ఈ ఏడాది ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న ఫ్రాంచైజీల్లో ముంబయి ఇండియన్స్ ఒకటి. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత.. శనివారం అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో జట్టు తొలి శిక్షణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా తదితరులు కసరత్తులు చేస్తూ కనిపించారు. ప్రతి చోటా కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.
-
📹 | DAY 1️⃣ | Training in UAE ✅#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL pic.twitter.com/rIRYpbZTsZ
— Mumbai Indians (@mipaltan) August 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">📹 | DAY 1️⃣ | Training in UAE ✅#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL pic.twitter.com/rIRYpbZTsZ
— Mumbai Indians (@mipaltan) August 29, 2020📹 | DAY 1️⃣ | Training in UAE ✅#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL pic.twitter.com/rIRYpbZTsZ
— Mumbai Indians (@mipaltan) August 29, 2020
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని అన్నాడు. "ఇక్కడ చాలా వేడిగా ఉంది. కాబట్టి పరిస్థితులు, ఇక్కడి పిచ్ వాతావరణం ఇలా అన్నింటినీ అనుగుణంగా మలచుకోవాలి. కొద్ది రోజులు శిక్షణ తీసుకోవడం మంచిది" అని రోహిత్ పేర్కొన్నాడు.
-
Safety first ✅#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @MahelaJay @rdchahar1 pic.twitter.com/ud0XBsllwf
— Mumbai Indians (@mipaltan) August 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Safety first ✅#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @MahelaJay @rdchahar1 pic.twitter.com/ud0XBsllwf
— Mumbai Indians (@mipaltan) August 29, 2020Safety first ✅#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @MahelaJay @rdchahar1 pic.twitter.com/ud0XBsllwf
— Mumbai Indians (@mipaltan) August 29, 2020
హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్ తదితరులూ.. క్వారంటైన్ పూర్తి చేసుకుని సుదీర్ఘ కాలం తర్వాత మైదానంలో అడుగుపెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 19న ప్రారంభం కానుంది లీగ్. బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ను నిర్వహించనున్నారు.