ETV Bharat / sports

'ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నమెంట్​ ఐపీఎల్​'

author img

By

Published : Jul 31, 2020, 8:29 AM IST

ఐపీఎల్​, పీసీఎల్​​ లీగ్​ల మధ్య చాలా వ్యత్యాసం ఉందని అన్నాడు పాకిస్థాన్​ మాజీ కెప్టెన్​ వసీం అక్రమ్​. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నమెంట్​ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్​ అని పేర్కొన్నాడు.

Wasim Akram
వాసిం అక్రమ్

ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నమెంట్​ ఐపీఎల్​ అని పాకిస్థాన్​ మాజీ కెప్టెన్​ వసీం అక్రమ్ అన్నాడు. ఇటీవలే ఓ యూట్యూబ్​ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్రమ్​.. ఐపీఎల్​, పీసీఎల్​ల మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ​

ఐపీఎల్​లో వచ్చిన లాభాల్ని ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​లో తిరిగి పెట్టుబడి పెడుతున్నందుకు బీసీసీఐని ప్రశంసించాడు అక్రమ్​. ఇటీవలి కాలంలో భారత్​ నమ్మకమైన ఆటగాళ్లను సంపాదించిందని పేర్కొన్నాడు.

Wasim Akram
వసీం అక్రమ్

"ఐపీఎల్​, పీఎస్​ఎల్​కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గత ఐదారు సంవత్సరాలుగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లు చాలా పెట్టుబడి పెట్టారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ఐపీఎల్​ అతిపెద్ద టోర్నమెంట్​. ఆటగాళ్లను కొనేందుకు ఒక జట్టు బడ్జెట్​ 60 - 80 కోట్లు. పాకిస్థాన్​ కరెన్సీకి ఇది రెట్టింపు. అందుకే ఈ విధంగా వచ్చిన లాభాన్ని.. బీసీసీఐ తిరిగి ఫస్ట్ క్లాస్​ క్రికెట్​లో పెట్టుబడి పెడుతోంది.

వసీం అక్రమ్​, పాక్​ మాజీ కెప్టెన్​

ఐపీఎల్​లో చాలా మంది ఆటగాళ్లకు ప్రవీణ్​ ఆమ్రే వంటి వ్యక్తిగత కోచ్​లు ఉన్నారని పేర్కొన్నాడు అక్రమ్. భారత బ్యాట్స్​మన్​ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారని.. వారి ఆటతీరు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపాడు.

కరోనా వైరస్ కారణంగా నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​ను చివరకు యూఏఈలో నిర్వహించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఈ లీగ్​ జరగనుందని ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేశ్​ పటేల్​ ఇటీవలే తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నమెంట్​ ఐపీఎల్​ అని పాకిస్థాన్​ మాజీ కెప్టెన్​ వసీం అక్రమ్ అన్నాడు. ఇటీవలే ఓ యూట్యూబ్​ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్రమ్​.. ఐపీఎల్​, పీసీఎల్​ల మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ​

ఐపీఎల్​లో వచ్చిన లాభాల్ని ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​లో తిరిగి పెట్టుబడి పెడుతున్నందుకు బీసీసీఐని ప్రశంసించాడు అక్రమ్​. ఇటీవలి కాలంలో భారత్​ నమ్మకమైన ఆటగాళ్లను సంపాదించిందని పేర్కొన్నాడు.

Wasim Akram
వసీం అక్రమ్

"ఐపీఎల్​, పీఎస్​ఎల్​కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గత ఐదారు సంవత్సరాలుగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లు చాలా పెట్టుబడి పెట్టారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ఐపీఎల్​ అతిపెద్ద టోర్నమెంట్​. ఆటగాళ్లను కొనేందుకు ఒక జట్టు బడ్జెట్​ 60 - 80 కోట్లు. పాకిస్థాన్​ కరెన్సీకి ఇది రెట్టింపు. అందుకే ఈ విధంగా వచ్చిన లాభాన్ని.. బీసీసీఐ తిరిగి ఫస్ట్ క్లాస్​ క్రికెట్​లో పెట్టుబడి పెడుతోంది.

వసీం అక్రమ్​, పాక్​ మాజీ కెప్టెన్​

ఐపీఎల్​లో చాలా మంది ఆటగాళ్లకు ప్రవీణ్​ ఆమ్రే వంటి వ్యక్తిగత కోచ్​లు ఉన్నారని పేర్కొన్నాడు అక్రమ్. భారత బ్యాట్స్​మన్​ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారని.. వారి ఆటతీరు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపాడు.

కరోనా వైరస్ కారణంగా నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​ను చివరకు యూఏఈలో నిర్వహించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఈ లీగ్​ జరగనుందని ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేశ్​ పటేల్​ ఇటీవలే తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.