రవీంద్ర జడేజా.. ఐపీఎల్లోని ఉత్తమ ఆల్రౌండర్లలో ఒకడు. ఈ మెగాలీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. 2012లో తొలిసారిగా రూ.9.72 కోట్లకు ఇతడిని ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అప్పుడు ఆ జట్టులో అత్యధిక పారితోషికం తీసుకున్న ఆటగాడు అతనొక్కడే. అనంతరం 2019,20 సీజన్కు వచ్చేసరికి జట్టుకు వెన్నెముకలా ఎదిగాడు.
మొత్తంగా కెరీర్లో సీఎస్కేతో సహా రాజస్థాన్ రాయల్స్, కొచి టస్కర్స్ కేరళ, గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన జడేజా.. 170 మ్యాచ్ల్లో 1,927 పరుగులు చేశాడు. తద్వారా ఈ సీజన్లో అరుదైన మైలురాయిని అందుకునేందుకు సిద్ధమయ్యాడు. మరో 73 పరుగులు చేస్తే 100వికెట్లు సహా 2 వేల పరుగుల మార్క్ను చేజిక్కించుకోనున్నాడు. ఫలితంగా ఐపీఎల్లోనే ఈ ఘనత అందుకున్న తొలి ఆల్రౌండర్గా రికార్డుకెక్కనున్నాడు.
సెప్టెంబరు 19న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో ధోనీ నేతృత్వంలోని సీఎస్కే, రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.