ETV Bharat / sports

'ముంబయితో మ్యాచ్​ అంటే గట్టి పోటీనే!'

author img

By

Published : Apr 9, 2021, 4:15 PM IST

Updated : Apr 9, 2021, 4:34 PM IST

ఐపీఎల్​లో తమ జట్టు ముంబయితో ఆడనున్న తొలిమ్యాచ్​కు ముందు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. డిఫెండింగ్ ఛాంపియన్​తో మ్యాచ్​ కోసం తాము ఆసక్తికరంగా చూస్తున్నట్లు తెలిపాడు. ఇరుజట్ల మధ్య గొప్ప పోటీ ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించాడు.

Virat Kohli
'ముంబయితో మ్యాచ్​ అంటే గట్టి పోటీనే!'

ఐపీఎల్​ డిఫెండింగ్​ ఛాంపియన్స్​​ ముంబయి ఇండియన్స్​తో జరగబోయే ప్రారంభ మ్యాచ్​పై స్పందించాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇరు జట్ల మధ్య​ తొలి మ్యాచ్​ గొప్పగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

"ముంబయితో జరిగే మ్యాచ్​లో మా బలాలు, నైపుణ్యాలపై దృష్టిసారిస్తాం. రోహిత్ సేన ఛాంపియన్ జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి మ్యాచ్​ను ఎలా గెలవాలో , వారికున్న బలాలేంటో వారికి తెలుసు. ముంబయి గురించి మరీ ఎక్కువగా గురించి ఆలోచిస్తే.. మేము ఏం చేస్తున్నామనేది స్పష్టత ఉండదు. ఆటలో ఎవరు బాగా ఆడితే వారినే విజయం వరిస్తుంది. ముంబయితో పోటీ పడటం ఆసక్తిగా ఉంటుంది. అది చాలా బలమైన జట్టు. గతేడాది మేము రెండు మ్యాచ్​ల్లో ఆడగా.. ఒకదాంట్లో మేము మరోదాంట్లో వారు గెలిచారు. మొదటి మ్యాచ్​ ఆసక్తికరంగా సాగింది. భారీ స్కోర్లు నమోదయ్యాయి. సూపర్​ ఓవర్​లో ఫలితం తేలింది. ఈ సారి కూడా ముంబయితో మ్యాచ్​ గొప్పగా ఉంటుందనుకుంటున్నాం"

-విరాట్ కోహ్లీ, బెంగుళూరు కెప్టెన్.

మరోవైపు ముంబయి ఇండియన్స్​తో జరిగే మొదటి మ్యాచ్​ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు ఆర్సీబీ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్. ప్రత్యర్థితో పోలిస్తే అనుభవం గల క్రికెటర్లు తమ టీమ్​లోనూ ఉన్నారని పేర్కొన్నాడు. ఈసారి ఐపీఎల్​లో అరంగేట్రం చేస్తున్న డానియల్ క్రిస్టియన్, మాక్స్​వెల్​, డాన్ సామ్స్​, రిచర్డ్​సన్​ మంచి అనుభవం గల వారని ఏబీ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: హేజిల్​వుడ్​ స్థానంలో చెన్నైకి బెహ్రెండార్ఫ్

ఐపీఎల్​ డిఫెండింగ్​ ఛాంపియన్స్​​ ముంబయి ఇండియన్స్​తో జరగబోయే ప్రారంభ మ్యాచ్​పై స్పందించాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇరు జట్ల మధ్య​ తొలి మ్యాచ్​ గొప్పగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

"ముంబయితో జరిగే మ్యాచ్​లో మా బలాలు, నైపుణ్యాలపై దృష్టిసారిస్తాం. రోహిత్ సేన ఛాంపియన్ జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి మ్యాచ్​ను ఎలా గెలవాలో , వారికున్న బలాలేంటో వారికి తెలుసు. ముంబయి గురించి మరీ ఎక్కువగా గురించి ఆలోచిస్తే.. మేము ఏం చేస్తున్నామనేది స్పష్టత ఉండదు. ఆటలో ఎవరు బాగా ఆడితే వారినే విజయం వరిస్తుంది. ముంబయితో పోటీ పడటం ఆసక్తిగా ఉంటుంది. అది చాలా బలమైన జట్టు. గతేడాది మేము రెండు మ్యాచ్​ల్లో ఆడగా.. ఒకదాంట్లో మేము మరోదాంట్లో వారు గెలిచారు. మొదటి మ్యాచ్​ ఆసక్తికరంగా సాగింది. భారీ స్కోర్లు నమోదయ్యాయి. సూపర్​ ఓవర్​లో ఫలితం తేలింది. ఈ సారి కూడా ముంబయితో మ్యాచ్​ గొప్పగా ఉంటుందనుకుంటున్నాం"

-విరాట్ కోహ్లీ, బెంగుళూరు కెప్టెన్.

మరోవైపు ముంబయి ఇండియన్స్​తో జరిగే మొదటి మ్యాచ్​ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు ఆర్సీబీ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్. ప్రత్యర్థితో పోలిస్తే అనుభవం గల క్రికెటర్లు తమ టీమ్​లోనూ ఉన్నారని పేర్కొన్నాడు. ఈసారి ఐపీఎల్​లో అరంగేట్రం చేస్తున్న డానియల్ క్రిస్టియన్, మాక్స్​వెల్​, డాన్ సామ్స్​, రిచర్డ్​సన్​ మంచి అనుభవం గల వారని ఏబీ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: హేజిల్​వుడ్​ స్థానంలో చెన్నైకి బెహ్రెండార్ఫ్

Last Updated : Apr 9, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.