ETV Bharat / sports

ఐపీఎల్​ నిర్వహణపై ఆగస్టు 2న పూర్తి స్పష్టత

author img

By

Published : Jul 28, 2020, 12:41 PM IST

Updated : Jul 29, 2020, 4:11 PM IST

ఆగస్టు 2న సమావేశం కానున్న ఐపీఎల్ పాలకమండలి.. పలు అంశాల గురించి చర్చించనుంది. దీనితోపాటు పలు విషయాలపై స్పష్టతనివ్వనుంది.

ఆగస్టు 2న పాలకమండలి భేటీ.. ఐపీఎల్​పై పూర్తి స్పష్టత
ముంబయి ఇండియన్స్ జట్టు

ఇండియన్ ప్రీమియర్ లీగ్​.. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. భారత్​లో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండటం వల్లే విదేశాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. లీగ్ జరపడం, ఇతర సదుపాయాల గురించి చర్చించేందుకు ఆగస్టు 2న ఐపీఎల్ పాలకమండలి సమావేశం కానుంది. ఈ భేటీకి గంగూలీ, జైషా మినహాయించి మిగతా సభ్యులందరూ హాజరు కానున్నారు. బీసీసీఐలో వీరిద్దరి పదవీకాలం ముగియడమే ఇందుకు కారణం.

IPL TROPHY 2020
ఐపీఎల్ ట్రోఫీ 2020

ఈ సమావేశంలో భాగంగా ఫ్రాంచైజీలకు వచ్చే నష్టం, బయో సెక్యూర్​ విధానంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​ల నిర్వహణ గురించి ప్రధానంగా చర్చించనున్నారు.

అయితే యూఏఈ వెళ్లే క్రికెటర్లతో పాటు వారి కుటుంబాలను పంపించాలా? వద్దా? అనే విషయమై ఫ్రాంచైజీలు తర్జనభర్జన పడుతున్నాయి. దీనిలో పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాయి.

IPL TO BE HELD IN UAE
యూఏఈలో జరగనున్న ఐపీఎల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్​.. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. భారత్​లో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండటం వల్లే విదేశాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. లీగ్ జరపడం, ఇతర సదుపాయాల గురించి చర్చించేందుకు ఆగస్టు 2న ఐపీఎల్ పాలకమండలి సమావేశం కానుంది. ఈ భేటీకి గంగూలీ, జైషా మినహాయించి మిగతా సభ్యులందరూ హాజరు కానున్నారు. బీసీసీఐలో వీరిద్దరి పదవీకాలం ముగియడమే ఇందుకు కారణం.

IPL TROPHY 2020
ఐపీఎల్ ట్రోఫీ 2020

ఈ సమావేశంలో భాగంగా ఫ్రాంచైజీలకు వచ్చే నష్టం, బయో సెక్యూర్​ విధానంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​ల నిర్వహణ గురించి ప్రధానంగా చర్చించనున్నారు.

అయితే యూఏఈ వెళ్లే క్రికెటర్లతో పాటు వారి కుటుంబాలను పంపించాలా? వద్దా? అనే విషయమై ఫ్రాంచైజీలు తర్జనభర్జన పడుతున్నాయి. దీనిలో పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాయి.

IPL TO BE HELD IN UAE
యూఏఈలో జరగనున్న ఐపీఎల్
Last Updated : Jul 29, 2020, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.