ETV Bharat / sports

రిచర్డ్​సన్​కు భారీ ధర.. పంజాబ్ సొంతం  ​

ఐపీఎల్​ వేలంలో విదేశీ బౌలర్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్​ జే రిచర్డ్​సన్​ రూ. 14 కోట్లకు అమ్ముడయ్యాడు. ఇతడిని పంజాబ్​ జట్టు దక్కించుకుంది.

author img

By

Published : Feb 18, 2021, 4:49 PM IST

ipl-auction-2021-richardson
రూ.14 కోట్లకు రిచర్డ్​సన్​ను పంజాబ్​ సొంతం ​

చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్​ వేలంలో ఆస్ట్రేలియా బౌలర్​ జే రిచర్డ్​సన్​ రూ.14 కోట్లకు అమ్ముడుపోయాడు. కోటిన్నర రూపాయల బేస్​ ప్రైస్​తో ఉన్న ఈ ఆసీస్​ బౌలర్​ను పంజాబ్​ జట్టు కొనుగోలు చేసింది.

న్యూజిలాండ్​ పేసర్​ ఆడమ్ మిల్నేను ముంబయి జట్టు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల కనీస విలువ జాబితాలో ఉన్న మిల్నేను రూ.3.20 కోట్లకు ముంబయి దక్కించుకుంది.

మరో ఆసీస్​ బౌలర్​ కౌల్టర్​నైల్​ను ముంబయి సొంతం చేసుకుంది. రూ.5 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది.

భారత బౌలర్​ ఉమేష్​ యాదవ్​ బేస్​ ప్రైస్​కు అమ్ముడయ్యాడు. దిల్లీ ఫ్రాంచైజీ అతన్ని కోటి రూపాయలకు కొనుగోలు చేసింది.

చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్​ వేలంలో ఆస్ట్రేలియా బౌలర్​ జే రిచర్డ్​సన్​ రూ.14 కోట్లకు అమ్ముడుపోయాడు. కోటిన్నర రూపాయల బేస్​ ప్రైస్​తో ఉన్న ఈ ఆసీస్​ బౌలర్​ను పంజాబ్​ జట్టు కొనుగోలు చేసింది.

న్యూజిలాండ్​ పేసర్​ ఆడమ్ మిల్నేను ముంబయి జట్టు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల కనీస విలువ జాబితాలో ఉన్న మిల్నేను రూ.3.20 కోట్లకు ముంబయి దక్కించుకుంది.

మరో ఆసీస్​ బౌలర్​ కౌల్టర్​నైల్​ను ముంబయి సొంతం చేసుకుంది. రూ.5 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది.

భారత బౌలర్​ ఉమేష్​ యాదవ్​ బేస్​ ప్రైస్​కు అమ్ముడయ్యాడు. దిల్లీ ఫ్రాంచైజీ అతన్ని కోటి రూపాయలకు కొనుగోలు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.