడక తప్పదు. వైరస్​ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో చెప్పలేం. ఇప్పటికే జర్మనీ ఫుట్​బాల్​ పోటీలు మొదలుపెట్టాలని చూస్తోంది. మనం కూడా ఐపీఎల్​ను నిర్వహిస్తే అభిమానులు బాగా ఆదరిస్తారు. కానీ అందుకు కాస్త సమయం పడుతుంది. వచ్చే రెండు నెలల్లో పరిస్థితులను బట్టే టోర్నీ​ నిర్వహణ ఆధారపడి ఉంటుంది"

-నెస్​ వాడియా

ప్రయాణ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఐపీఎల్​లో పాల్గొనేందుకు ఆటగాళ్లు భారత్​కు వస్తారో లేదో అనేది కీలకంగా మారింది. బీసీసీఐ చాలా అంశాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని వాడియా చెప్పారు.

జులై-ఆగస్టులో ఈ మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్-డిసెంబర్​ మధ్య సమయానుగుణంగా ఐపీఎల్​ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్​-నవంబర్​ మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచకప్​పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఐపీఎల్​పై ఆశలు ఇంకా చిగురిస్తున్నాయి.

ఈ ఏడాది ఐపీఎల్​ జరగకపోతే దాదాపు 4వేల కోట్లపైనే ఆదాయం నష్టపోవాల్సి వస్తుందని అంచనా వేసింది బీసీసీఐ. ఇది టీ20 వరల్డ్​కప్​ నష్టం కంటే చాలా ఎక్కువ.

ఇదీ చూడండి: ఐపీఎల్​ జట్టులో ధోనీకి దక్కని చోటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.